Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Ap Cm Ys Jagan Slams Chandrababu In Public Meeting In Kurnool District

AP CM Jagan: చంద్రబాబుకు కావాల్సింది పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులే..

Published Date :June 1, 2023 , 12:48 pm
By Mahesh Jakki
AP CM Jagan: చంద్రబాబుకు కావాల్సింది పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

AP CM Jagan: వరుసగా ఐదో సారి వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం నిధులను సీఎం జగన్‌ విడుదల చేశారు.మొదటి విడతగా ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున సహాయాన్ని విడుదల చేశారు. 52.30 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. మొత్తం రూ.3వేల 900 కోట్లకు పైగా నిధులు జమ చేశారు. మేనిఫెస్టోలో ప్రకటించిన దానికంటే ఎక్కువగా రైతు భరోసా ఇస్తున్నామని కర్నూలు జిల్లాలో పత్తికొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అన్నారు. ప్రతీ రైతుకు ఇప్పటివరకు రూ.54 వేలు రైతు భరోసా కింద ఇచ్చామన్నారు. ఐదేళ్లలో ప్రతీ రైతు ఖాతాలో రూ.61,500 జమ చేశామని, రైతులు పెట్టుబడికి ఇబ్బంది పడొద్దన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నామని సీఎం స్పష్టం చేశారు.

రైతు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని విమర్శలు గుప్పించారు. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌లో ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తున్నామన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో కరువే కరువు ఉందన్నారు. గ్రామాలకు సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులతో పాటు.. వందేళ్ల తర్వాత సమగ్ర భూసర్వేతో వివాదాలు పరిష్కరిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.. రైతులకు పగటిపూట 9గంటల కరెంట్‌ ఇస్తున్నామన్న సీఎం.. కరువు సీమగా ఉన్న రాయలసీమ ఇప్పుడు కళకళలాడుతోందన్నారు. అమూల్ వచ్చిన తర్వాత పాల ధరలు నాలుగు సార్లు పెరిగాయన్న సీఎం.. అమూల్‌ రాకముందు హెరిటేజ్ సంస్థ రైతులను దోచుకుందని ఆరోపించారు. రైతుకు శత్రువు చంద్రబాబేనని.. రాజమండ్రిలో మహానాడు పేరుతో డ్రామా చేశారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంపేసి, మళ్లీ ఆయన్నే కీర్తించారని విమర్శలు గుప్పించారు. ఆ మహానాడు డ్రామాకు ముందు ఒక ప్రకటన చేశారన్న ముఖ్యమంత్రి.. అందమైన మాయలేడి రూపంలో సీతమ్మ దగ్గరకు వచ్చిన మారీచుడు గుర్తొచ్చాడని.. సీతమ్మ దగ్గరకు భిక్షగాడి రూపంలో వచ్చిన రావణుడు గుర్తొచ్చాడని.. చంద్రబాబు సత్యాన్ని పలకరు, ధర్మానికి కట్టుబడరని.. చంద్రబాబుకు విలువలు లేవు, విశ్వసనీయత లేదంటూ సీఎం జగన్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

Read Also: Head Constable: గ్రామస్థులపై హెడ్ కానిస్టేబుల్ దౌర్జన్యం.. కారుతో ఈడ్చుకెళ్లి..

అధికారం కోసం చంద్రబాబు ఎవరినైనా పొడుస్తాడని.. చంద్రబాబుకు ఒరిజినాల్టీ లేదు, పర్సనాల్టీ లేదు, క్యారెక్టర్ లేదు, క్రెడిబులిటీ అంతకన్నా లేదు.. పోటీ చేసేందుకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా లేరు.. పొత్తుల కోసం ఎంతకైనా దిగజారుతారు, ఏ గడ్డైనా తింటారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశానో చెప్పుకునే ధైర్యం లేదు కానీ మరో ఛాన్స్ ఇవ్వండి ఏదో చేసేస్తా అంటున్నారంటూ ఎద్దేవా చేశారు. సీఎంగా మొదటి సంతకానికి ఒక క్రెడిబులిటీ ఉంటుంది.. కానీ చంద్రబాబు మొదటి సంతకాన్నే మోసంగా మార్చేశారని ఆరోపణలు చేశారు. మంచి చేయడమనేది చంద్రబాబు డిక్షనరీలోనే లేదని సీఎం జగన్‌ అన్నారు. చంద్రబాబుకు కావాల్సింది పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కుయుక్తులు.. చంద్రబాబు, గజదొంగల ముఠాది అధికారం కోసం ఆరాటమేనని ఆయన మండిపడ్డారు. దోచుకుని, దాచుకుని నలుగురూ పంచుకోవడానికి వారి పోరాటమని విమర్శించారు. రాబోయే రోజుల్లో ఓ యుద్ధం జరగబోతోందని ముఖ్యమంత్రి చెప్పారు. వాళ్లు చెబుతున్న అబద్ధాలు, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంట్లో మంచి జరిగి ఉంటేనే మళ్లీ ఆశీర్వదించాలంటూ అభ్యర్థించారు. చంద్రబాబుకు ఎన్నికలు వచ్చినప్పుడే కర్నూలు జిల్లా గుర్తొస్తుందని సీఎం జగన్‌ అన్నారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP CM Jagan
  • AP CM YS Jaganmohan Reddy
  • ap news
  • ap politics
  • chandrababu

తాజావార్తలు

  • KTR : 27 నెలలు అయిన PRC పత్తా లేదు.. ఇంకా 5 DAలు బాకీ..

  • Pawan Kalyan: ‘గాడ్ ఫాదర్’ డైరెక్టర్‌తో పవన్ కళ్యాణ్.. అంతా ఉత్తిదే!

  • Harish Shankar: ‘చిరంజీవికి పవన్ తమ్ముడు మాత్రమే కాదు.. కొడుకు కూడా’ : హరీశ్ శంకర్

  • RRB ALP Recruitment 2026: కృపయా ధ్యాన్ దే.. రైల్వేలో 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు.. 10th, ITI పాసైతే చాలు

  • Minister Nara Lokesh: మైలవరం స్కూల్‌లో మంత్రి లోకేష్‌ ఆకస్మిక తనిఖీలు.. అధికారులకు సీరియస్‌ వార్నింగ్..

ట్రెండింగ్‌

  • Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్‌’.. షాకైన కస్టమర్లు!

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions