Crime: ఏఐతో న్యూడ్ వీడియోస్ రూపొందించి.. 50 మంది కాలేజీ అమ్మాయిలను బ్లాక్మెయిల్
- ఏఐ రూపొందించిన అసభ్యకర వీడియోలు
- 50 మంది కాలేజీ అమ్మాయిలను బ్లాక్మెయిలింగ్
- మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఘటన
- ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏఐ రూపొందించిన అసభ్యకర వీడియోల ద్వారా అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తున్న ఉదంతం మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో వెలుగు చూసింది. ఈ విషయమై ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇప్పటి వరకు 50 మందికి పైగా మహిళలు ఈ మోసానికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. నిందితులు పోలీసు అధికారిగా నటిస్తూ మహిళలను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసేవారు.
READ MORE: Devara : దేవర ఓవర్సీస్ ఇంతటి భారీ అడ్వాన్స్ బుకింగ్స్ కు కారణాలు ఏంటి..?
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. జబల్పూర్లోని కళాశాల విద్యార్థులను ఏఐ రూపొందించిన వీడియోల ద్వారా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసు సూపరింటెండెంట్ ఆదిత్య ప్రతాప్ సింగ్ సిట్ను ఏర్పాటు చేశారు. దీనికి సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (కొత్వాలి) ఆర్కె శివ నేతృత్వం వహిస్తారు. ఇందులో క్రైమ్ బ్రాంచ్, సైబర్ సెల్, మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు పాల్గొంటారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో ప్రభుత్వ మంకున్వార్ బాయి మహిళా కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది.
READ MORE: Governor Rabindranarayana: ‘రామున్ని ఉత్తర భారతదేశానికి పరిమితం చేసేందుకు యత్నిస్తున్నారు.’
నిందితుడు, పోలీసు అధికారి విక్రమ్ గోస్వామిగా నటిస్తూ.. సోషల్ మీడియాలో అసభ్యకరమైన వీడియోలను షేర్ చేస్తామని అమ్మాయిలను బెదిరించి, డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని ఉపయోగించి అశ్లీల వీడియోలను తయారు చేసి వాటిని బాలికల మొబైల్ ఫోన్లకు పంపుతున్నాడు. ఆ తర్వాత వారిని పోలీసు కేసులో ఇరికిస్తానని, వారి తల్లిదండ్రులకు సమాచారం ఇస్తామని బెదిరించాడు.
READ MORE: Tax Free Income: ఈ ఆదాయాలపై ఎటువంటి పన్ను ఉండదని తెలుసా..?
నిందితులకు విద్యార్థినుల నంబర్లు ఎక్కడి నుంచి వచ్చాయి?
ఇప్పటి వరకు ఇద్దరు బాలికలు నిందితులకు రూ.2000-3000 బదిలీ చేశారు. నిందితులకు ఈ విద్యార్థినుల నంబర్లు ఎలా వచ్చాయో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో దాదాపు 50 మంది మహిళలు బాధితులుగా ఉంటారని, ఇప్పటి వరకు మూడు ఫిర్యాదులు మాత్రమే అందాయని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్లు జబల్పూర్లో నిరసన తెలిపాయి. నిందితులను పట్టుకునేందుకు పలు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!