Jammu Kashmir: జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లోని భద్రతా దళాలు గత 24 గంటల్లో కుల్గామ్లో జంట ఆపరేషన్లలో ముగ్గురు జైష్-ఎ-మహ్మద్ (జేఈఎమ్) ఉగ్రవాదులను హతమార్చాయి. కుల్గామ్లోని అహ్వాటూ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికిపై జమ్మూకశ్మీర్ పోలీసులకు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు, ఆర్మీ, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సంయుక్తంగా కార్డన్-అండ్-సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
సెర్చ్ ఆపరేషన్ సమయంలో దాక్కున్న ఉగ్రవాదులు భద్రతా దళాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులను సమర్థవంతంగా ఎదుర్కొన్న బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఎన్కౌంటర్లో ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు తెలిపారు. వారిని బట్పోరాకు చెందిన మహ్మద్ షఫీ గనీ, టాకియా గోపాల్పోరాకు చెందిన మహ్మద్ ఆసిఫ్ వానీ అలియాస్ యావర్గా గుర్తించారు. వారికి నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే-ఈ-మహ్మద్ (JeM) తో సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ ఇద్దరు ఉగ్రవాదులకు పోలీసు/భద్రతా బలగాలపై దాడులు, పౌర దురాగతాలతో సహా అనేక ఉగ్రవాద నేర కేసుల్లో ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు.
Also Read
- Rapido Driver Kidnap: ర్యాపిడో డ్రైవర్ కిడ్నాప్.. పొదల్లోకి లాక్కెళ్లి చిత్ర హింసలు..
- Dimaagi Naxals: కిరణ్ రిజిజు ‘దిమాగీ నక్సల్స్’ లిస్ట్.. ‘‘గర్వంగా ఉంది’’ అన్న చిదంబరం
- Junior Doctors: జూనియర్ డాక్టర్ల కీలక నిర్ణయం.. రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్..
- Tadipatri: తాడిపత్రిలో భగ్గుమన్న రాజకీయం.. కారు అద్దాలు ధ్వంసం..
సోమవారం తెల్లవారుజామున కుల్గామ్లోని బట్పోరా గ్రామంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారని సమాచారం మేరకు జమ్మూకశ్మీర్ పోలీసులు, భారత సైన్యం సంయుక్తంగా సంయుక్త కార్డన్-అండ్-సెర్చ్ ఆపరేషన్ జరిపారు. దాక్కున్న ఉగ్రవాది తప్పించుకునే ప్రయత్నంలో పౌరులతో పాటు బలగాలను లక్ష్యంగా చేసుకున్నాడు. పౌరులను సురక్షిత ప్రదేశానికి తరలించినప్పటికీ, ఒక ఆర్మీ సైనికుడు, ఇద్దరు పౌరులు తుపాకీ కాల్పుల్లో గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తదుపరి ఎన్కౌంటర్లో నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే-ఈ-మహ్మద్తో సంబంధం ఉన్న అబూ హురాహ్గా గుర్తించబడిన పాకిస్తానీ ఉగ్రవాది హతమయ్యాడు.
PFI: పీఎఫ్ఐపై కేంద్రం సంచలన నిర్ణయం.. ఐదేళ్ల పాటు నిషేధం
కశ్మీర్లోని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ), విజయ్ కుమార్ మాట్లాడుతూ.. అనేక ఉగ్రవాద నేరాలలో ప్రమేయంతో పాటు, స్థానిక యువకులను ఉగ్రవాద ర్యాంకుల్లోకి చేర్చుకోవడంలో పాక్ ఉగ్రవాది ప్రమేయం ఉందని చెప్పారు. ఎన్కౌంటర్లు జరిగిన రెండు ప్రదేశాల నుంచి ఒక ఏకే-56, రెండు ఏకే-47, ఒక పిస్టల్, ఒక గ్రెనేడ్, నాలుగు మ్యాగజైన్లు, ఒక పిస్టల్ మ్యాగజైన్తో సహా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన పదార్థాలన్నీ తదుపరి విచారణ కోసం కేసు రికార్డుల్లోకి తీసుకోబడ్డాయి. ఇందుకు సంబంధించి ఆయా పోలీస్ స్టేషన్లలో సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
Rapido Driver Kidnap: ర్యాపిడో డ్రైవర్ కిడ్నాప్.. పొదల్లోకి లాక్కెళ్లి చిత్ర హింసలు..
-
Dimaagi Naxals: కిరణ్ రిజిజు ‘దిమాగీ నక్సల్స్’ లిస్ట్.. ‘‘గర్వంగా ఉంది’’ అన్న చిదంబరం
-
Junior Doctors: జూనియర్ డాక్టర్ల కీలక నిర్ణయం.. రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్..
-
Bolla Brothers : పోలీసులకు ఇన్ఫోర్మర్లు.. లోపల గంజాయి దందా.. బొల్లా బ్రదర్స్ బాగోతం
-
Yash: ఆ స్టార్ హీరోయిన్ కోసం బాడీగార్డ్గా మారిన యశ్.. ‘టాక్సిక్’ షూటింగ్లో ఆసక్తికర ఘటన?
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?