Sudan conflict: తిండి దొరక్క 60 మంది చిన్నారులు మృతి..
సూడాన్ లో సంక్షోభం మరింతగా ముదురుతోంది. అక్కడి ప్రజల పరిస్థితులు దయనీయంగా మారిపోయాయి. అక్కడ కొనసాగుతున్న అంతర్గత ఘర్షణల కారణాలతో ఖార్టూమ్ అనాథాశ్రమంలో 60 మంది చిన్నారులు బలయ్యారు. వీరిలో శిశువులు, పసిబిడ్డలు, పెద్ద పిల్లలు ఉన్నారు. ఆహారం లేక ఆరోగ్యం క్షీణించి జ్వరంతో మరణించారని అక్కడి మీడియా తెలిపింది. అసలు ఇలా జరగడానికి కారణమేంటంటే.. సైన్యం-పారామిలిటరీ బలగాలకు మధ్య ఘర్షణ జరుగుతుంది. ఈ ఆధిపత్య పోరు సూడాన్ లో చిన్నారుల పాలిట మారణశాపంలా మారింది. తినడానికి తిండిలేకనే గత ఆరువారాలుగా ఆకలితో అలమటించి చనిపోయారు. కేవలం వారంలో రెండు రోజుల్లోనే 26 మంది చనిపోయారు. అంటే చూడొచ్చు అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో..
Also Read : Bhatti Vikramarka: మాయల పకీర్ లాంటి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు..
Also Read
- EkDin : కొడుకు పర్ఫెమెన్స్ చూసి కంటతడి పెట్టుకున్న స్టార్ హీరో
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్ నుంచి అతనొక్కడే మినహాయింపు.. కారణమేంటో..! సర్వత్రా చర్చ
- Snake Hiding Places: మీ ఇంట్లోకి పాము వచ్చిందా..? వాటికి ఇష్టమైన.. అవి దాక్కునే ప్రదేశాలు ఇవే..!
- Ruturaj Gaikwad: ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చిన గైక్వాడ్.. హాఫ్ సెంచరీ చేసినా అవమానకరమైన రికార్డు..!
చిన్నారులు మృత్యువాత వార్త సోషల్ మీడియాలో ఆందోళనను, ఆగ్రహాన్ని రేకెత్తించింది. దీంతో అక్కడి స్థానిక స్వచ్ఛంద సంస్థ ఆదివారం అనాథాశ్రమానికి ఆహారం, మందులు, బేబీ ఫార్ములాను అందించింది. ఐక్యరాజ్యసమితి పిల్లల ఏజెన్సీ, యునిసెఫ్-ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ సహాయంతో ఈ చర్యలు చేపట్టింది. మరోవైపు అక్కడి ఘర్షణ నేపథ్యంలో.. మరింత మంది పిల్లలు చనిపోయే అవకాశం ఉందనీ, ఖార్టూమ్ లోని అనాథశ్రమం నుంచి వారిని త్వరగా ఖాళీ చేయించాలని సిబ్బందిని హెచ్చరించారు. ఈ యుద్ధం ఏప్రిల్ 15న ప్రత్యర్థి సైనిక వర్గాల మధ్య చెలరేగి.. ఖర్టూమ్ సహా ఇతర పట్టణ ప్రాంతాలను యుద్ధభూమిగా మార్చింది.
Also Read : Sudigali Sudheer: ‘జబర్దస్త్’ కెవ్వు కార్తీక్ పెళ్లి.. ట్రెండ్ అవుతున్న సుధీర్
ఈ పోరులో పౌరులు, ముఖ్యంగా చిన్నారులు చనిపోయారు. కనీసం 860 మంది పిల్లలు, 190 మందికి పైగా పౌరులు మరణించారు. వేలాది మంది గాయపడ్డట్లు పౌరుల మరణాలను ట్రాక్ చేసే సూడాన్ డాక్టర్స్ సిండికేట్ తెలిపింది. అంతేకాకుండా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఘర్షణల నేపథ్యంలో 1.65 మిలియన్లకు పైగా ప్రజలు సూడాన్ లోని సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు. మరికొంత మంది దేశం విడిచి వెళ్లిపోయారు.
తాజావార్తలు
-
EkDin : కొడుకు పర్ఫెమెన్స్ చూసి కంటతడి పెట్టుకున్న స్టార్ హీరో
-
WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్ నుంచి అతనొక్కడే మినహాయింపు.. కారణమేంటో..! సర్వత్రా చర్చ
-
Snake Hiding Places: మీ ఇంట్లోకి పాము వచ్చిందా..? వాటికి ఇష్టమైన.. అవి దాక్కునే ప్రదేశాలు ఇవే..!
-
Designer Pen Smuggling: ఒక్కో పెన్ను రూ.50 వేలు.. కస్టమ్స్ సైతం నివ్వెరపోయే స్మగ్లింగ్!
-
Ruturaj Gaikwad: ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చిన గైక్వాడ్.. హాఫ్ సెంచరీ చేసినా అవమానకరమైన రికార్డు..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!