Giddalur: ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన 60 బీసీ కుటుంబాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామంలోని 60 కుటుంబాలకు చెందిన వాల్మీకులు గిద్దలూరు వైసీపీ ఇంచార్జి, మార్కాపురం శాసన సభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి సమక్షంలో వైఎస్సార్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి కుందూరు నాగార్జున రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. మండలంలో మేజర్ పంచాయతీ అయిన ముండ్లపాడు గ్రామ సర్పంచ్ పదవి విజయావకాశాలకు వాల్మీకి ఓటింగ్ కి చాలా ప్రాధాన్యత ఉంటుంది.
Read Also: KA Paul: పవన్పై పాల్ సంచలన వ్యాఖ్యలు.. ఇక, సినిమాలకు పనికిరాడు..!
Also Read
గతంలో ఎమ్మెల్యే, సర్పంచ్ ఎన్నికల్లో వాల్మీకుల మూకుమ్మడి ఓటింగ్ వలన పంచాయతీలో గెలుపుకు వాల్మీకులు కీలకంగా మారారు. చిన్న చిన్న సమస్యలతో పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ బొమ్మని వెంకటేశ్వర్లు, మండ్ల రంగస్వామీ (బువ్వన్న), ఎడమ రామ్మూర్తి నాయుడు ఆధ్వర్యంలో దాదాపు 80 శాతం ఓటింగ్ వైసీపీకి అనుకూలమైనట్లు గ్రామస్థాయి నాయకులు చెబుతున్నారు.
Read Also: Ponnam Prabhakar: పలు కార్పొరేషన్లకు మంత్రి మండలి ఆమోదం..
ఈ క్రమంలో.. మేజర్ పంచాయతీ అయిన ముండ్లపాడు అభివృద్ధి పై ప్రత్యేకంగా శ్రద్ధ చూపించాలని, తమకున్న నీటి సమస్య గురించి ఎమ్మెల్యే నాగార్జున రెడ్డికి వాల్మీకులు వివరించారు. దీంతో.. ఖచ్చితంగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని, నీటి సమస్య పరిష్కారానికి వెంటనే బోర్ వేయిస్తానని నాగార్జున రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే త్వరలో గ్రామానికి వచ్చి ప్రతీ ఒక్కరిని కలుస్తానని తెలిపారు.
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
PM Modi: కాంగ్రెస్కు కొత్త పేరు పెట్టిన మోడీ.. ‘MMC’ అంటే ముస్లిం లీగ్, మావోవాది కాంగ్రెస్!
-
Urvil Patel: పొట్టుపొట్టు కొట్టిన ఉర్విల్ పటేల్.. ఐపీఎల్ హిస్టరీలోనే నయా రికార్డ్ .. 13 బంతుల్లోనే ఫిఫ్టీ!
-
PM Modi: బెంగాల్ ఉత్సాహం తెలంగాణలో కూడా కనిపిస్తోంది..
-
Money Heist: ‘మనీ హెయిస్ట్’ ఫ్యాన్స్కు నెట్ఫ్లిక్స్ సర్ప్రైజ్.. ప్రొఫెసర్ ప్రయాణం ఇంకా ముగియలేదు!
-
Warren Buffett: ‘అమ్మా.. నీ కోపమే నన్ను ప్రపంచ విజేతను చేసింది’.. వారెన్ బఫెట్