Crime: ఏఐతో న్యూడ్ వీడియోస్ రూపొందించి.. 50 మంది కాలేజీ అమ్మాయిలను బ్లాక్మెయిల్
- ఏఐ రూపొందించిన అసభ్యకర వీడియోలు
- 50 మంది కాలేజీ అమ్మాయిలను బ్లాక్మెయిలింగ్
- మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఘటన
- ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏఐ రూపొందించిన అసభ్యకర వీడియోల ద్వారా అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తున్న ఉదంతం మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో వెలుగు చూసింది. ఈ విషయమై ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇప్పటి వరకు 50 మందికి పైగా మహిళలు ఈ మోసానికి గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. నిందితులు పోలీసు అధికారిగా నటిస్తూ మహిళలను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసేవారు.
READ MORE: Devara : దేవర ఓవర్సీస్ ఇంతటి భారీ అడ్వాన్స్ బుకింగ్స్ కు కారణాలు ఏంటి..?
Also Read
- Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
- Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
- Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
- PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. జబల్పూర్లోని కళాశాల విద్యార్థులను ఏఐ రూపొందించిన వీడియోల ద్వారా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసు సూపరింటెండెంట్ ఆదిత్య ప్రతాప్ సింగ్ సిట్ను ఏర్పాటు చేశారు. దీనికి సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (కొత్వాలి) ఆర్కె శివ నేతృత్వం వహిస్తారు. ఇందులో క్రైమ్ బ్రాంచ్, సైబర్ సెల్, మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు పాల్గొంటారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో ప్రభుత్వ మంకున్వార్ బాయి మహిళా కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది.
READ MORE: Governor Rabindranarayana: ‘రామున్ని ఉత్తర భారతదేశానికి పరిమితం చేసేందుకు యత్నిస్తున్నారు.’
నిందితుడు, పోలీసు అధికారి విక్రమ్ గోస్వామిగా నటిస్తూ.. సోషల్ మీడియాలో అసభ్యకరమైన వీడియోలను షేర్ చేస్తామని అమ్మాయిలను బెదిరించి, డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని ఉపయోగించి అశ్లీల వీడియోలను తయారు చేసి వాటిని బాలికల మొబైల్ ఫోన్లకు పంపుతున్నాడు. ఆ తర్వాత వారిని పోలీసు కేసులో ఇరికిస్తానని, వారి తల్లిదండ్రులకు సమాచారం ఇస్తామని బెదిరించాడు.
READ MORE: Tax Free Income: ఈ ఆదాయాలపై ఎటువంటి పన్ను ఉండదని తెలుసా..?
నిందితులకు విద్యార్థినుల నంబర్లు ఎక్కడి నుంచి వచ్చాయి?
ఇప్పటి వరకు ఇద్దరు బాలికలు నిందితులకు రూ.2000-3000 బదిలీ చేశారు. నిందితులకు ఈ విద్యార్థినుల నంబర్లు ఎలా వచ్చాయో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో దాదాపు 50 మంది మహిళలు బాధితులుగా ఉంటారని, ఇప్పటి వరకు మూడు ఫిర్యాదులు మాత్రమే అందాయని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్లు జబల్పూర్లో నిరసన తెలిపాయి. నిందితులను పట్టుకునేందుకు పలు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!