Pakistan: 150 ఏళ్ల నాటి హిందూ దేవాలయాన్ని కూల్చివేసిన పాకిస్థాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ దేశంలోని కరాచీలో ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన హిందూ దేవాలయాన్ని అక్కడి అధికారులు కూల్చివేసింది. కరాచీలోని సోల్జర్ బజార్లో 150 ఏళ్లకుపైగా చరిత్ర కల్గిన మారిమాత ఆలయం ఉంది. అయితే, షాపింగ్ ప్లాజా నిర్మించేందుకు గత శుక్రవారం గుర్తు తెలియని బిల్డర్ ఆలయాన్ని పడగొట్టారు. ఆలయ భూమిని షాపింగ్ ప్లాజా ప్రమోటర్కు రూ.7కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది. ఈ ఆలయాన్ని పోలీసుల సమక్షంలో బూల్డోజర్ల సహాయంతో కూల్చివేశారు. ఈ ఆలయాన్ని కరాచీలోని మద్రాసీ హిందూ సమాజం నిర్వహిస్తోంది. అయితే, ఆలయ నిర్మాణం చాలా పురాతనమైందని, ఆలయ నిర్వాహకులు అయిష్టంగానే తాత్కాలికంగా దేవతా విగ్రహాలను చిన్న గదిలో ఉంచి.. అక్కడ కొన్ని పునర్నిర్మాణ పనులు చేస్తున్నాట్లు తెలుస్తోంది.
Read Also: Pawan Kalyan: సీఐ అంజూయాదవ్పై ఎస్పీకి పవన్ కల్యాణ్ ఫిర్యాదు.. లేఖలో ఏముందంటే..
Also Read
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- KAAKA: రూమర్స్కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
కాగా గతేడాది జూన్లో మారిమాత దేవాలయంలోని దేవతా విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారని పంచ్ముఖి హనుమాన్ మందిర్ కేర్టేకర్ రామ్నాథ్ మిశ్రా మహారాజ్ వెల్లడించారు. ఆలయం కూల్చివేతకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం తెలియదని ఆయన అన్నారు. దేవాలయాన్ని కూల్చివేశారని, ప్రహరి, ప్రధాన ద్వారాన్ని వదిలేసి.. లోపలి నిర్మాణాన్ని పూర్తిగా పడగొట్టారని ఆయన ఆరోపించారు.
Read Also: Mobile Phones Banned: కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్స్ నిషేదం
ఈ ఆలయాన్ని దాదాపు 150 ఏళ్ల కిందట నిర్మించారని, దాని ప్రాంగణం కింద నిధి ఉన్నట్లు అనేక కథలు చెప్పుకునేవారని తెలుస్తోంది. అయితే, సుమారు 400-500 చదరపు గజాల విస్తీర్ణంలోని ఈ ఆలయంపై భూకబ్జాదారులు కన్నేశారు. అయితే, ఈ ఆలయం ప్రమాదకరమైన కట్టడమని అధికారులు ప్రకటించడంతో కూల్చివేసినట్లు స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాగా పాకిస్తాన్లో హిందువులు అతిపెద్ద మైనారిటీ కమ్యూనిటీగా కొనసాగుతున్నారు. పాకిస్తాన్ హిందూ జనాభాలో ఎక్కువ మంది సింధ్ ప్రావిన్స్లో స్థిరపడ్డారు. ఈ ఘటనపై హిందూ సమాజం హిందూ కౌన్సిల్, సింధ్ ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీ షా, సింధ్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్కు విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!