Pawan Kalyan: సీఐ అంజూయాదవ్పై ఎస్పీకి పవన్ కల్యాణ్ ఫిర్యాదు.. లేఖలో ఏముందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: జనసేన నేత సాయిపై దాడి చేసిన శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్, రెండు చెంపలు వాయించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.. మీడియాలోనూ ప్రముఖంగా ప్రసారం అయ్యింది.. ఈ ఘటనను మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించి సీఐ అంజూయాదవ్కు నోటీసులు జారీ చేసింది.. ఇక, తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై చేయి పడితే తానే ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతానని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ రోజు తిరుపతికి వెళ్లారు.. సీఐ అంజూయాదవ్పై తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్రెడ్డికి ఫిర్యాదు చేశారు.. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి తిరుపతికి చేరుకున్నారు.. జనసేన కార్యకర్తలతో కలిసి భారీగా ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి.. ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. సీఐపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Also: Madhyapradesh: దారుణం..అప్పును ఇవ్వమన్నందుకు మామను ముక్కలుగా నరికిన అల్లుడు..
Also Read
- DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
ఎస్పీని కలిసి వినతిపత్రం ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. శ్రీకాళహస్తి ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేశాను.. ఎవరికి ఇబ్బంది లేకుండా.. ఆయుధాలు లేకుండా శాంతియుత నిరసన చేపట్టడం రాజ్యాంగం కల్పించిన హక్కు.. సాయి శాంతియుతంగా నిరసన చేపట్టారు.. కానీ, సీఐ రాజ్యంగా విరుద్ధంగా సాయిని కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన నేతలు చాలా క్రమశిక్షణతో ఉంటారు.. పోలీసులకు ప్రభుత్వం నుండి ఒత్తిడి ఉంటుంది.. దానిని ఒకస్థాయి వరకు అర్థం చేసుకుంటాం.. కానీ, ఇలా ప్రవర్తించడం మాత్రం సరికాదన్నారు.. ఇక, సుమోటోగా కేసు తీసుకున్న మానవ హక్కల సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ, జనసైనికులు క్రమశిక్షతో ఉంటారు.. పోలీసులు అంత డిసిప్లెన్ లా అండ్ ఆర్డర్ ని కాపాడాలి.. హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇక, తిరుపతి పర్యటన ముగించుకొని ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్లారు పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
-
HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
-
AI Vs CRYPTO: రెచ్చిపోతున్న హ్యాకర్లు..వణికిపోతున్న ఇన్వెస్టర్లు.. క్రిప్టో కొంప కూల్చుతున్న ఏఐ..!
-
CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
-
Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..