New Criminal Laws: నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తే మూడేళ్ల జైలు శిక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Criminal Laws: కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం భారతీయ న్యాయ సంహిత బిల్లు-2023ను లోక్సభలో ప్రవేశపెట్టారు. సమీక్ష కోసం పార్లమెంట్కు స్టాండింగ్ కమిటీకి ప్రతిపాదిత బిల్లు పంపబడింది. ఆ బిల్లు ప్రకారం.. భారతదేశ సార్వభౌమాధికారం, భద్రతకు హాని కలిగించే నకిలీ వార్తలు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తే సెక్షన్ 195 ప్రకారం మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది.
సెక్షన్ 195 (1) (డీ) ప్రకారం.. “భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత లేదా భద్రతకు భంగం కలిగించే తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని తయారు చేస్తే లేదా ప్రచురించినట్లయితే, మూడు సంవత్సరాల వరకు పొడిగించబడే జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించబడతాయి.” ఈ విభాగం కొత్తగా ప్రతిపాదించబడిన బిల్లులోని 11వ అధ్యాయంలో కింద ‘ప్రజా ప్రశాంతతకు వ్యతిరేకంగా నేరాలు’ కింద, ‘ఆరోపణలు, జాతీయ సమైక్యతకు విఘాతం కలిగించే వాదనలు’ అనే అంశం క్రింద ఉంది. ప్రస్తుతం ఐపీసీలోని సెక్షన్ 153బీ కింద ‘ఆరోపణలు, జాతీయ సమైక్యతకు విఘాతం కలిగించే వాదనలు’కి సంబంధించిన నిబంధనలు ఉన్నాయి.
Also Read
- Suri Murd*er: హైదరాబాద్ మీర్ పేట్ లో రౌడీషీటర్ సూరి దారుణహత్య.!
- Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిర కేసులో కీలక మలుపు.. కొత్త సిట్ ఏర్పాటు..!
- IND vs ZIM: భారత్, జింబాబ్వే టీ20 సిరీస్.. మ్యాచ్ టైమింగ్స్, పూర్తి షెడ్యూల్ ఇలా.. ఈసారైనా గెలుస్తారా.?
- CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..118 మంది పోలీసులకు గాయాలు.. పోలీసుల అదుపులో 70 మంది
Read Also: TSRTC: ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త.. సుదూర ప్రాంతాలకు స్పెషల్ ట్రిప్పులు
భారత పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను పరిరక్షించడంతో పాటు న్యాయం కోసం మూడు బిల్లులను హోంమంత్రి అమిత్ షా శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టారు.పౌరులకు రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులను పరిరక్షించడమే ఈ మూడు కొత్త చట్టాల ఆత్మ అని బిల్లులను ప్రవేశపెడుతూ అమిత్ షా అన్నారు. మూడు బిల్లులు – భారతీయ న్యాయ సంహిత బిల్లు-2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిల్లు-2023, భారతీయ సాక్ష్యా బిల్లు-2023 కాగా.. బానిసత్వానికి సంబంధించిన అన్ని సంకేతాలను అంతం చేస్తానని ప్రధాని నరేంద్ర మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్న ప్రతిజ్ఞను నెరవేర్చారని ఆయన అన్నారు.
ఈ బిల్లులు బ్రిటీష్ వారు రూపొందించిన ఇండియన్ పీనల్ కోడ్ (1860), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, (1898), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్(1872)లను రద్దు చేస్తాయి. భారత శిక్షాస్మృతి స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్లు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిల్లు, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్యా బిల్లు రానుందని అమిత్ షా చెప్పారు.
తాజావార్తలు
-
Suri Murd*er: హైదరాబాద్ మీర్ పేట్ లో రౌడీషీటర్ సూరి దారుణహత్య.!
-
Rohit Sharma: ఎప్పుడు తప్పుకోవాలో రోహిత్కు తెలుసు.. మీరు మూసుకుంటే బెటర్: పాక్ మాజీ స్టార్
-
Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిర కేసులో కీలక మలుపు.. కొత్త సిట్ ఏర్పాటు..!
-
Release Dates Announce : ఎట్టకేలకు ల్యాబ్ నుండి బయటకు వస్తున్న కోలీవుడ్ మూవీస్
-
Jananayagan : జననాయకుడు కోసం ఆంధ్ర, నైజాంలో విచ్చలవిడిగా థియేటర్స్, షోస్ పరిచేసారు
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!