Suicide Blast: పోలీసు ట్రక్కు లక్ష్యంగా ఆత్మాహుతి దాడి.. ముగ్గురు మృతి, 27 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suicide Blast: పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లోని క్వెట్టాలో ఆత్మాహుతి పేలుడులో మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది. పేలుడులో గాయపడిన మహిళ మరణించింది. 23 మంది పోలీసులతో సహా 27 మంది గాయపడినట్లు సమాచారం. గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిందని పోలీసులు మృతుల సంఖ్యకు సంబంధించిన అప్డేట్ను వెల్లడించారు. ఇదిలావుండగా గాయపడిన వారిలో ఎక్కువ మంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని ఆసుపత్రి యంత్రాంగం తెలిపింది. ఈ పేలుడు ఆత్మాహుతి దాడి అని.. పేలుడు జరిగిన ప్రాంతానికి సమీపంలో ఆత్మాహుతి బాంబర్ అవశేషాలు లభించాయని క్వెట్టా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ గులాం అజ్ఫర్ మహేసర్ వెల్లడించారు. పేలుడు ధాటికి పోలీసు ట్రక్కు బోల్తాపడి లోయలో పడిందని తెలిపారు.
AAP’s Candidate video viral: తుపాకీ చూపిస్తూ ఆప్ నేత హల్చల్.. వీడియో వైరల్
Also Read
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
పోలీసు ట్రక్కును లక్ష్యంగా చేసుకుని పేలుడు జరిగినట్లు ప్రాథమిక ప్రకటనలో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ తెలిపింది. గాయపడిన పోలీసులు, పౌరులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు జియో న్యూస్ నివేదించింది.
ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు పేలుడు జరిగిన ప్రదేశానికి చేరుకున్నాయి. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సహాయాన్ని కూడా కోరారు. లోయలో పడిపోవడంతో ట్రక్కు కింద నలిగిపోవడం వల్లే పోలీసు మరణించాడని డీఐజీ మెహసర్ చెప్పారు. దాదాపు 20 మంది పోలీసులు, నలుగురు పౌరులు గాయపడ్డారని తెలిపారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. పేలుడులో పోలీసు ట్రక్కుతో సహా మూడు వాహనాలు, సమీపంలోని రెండు కార్లు దెబ్బతిన్నాయని డీఐజీ తెలిపారు. దాడిలో దాదాపు 20-25 కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించినట్లు ఆయన తెలిపారు. అంతర్గత వ్యవహారాల మంత్రి రాణా సనావుల్లా, దాడిని ఖండిస్తూ, బలూచిస్థాన్ ప్రభుత్వం నుంచి నివేదికను కోరినట్లు తెలిపారు. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ వేర్వేరు ప్రకటనల్లో ఉగ్రవాద దాడిని ఖండించారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ విషయంపై తక్షణ విచారణకు ఆదేశించారు. గాయపడిన వారికి ఉత్తమ వైద్య సహాయం అందించడానికి ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..