Madhya Pradesh: 7వ తరగతి విద్యార్థినిపై 9వ తరగతి విద్యార్థి అత్యాచారం..
- 7వ తరగతి విద్యార్థినిపై 9వ తరగతి విద్యార్థి అత్యాచారం
- మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఘటన
- నిందితుడు విద్యార్థిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు బహోదాపూర్ పోలీస్ స్టేషన్లో నిందితుడు విద్యార్థిపై పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. గ్వాలియర్లో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి 7వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జూలై 13న జరిగింది. ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం.. ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి చర్చించారు. ఆ తర్వాత ఆదివారం.. పాఠశాల ప్రిన్సిపాల్ అజయ్ సింగ్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
RC16: రెహమాన్తో బిజీగా బుచ్చిబాబు.. మంచి స్పీడ్ మీద ఉన్నారే..
Also Read
- High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో 1.7 కేజీల బంగారం.. 8.6 కేజీల వెండి లభ్యం..?
- Jeetendra Mishra: ఆపరేషన్ సిందూర్ హీరో.. రామ మందిర కొత్త సీఈఓ జితేంద్ర మిశ్రా ఎవరు.?
- PM Kisan 24th Installment: రైతులకు గుడ్న్యూస్.. పీఎం కిసాన్లో రూ.2,000 బదులు రూ.4,000.. ఎవరికంటే..?
కాగా.. వెంటనే నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన గురించి తెలియగానే పాఠశాల యాజమాన్యం ఈ విషయం బయటకు తెలియకుండా.. పిల్లలిద్దరినీ వేర్వేరు గదుల్లో ఉంచి నిఘాలో ఉంచింది. ఈ విషయాన్ని మొదట పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పకుండా సీక్రెట్ గా ఉంచింది. అయితే.. జూలై 13న సాయంత్రం బాధిత విద్యార్థిపై వైద్యులు ఆరోగ్య పరీక్షలు చేయగా.. టాయిలెట్లో కొంచెం రక్తం వచ్చింది.
Prime Minister Modi: రికార్డు సృష్టించిన ప్రధాని.. మోడీకి ఎక్స్ లో 100 మిలియన్ల ఫాలోవర్స్..
దీంతో విద్యార్థి అత్యాచారం చేశాడని వెంటనే ఇరువురి విద్యార్థుల కుటుంబాలను పాఠశాలకు పిలిపించారు. ఈ విషయం గురించి ఇద్దరు తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో.. బాలిక తల్లిదండ్రులు నిందితుడిపై కేసు నమోదు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ ప్రిన్సిపాల్ ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా.. పాఠశాలలో జరిగిన ఈ ఘటన పాఠశాల నిర్వహణపై ప్రశ్నార్థకంగా మారింది. ఇంతకుముందు ఏడేళ్ల క్రితం కూడా ఈ పాఠశాలలో ర్యాగింగ్ వ్యవహారం జరిగింది. అయితే.. తాజాగా ఈ ఘటన వెలుగులోకి రావడంతో పాఠశాలపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
-
Fake Currency : యూట్యూబ్ చూసి నకిలీ నోట్లు.. హైదరాబాద్లో బిగ్ గ్యాంగ్ గుట్టురట్టు
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో 1.7 కేజీల బంగారం.. 8.6 కేజీల వెండి లభ్యం..?
-
Jeetendra Mishra: ఆపరేషన్ సిందూర్ హీరో.. రామ మందిర కొత్త సీఈఓ జితేంద్ర మిశ్రా ఎవరు.?
-
PM Kisan 24th Installment: రైతులకు గుడ్న్యూస్.. పీఎం కిసాన్లో రూ.2,000 బదులు రూ.4,000.. ఎవరికంటే..?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!