Bullet Trains: 350 కి.మీ. వేగంతో దూసుకెళ్లనున్న బుల్లెట్ ట్రైన్లు.. ఏపీ, తెలంగాణకు భారీ రైల్వే బడ్జెట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bullet Trains: రైల్వే బడ్జెట్పై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రైల్వే అధికారులు, అన్ని రాష్ట్రాల మీడియాతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాజా రైల్వే బడ్జెట్ కేటాయింపులు, హైస్పీడ్–బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు, రాష్ట్రాల వారీగా అమలవుతున్న అభివృద్ధి పనులపై కీలక వివరాలు వెల్లడించారు.
మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు ఈసారి రూ.7,611 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయించారు. ఇది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్తో పోలిస్తే దాదాపు 9 రెట్లు ఎక్కువ అని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడుతో పాటు దక్షిణ భారతాన్ని కలుపుతూ చెన్నై – హైదరాబాద్, చెన్నై – బెంగళూరు, హైదరాబాద్ – బెంగళూరు మార్గాల్లో హైస్పీడ్ “డైమండ్ కారిడార్” ప్రాజెక్టు ప్రతిపాదనలో ఉందన్నారు.
Also Read
- Modi Cabinet: త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఈ రాష్ట్ర నేతలకు ఛాన్స్!
- Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
- Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు.. సీఎం విజయ్ వైఖరిపై మిత్రపక్షాల్లో ఆగ్రహం..
ఆంధ్రప్రదేశ్ కు ఈ బడ్జెట్లో రూ. 10,134 కోట్లు కేటాయించామని మంత్రి తెలిపారు. ఏపీలో మొత్తం రూ. 92,649 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని అన్నారు. చెన్నై – హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఏపీకి కూడా ఎంతో ఉపయోగపడుతుందని, రాష్ట్రం ఇప్పటికే 100% ఎలక్ట్రిఫైడ్ రైల్వే లైన్లు కలిగిన రాష్ట్రంగా నిలిచిందని గుర్తుచేశారు. అలాగే కలకత్తా – చెన్నై మధ్య నాలుగు రైల్వే లైన్లు ఏర్పాటు పూర్తయ్యాయని వెల్లడించారు.
తెలంగాణకు ఈసారి రూ. 5,454 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయించామని, రాష్ట్రంలో మొత్తం రూ. 48 వేల కోట్లకు పైగా రైల్వే ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు, పుణె, చెన్నై మార్గాల్లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు ప్రతిపాదనలో ఉన్నాయని చెప్పారు. అలాగే ముంబై – హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ తమకు అనేక విలువైన అనుభవాలను అందించిందని అన్నారు.
Royal Enfield Himalayan 450 vs KTM 390 Adventure: ఆఫ్-రోడ్ అడ్వెంచర్లో బెస్ట్ ఏది.?
కర్ణాటకకు రూ. 7,748 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయించామని, అక్కడ మొత్తం రూ. 52,950 కోట్ల విలువైన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని వివరించారు. భవిష్యత్తులో బెంగళూరు నుంచి రెండు బుల్లెట్ ట్రైన్లు ప్రారంభమవుతాయని తెలిపారు. అలాగే అమరావతి కూడా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఒక కీలక భాగంగా ఉండనుందని స్పష్టం చేశారు.
ఇంకా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులపై కీలక ప్రకటనలు చేస్తూ.. రెండో దశలో దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ల గరిష్ట వేగం 350 కి.మీ. ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్లు (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు) త్వరలో సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Terrorist Digital Plan: భారత్ టార్గెట్గా టెర్రరిస్టుల కొత్త ‘డిజిటల్’ ప్లాన్.. నిఘా వర్గాలకు అంతుచిక్కని మిస్టరీ!
-
Red Necked Nightjar : చందమామతో టైమ్ సెట్ చేసుకునే పక్షి.. ఇదే ప్రకృతి మ్యాజిక్.!
-
Modi Cabinet: త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఈ రాష్ట్ర నేతలకు ఛాన్స్!
-
Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
-
Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!