Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లోని భద్రతా దళాలు గత 24 గంటల్లో కుల్గామ్లో జంట ఆపరేషన్లలో ముగ్గురు జైష్-ఎ-మహ్మద్ (జేఈఎమ్) ఉగ్రవాదులను హతమార్చాయి. కుల్గామ్లోని అహ్వాటూ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికిపై జమ్మూకశ్మీర్ పోలీసులకు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు, ఆర్మీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సంయుక్తంగా కార్డన్-అండ్-సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
సెర్చ్ ఆపరేషన్ సమయంలో దాక్కున్న ఉగ్రవాదులు భద్రతా దళాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులను సమర్థవంతంగా ఎదుర్కొన్న బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఎన్కౌంటర్లో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు తెలిపారు. వారిని బట్పోరాకు చెందిన మహ్మద్ షఫీ గనీ, టాకియా గోపాల్పోరాకు చెందిన మహ్మద్ ఆసిఫ్ వానీ అలియాస్ యావర్గా గుర్తించారు. వారికి నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే-ఈ-మహ్మద్ (JeM) తో సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ ఇద్దరు ఉగ్రవాదులకు పోలీసు/భద్రతా బలగాలపై దాడులు, పౌర దురాగతాలతో సహా అనేక ఉగ్రవాద నేర కేసుల్లో ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు.
Also Read
- RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
- Chairmans Desk : ప్రపంచమంతా మాంద్యం గుప్పిట్లో ఉంటే.. దక్షిణాది మాత్రం సేఫ్ జోన్లోనే ఉందా..? |
- Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
సోమవారం తెల్లవారుజామున కుల్గామ్లోని బట్పోరా గ్రామంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారని సమాచారం మేరకు జమ్మూకశ్మీర్ పోలీసులు, భారత సైన్యం సంయుక్తంగా సంయుక్త కార్డన్-అండ్-సెర్చ్ ఆపరేషన్ జరిపారు. దాక్కున్న ఉగ్రవాది తప్పించుకునే ప్రయత్నంలో పౌరులతో పాటు బలగాలను లక్ష్యంగా చేసుకున్నాడు. పౌరులను సురక్షిత ప్రదేశానికి తరలించినప్పటికీ, ఒక ఆర్మీ సైనికుడు, ఇద్దరు పౌరులు తుపాకీ కాల్పుల్లో గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తదుపరి ఎన్కౌంటర్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే-ఈ-మహ్మద్తో సంబంధం ఉన్న అబూ హురాహ్గా గుర్తించబడిన పాకిస్తానీ ఉగ్రవాది హతమయ్యాడు.
PFI: పీఎఫ్ఐపై కేంద్రం సంచలన నిర్ణయం.. ఐదేళ్ల పాటు నిషేధం
కశ్మీర్లోని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ), విజయ్ కుమార్ మాట్లాడుతూ.. అనేక ఉగ్రవాద నేరాలలో ప్రమేయంతో పాటు, స్థానిక యువకులను ఉగ్రవాద ర్యాంకుల్లోకి చేర్చుకోవడంలో పాక్ ఉగ్రవాది ప్రమేయం ఉందని చెప్పారు. ఎన్కౌంటర్లు జరిగిన రెండు ప్రదేశాల నుంచి ఒక ఏకే-56, రెండు ఏకే-47, ఒక పిస్టల్, ఒక గ్రెనేడ్, నాలుగు మ్యాగజైన్లు, ఒక పిస్టల్ మ్యాగజైన్తో సహా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన పదార్థాలన్నీ తదుపరి విచారణ కోసం కేసు రికార్డుల్లోకి తీసుకోబడ్డాయి. ఇందుకు సంబంధించి ఆయా పోలీస్ స్టేషన్లలో సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
-
Chairmans Desk : ప్రపంచమంతా మాంద్యం గుప్పిట్లో ఉంటే.. దక్షిణాది మాత్రం సేఫ్ జోన్లోనే ఉందా..? |
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Telangana Jobs : మెడికల్ జాబ్స్ అలర్ట్.. 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.!
-
PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!