Boat Capsized: ఘోర పడవ ప్రమాదం.. 76 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boat Capsized: నైజీరియాలోని అనంబ్రా రాష్ట్రంలో పెనువిషాదం చోటుచేసుకుంది. వరదల కారణంగా పడవ మునిగిన ఘటనలో దాదాపు 76 మంది ప్రాణాలు కోల్పోయారు. 85 మందితో వెళ్తున్న పడవ వరదల కారణంగా ఒక్కసారిగా బోల్తాపడి మునిగిపోవడమే ఇందుకు కారణం. పడవ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. పడవ ప్రమాదంపై నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ విచారం వ్యక్తం చేశారు.
Tallest Tree: ఫలించిన మూడేళ్ల నిరీక్షణ.. అమెజాన్లో ఆ చెట్టును చేరుకున్న శాస్త్రవేత్తలు
Also Read
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Sonam Wangchuk: ‘‘ఇది రెండో స్వాతంత్య్ర ఉద్యమం’’ సోనమ్ వాంగ్చుక్ సందేశం
“రాష్ట్రంలోని ఓగ్బారు ప్రాంతంలో వరదలు పెరగడంతో 85 మంది ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది, 76 మంది మరణించినట్లు అత్యవసర సంస్థలు ధ్రువీకరించాయి” అని నైజీరియా ప్రెసిడెన్సీ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదం వార్త తెలియగానే, నైజీరియా ప్రభుత్వం రెస్క్యూ, రికవరీ మిషన్లను వేగవంతం చేసింది. ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లాల్సిందిగా అన్ని ఇతర రెస్క్యూ, రిలీఫ్ ఏజెన్సీలను అధ్యక్షుడు ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసేందుకు ఈ ఫెర్రీలలో భద్రతా ప్రోటోకాల్లను తనిఖీ చేయాలని సంబంధిత ఏజెన్సీలను ఆయన ఆదేశించారు. “మృతుల ఆత్మకు శాంతి కలగాలని, ప్రతి ఒక్కరి భద్రత కోసం నేను ప్రార్థిస్తున్నాను, అలాగే ఈ విషాద ప్రమాదంలో మృతుల కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తున్నాను” అని అధ్యక్షుడు బుహారీ అన్నారు.
తాజావార్తలు
-
Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
-
Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!