44 AP Residents stranded in Nepal: నేపాల్లో చిక్కుకున్న 44 మంది నంద్యాల వాసులు..
- నేపాల్ లో చిక్కుకున్న మరో 44మంది ఏపీ వాసులు..
- నంద్యాల నుండి ముక్తినాథ్ యాత్రకు వెళ్లిన భక్తులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
44 AP Residents stranded in Nepal: నేపాల్లో ‘జెన్జీ’ ఉద్యమం తీవ్ర ఉద్రిక్తతలు, విధ్వంసానికి దారి తీసింది.. నేపాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ.. అక్కడ చిక్కుకున్న తెలుగు వారిని క్షేమంగా తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుండగా.. ఈ సమయంలో.. ఏపీకి చెందిన మరో 44మంది టూరిస్టులు అక్కడ చిక్కుకున్న వార్తలు కలవరపెడుతున్నాయి.. నంద్యాల నుండి ముక్తినాథ్ యాత్రకు వెళ్లి , నేపాల్ లో చిక్కుకున్నారు 44 మంది యాత్రికుల బృందం.. దీంతో, మంత్రి ఫారూఖ్ ను ఆశ్రయింయారు యాత్రికుల కుటుంబ సభ్యులు.. వెంటనే హోంమంత్రి అనిత , జిల్లా కలెక్టర్ రాజకుమారితో మాట్లాడిన మంత్రి ఫరూక్.. ఆ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెప్పారు..
Read Also: Medicine Profit Margins: మెడికల్ మాఫియా..? రూ.20కి వచ్చే దగ్గు మందు.. రూ.100కి విక్రయిస్తున్నారు?
Also Read
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
ఇక, 14వ తేదీన యాత్రికులను రప్పించడానికి ఏర్పాట్లు చేశారు కలెక్టర్ రాజకుమారి.. అయితే, షోలే ట్రావెల్స్ ద్వారా 3వ తేదీన 12 రోజుల ముక్తినాథ్ యాత్రకు బయలుదేరి వెళ్లింది 44 మంది భక్తుల బృందం.. ఈ టీమ్లో నంద్యాల, కర్నూలు, ప్రొద్దుటూరు, పోరుమావిళ్ల, సున్నిపెంటవాసులు ఉన్నట్టుగా చెబుతున్నారు.. నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. రాజధాని ఖాట్మాండ్ లో రెండు రోజులుగా రూమ్లకే పరిమితమయ్యారు యాత్రకులు.. మొత్తంగా మంత్రి ఫారూఖ్ చొరవతో యాత్రికులను రప్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.. రేపు ఖాట్మాండ్ నుండి నేపాల్ – ఇండియా సరిహద్దుల్లోని భైరవ్ ప్రాంతానికి విమానంలో బయలుదేరనున్నారు యాత్రికులు.. అక్కడినుండి వోల్వా బస్సులో యూపీలోని గోరకపూర్ కు , అక్కడి నుండి విమానంలో హైదరాబాద్ కు వస్తారు.. ఈ నెల 14వ తేదీ సాయంత్రం హైదరాబాద్ చేరుకోనుంది యాత్రికుల బృందం.. యాత్రికులు క్షేమంగా ఉన్నారని , కుటుంబ సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి ఫరూఖ్..
తాజావార్తలు
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!