Seethapalli Vagu: విహారయాత్రలో విషాదం.. ముగ్గురు విద్యార్థులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seethapalli Vagu: విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఈ విషాద సంఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం ఐ. పోలవరం గ్రామం సీతపల్లి వాగులో జరిగింది.. ఈ ఘటనతో గోకవరం మండలం రంపఎర్రంపాలెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఈ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ఆదివారం కావడంతో రంపచోడవరం విహారయాత్రకు వెళ్లారు. సీతపల్లి వాగులో సరదాగా దిగి స్నానం చేస్తుండగా వారిలో ముగ్గురు వాగు లోతుల్లోకి వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగిపోయారు. మిగిలిన ఇద్దరూ బయట పడ్డారు. పదహారేళ్ల వీర వెంకట అర్జున్ , అండిబోయిన దేవి చరణ్ , లావేటి రామన్ లు గల్లంతు అయ్యారు. వెంటనే సమాచారం తెలుసుకున్న రంపచోడవరం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలు వెలికితీశారు.. అనంతరం పోస్టుమార్టం కోసం రంపచోడవరం ఆసుపత్రికి తరలించారు. దీనితో రంప ఎర్రంపాలెంలో విషాదం అలముకుంది. ఈ ఘటన మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.. చిన్నారులు మృతిచెందడంతో.. వారి కుటుంబ సభ్యులను అదుపుచేయడం ఎవ్వరివల్లా కావడం లేదు.
Read Also: Supreme Court: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్.. నేడు సుప్రీంకోర్టులో విచారణ
Also Read
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!