UP: రీల్స్ మోజులో కుమార్తెను నీటిలో వదిలేసిన తల్లి.. నీట మునిగి చిన్నారి మృతి(వీడియో)
- యూపీలో దారుణం
- రీల్స్ మోజులో కుమార్తెను పోగొట్టుకున్న మహిళ
- తల్లి మందే నీట మునిగి చిన్నారి మృతి
- వీడియో చూసి కన్నీరుమున్నీరుగా విలపించిన కుటుంబీకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీ రాష్ట్రం ఘాజీపూర్లోని సైద్పూర్ నగరంలో పక్కా ఘాట్ వద్ద ఐదేళ్ల అమాయక చిన్నారి తన తల్లి ఎదుట గంగా నదిలో మునిగి మృతి చెందింది. మునిగిపోతున్న బాలికను చూడకుండా తల్లి మొబైల్తో రీలు తీస్తోంది. యువతి నీటిలో మునిగిన వీడియో కూడా రికార్డ్ చేయబడింది. స్థానిక డైవర్ సహాయంతో రెండు గంటల తర్వాత బాలిక మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
రీల్స్ వీడియో తీస్తూ…
వారణాసిలోని చౌబేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉమ్రా గ్రామానికి చెందిన సందీప్ పాండే భార్య అంకితా పాండే.. తన ఐదేళ్ల ఏకైక కుమార్తె తాన్యతో కలిసి ఛత్ కోసం సైద్పూర్ ప్రాంతం బౌర్వాన్ గ్రామంలోని తన తండ్రి కపిల్ మిశ్రా ఇంటికి వచ్చింది. సోమవారం అంకిత తన ఐదేళ్ల కుమార్తె, తల్లి లక్ష్మి, సోదరి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఛత్పూజ సందర్భంగా గంగాస్నానం చేసేందుకు సైద్పూర్ నగర్లోని పక్కా ఘాట్కు వచ్చింది. అక్కడ గంగా నదిలో స్నానం చేస్తున్నారు. తాన్య తల్లి అంకిత బయట నిలబడి అందరూ స్నానం చేస్తున్న వీడియో రీల్ చేస్తోంది.
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
స్నానం చేస్తుండగా ఘటన..
స్నానం చేస్తుండగా.. తాన్య ఒక్కసారిగా లోతైన ప్రాంతానికి వెళ్లి నీటిలో మునిగిపోవడం ప్రారంభించింది. కొద్దిసేపటికే తాన్య గంగలో మునిగిపోయింది. తాన్య మునిగిపోతుండగా.. తల్లి అంకిత ఆమె సోదరి ఇతర వ్యక్తులను వీడియో తీస్తోంది. ఈ వీడియోలో బాలిక కూడా మునిగిపోతున్నట్లు కనిపిస్తుంది. కానీ ఆ బాలికను ఎవరూ గమనించలేదు. చాలా సేపటికి కుటుంబసభ్యులు తాన్య కోసం వెతకడం ప్రారంభించారు. కొద్దిసేపటికే కుటుంబ సభ్యుల్లో కేకలు వచ్చాయి. అందరూ వీడియో చూసేసరికి తాన్య మునిగిపోయి కనిపించింది.
రెండు గంటల తర్వాత మృతదేహం లభ్యం..
ఈ ఘటనపై స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కొద్దిసేపటికే సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక డైవర్లు, పోలీసుల సహాయంతో సంఘటన జరిగిన రెండు గంటల తర్వాత తాన్య మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తాన్యను వెంటనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లి అంకితతో సహా కుటుంబసభ్యులు రోదనలు మిన్నంటాయి. సైద్పూర్ అవుట్పోస్ట్ ఇంచార్జి మనోజ్ కుమార్ పాండే మృతదేహానికి పంచనామా చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
गाजीपुर में 4 साल की बच्ची परिवार वालों के सामने ही डूब गई, मौसी मोबाइल में रील बनाती रही, आप ऐसी मौसी को क्या कहा जाए जो रियल बनाने में केवल लगी हुई थी और एक मासूम बच्ची डूब गई। @ghazipurpolice @Uppolice pic.twitter.com/gHcNdOgcG6
— Atul Kumar Yadav 🇮🇳 (@Atullive01) November 4, 2024
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!