Maheshwaram: కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో బీజేపీలోకి 8మంది కార్పొరేటర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చేవెళ్ల నియోజకవర్గంలో భారీ షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎనిమిది మంది కార్పొరేటర్లు భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరికి చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అందెల శ్రీరాములు కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీలో చేరిన కార్పొరేటర్లు వీరే.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 2వ డివిజన్ కార్పొరేటర్ గౌరీ శంకర్, 12వ డివిజన్ కార్పొరేటర్ రవినాయక్, 31వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మీ రాజు, 44వ డివిజన్ కార్పొరేటర్ జ్యోతి కిషోర్ ఉండగా.. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన 32వ డివిజన్ కార్పొరేటర్ వేముల నర్సింహా, 36వ డివిజన్ కార్పొరేటర్ మల్లేష్ ముదిరాజ్, 28వ డివిజన్ కార్పొరేటర్ అరుణా ప్రభాకర్ రెడ్డితో పాటు కో- ఆప్షన్ మెంబర్ ఎల్లమ్మ ఉన్నారు.
Read Also: Raashii Khanna: ట్రెండీ అందాలతో మెరిసిపోతున్న రాశి ఖన్నా…
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
ఈ సందర్భంగా చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు. నరేంద్ర మోడీని మరోసారి దేశ ప్రధానిని కాకుండా ఎవ్వరూ ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ విజన్, మోడీ నాయకత్వానికి ఆకర్షితులైన చాలా మంది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరుతున్నారని ఆయన అన్నారు. ఎనిమిది మంది కార్పొరేటర్ల చేరికతో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ఖాతాలో చేరుతుందన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో మీర్పేట్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు.. మన కొత్త పాలక వర్గం రాగానే కేంద్రం నుంచి వచ్చే ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేసుకుందామని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!