మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు బహోదాపూర్ పోలీస్ స్టేషన్లో నిందితుడు విద్యార్థిపై పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. గ్వాలియర్లో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి 7వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.