Crime: ఏఐతో న్యూడ్ వీడియోస్ రూపొందించి.. 50 మంది కాలేజీ అమ్మాయిలను బ్లాక్మెయిల్
- ఏఐ రూపొందించిన అసభ్యకర వీడియోలు
- 50 మంది కాలేజీ అమ్మాయిలను బ్లాక్మెయిలింగ్
- మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఘటన
- ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏఐ రూపొందించిన అసభ్యకర వీడియోల ద్వారా అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తున్న ఉదంతం మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో వెలుగు చూసింది. ఈ విషయమై ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇప్పటి వరకు 50 మందికి పైగా మహిళలు ఈ మోసానికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. నిందితులు పోలీసు అధికారిగా నటిస్తూ మహిళలను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసేవారు.
READ MORE: Devara : దేవర ఓవర్సీస్ ఇంతటి భారీ అడ్వాన్స్ బుకింగ్స్ కు కారణాలు ఏంటి..?
Also Read
- Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Pakistan-Taliban Tensions: పాకిస్తాన్కు తాలిబాన్ వార్నింగ్.. ఆఫ్ఘన్లోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలే..
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. జబల్పూర్లోని కళాశాల విద్యార్థులను ఏఐ రూపొందించిన వీడియోల ద్వారా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసు సూపరింటెండెంట్ ఆదిత్య ప్రతాప్ సింగ్ సిట్ను ఏర్పాటు చేశారు. దీనికి సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (కొత్వాలి) ఆర్కె శివ నేతృత్వం వహిస్తారు. ఇందులో క్రైమ్ బ్రాంచ్, సైబర్ సెల్, మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు పాల్గొంటారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో ప్రభుత్వ మంకున్వార్ బాయి మహిళా కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది.
READ MORE: Governor Rabindranarayana: ‘రామున్ని ఉత్తర భారతదేశానికి పరిమితం చేసేందుకు యత్నిస్తున్నారు.’
నిందితుడు, పోలీసు అధికారి విక్రమ్ గోస్వామిగా నటిస్తూ.. సోషల్ మీడియాలో అసభ్యకరమైన వీడియోలను షేర్ చేస్తామని అమ్మాయిలను బెదిరించి, డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని ఉపయోగించి అశ్లీల వీడియోలను తయారు చేసి వాటిని బాలికల మొబైల్ ఫోన్లకు పంపుతున్నాడు. ఆ తర్వాత వారిని పోలీసు కేసులో ఇరికిస్తానని, వారి తల్లిదండ్రులకు సమాచారం ఇస్తామని బెదిరించాడు.
READ MORE: Tax Free Income: ఈ ఆదాయాలపై ఎటువంటి పన్ను ఉండదని తెలుసా..?
నిందితులకు విద్యార్థినుల నంబర్లు ఎక్కడి నుంచి వచ్చాయి?
ఇప్పటి వరకు ఇద్దరు బాలికలు నిందితులకు రూ.2000-3000 బదిలీ చేశారు. నిందితులకు ఈ విద్యార్థినుల నంబర్లు ఎలా వచ్చాయో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో దాదాపు 50 మంది మహిళలు బాధితులుగా ఉంటారని, ఇప్పటి వరకు మూడు ఫిర్యాదులు మాత్రమే అందాయని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్లు జబల్పూర్లో నిరసన తెలిపాయి. నిందితులను పట్టుకునేందుకు పలు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
-
Iran Hijab Law: ఇరాన్లో హిజాబ్ నిబంధనలకు సవాల్.. స్కార్ఫ్ లేకుండానే 10K రేసులో పాల్గొన్న మహిళలు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!