Road Accident: రోడ్ డివైడర్ పైకి దూసుకెళ్లిన మినీ బస్సు .. 7 మహిళలు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఊహలకందనివే వాస్తవాలని ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు.. మరణం రాసిపెట్టి ఉంటె ఎవరు తప్పించుకోలేరు అని తరుచు మన పెద్దలు అంటుంటారు. అప్పటి వరకు బాగానే ఉన్న వ్యక్తి క్షణాల్లో మన కళ్ళ ముందే చనిపోయిన సంఘటనలు కోకొల్లలు. అలాంటి సంఘటనే ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. అప్పటి వరకు తోటివారితో సరదాగా మాట్లాడుకుంటున్న ఆ మహిళలని మృత్యువు కాటేసింది. ఈ హృదయ విదారక ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది..
Read Also: Colombo Weather: రిజర్వ్ డేకు కూడా వర్షం ముప్పు.. టీమిండియాను కలవరపెడుతున్న బ్యాడ్లక్!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
వివరాలలోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూరు జిల్లా నాట్రంపల్లి సమీపాన చండీయార్ దగ్గర వాహనం ఆగివున్న మినీ బస్సుని ఢీకొన్నది. దీంతో మినీ బస్సు రోడ్ డివైడర్ పై కూర్చున్న మహిళల పైకి దూసుకెళ్లింది.. ఈ ఘటనలో ఏడుగురు మహిళలు అక్కడికక్కడే మరణించారు. మరో 14 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో క్షతగాత్రులని చికిత్స కోసం తిరుపత్తూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.. ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందా..? లేక ఎవరైనా కావాలనే చేశారా? అనే యాంగిల్ లో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. కాగా ఈ సంఘటన అందరిని కలిచి వేస్తుంది.. అప్పటివరకు సరదాగా మాట్లాడిన వాళ్ళు కళ్ళ ముందే విగత జీవులుగా మారడం బాధాకరంగా మారింది.
Read Also:Crime: ఏంటి గుడి దగ్గర మూత్ర విసర్జన చేయొద్దని చెప్పినందుకు చంపేస్తారా..!
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!