Terrorists arrested: కశ్మీర్లో ఐదుగురు హిజ్బుల్ ఉగ్రవాదులు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrorists arrested: జమ్ముకశ్మీర్లో భారీ ఉగ్రకుట్రకు పాల్పడిన టెర్రరిస్టులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడంతోపాటు ఆయుధాలు సరఫరా చేస్తున్న ఐదుగురు హిజ్బుల్ ముజాహిదీన్ సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి పేలుడు సామగ్రి, ఆయుధాలను పెద్దసంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు. కుప్వారాలో హిజ్బుల్ టెర్రర్ మాడ్యూల్కు సంబంధించి మిలిటరీ ఇంటెలిజెన్స్, జిల్లా పోలీసులు, ఇతర ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కశ్మీర్ పోలీసులకు సమాచారం అందింది. క్రాల్పోరాలోని ఓ ఇంట్లో దాగి ఉన్నారన్న సమాచారంతో దాడి చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఏకే 47 రైఫిల్, రెండు మ్యాగజైన్లు, మందుగుండు సామాగ్రి, రెండు డిటోనేటర్ల ను స్వాధీనం చేసుకున్నారు.
Read Also: IPL 2023: కొచ్చి వేదికగా ఐపీఎల్ వేలానికి సర్వం సిద్ధం
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
పోలీసులకు కుప్వారా, ఆర్మీకి మిలిటరీ ఇంటెలిజెన్స్, ఇతర ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుండి క్రాల్పోరా ప్రాంతంలో హెచ్ఎమ్ సంస్థ టెర్రర్ మాడ్యూల్ చురుకుగా ఉందని సమాచారం వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఆర్మీ సంయుక్త బృందం ఉగ్రవాదులను అరెస్టు చేసింది. అరెస్టయిన ఉగ్రవాదుల్లో రౌఫ్ మాలిక్, అల్తాఫ్ అహ్మద్ పేయర్, రియాజ్ అహ్మద్ క్రాల్పోరా నివాసితులు. విచారణలో పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద హ్యాండ్లర్ ఫరూక్ అహ్మద్ పీర్ అలియాస్ నదీమ్ ఉస్మానీ సూచనల మేరకు వారు హెచ్ఎం సంస్థ గురించి చెప్పారు. దీనితో పాటు సంస్థ ఉగ్రవాదుల కోసం నిర్మించిన రెండు స్థావరాలను వెల్లడించారు. ప్రస్తుతం ఇవి పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కూడా దాచబడ్డాయి. అరెస్టయిన వారి వెల్లడితో రెండు రహస్య స్థావరాలు బయటపడ్డాయి. 1 ఏకే రైఫిల్, 2 ఏకే మ్యాగజైన్లు, 119 ఏకే మందుగుండు సామగ్రి, 1 పిస్టల్, 1 పిస్టల్ మ్యాగ్, 4 పిస్టల్ రౌండ్లు, 6 హ్యాండ్ గ్రెనేడ్లు, 1 ఐఈడీ, 2 డిటోనేటర్లు, 2 వైర్ బండిల్స్, 100 లీటర్ల సామర్థ్యం గల వాటర్ బాటిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!