AC Coaches Missing: తప్పిపోయిందా? తప్పించుకొని పోయారా? రైలు నుంచి ఏసీ కోచ్ మిస్సింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AC Coaches Missing: రైలుకు బోగిలు ఉంటాయి.. అవి రైలు పట్టాల మీద ఉంటాయని మనకు తెలుసు. కానీ పట్టాల మీద ఉన్న రైలు మూడు బోగిలు కనిపించకుండా పోయిన ఘటన అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఇంతకీ ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలుసా.. ఫిబ్రవరి 1వ తేదీ తెల్లవారుజామున ఒడిశాలోని సంబల్పూర్ రైల్వే స్టేషన్లో వెలుగు చూసింది. సంబల్పూర్ – నాందేడ్ నాగవళి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో రిజర్వు చేసిన కోచ్ కోసం టిక్కెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులకు వారికి సీట్లు కేటాయించి బోగిలు కనిపించక ఆందోళన చెందారు. వాళ్ల బోగిలను వెతుక్కోవడం కోసం రైలు పొడవునా స్కాన్ చేయవలసి వచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: PM Modi: పీఎం మోడీ మాస్టర్ స్ట్రోక్.. వారంలో రెండు ఒప్పందాలు!
Also Read
పలు నివేదికల ప్రకారం.. భువనేశ్వర్ నుంచి నాందేడ్ వైపు ప్రయాణిస్తున్న రైలు నంబర్ 20809 సంబల్పూర్ చేరుకున్నప్పుడు ఓ ఏసీ కోచ్ కనిపించలేదు. తమకు కేటాయించిన 3AC కోచ్ కోసం ప్రత్యేకంగా వేచి ఉన్న కొంతమంది ప్రయాణికులు ఆందోళన చెందారు. 3AC కోచ్ BE2 కి కన్ఫర్మ్ టిక్కెట్లు ఉన్న 57 మంది ప్రయాణికులు.. ట్రైన్ మిస్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో రైలు వచ్చే సమయానికి కంటే ముందుగానే స్టేషన్కు చేరుకున్నారు. నాగావళి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రాగానే, వారు తమ కోచ్ కోసం వెతకడానికి రైలును మొత్తం స్కాన్ చేశారు. కానీ వారికి కేటాయించిన బోగి BE2 కోచ్ జత చేయకుండానే రైలు సంబల్పూర్ నుంచి బయలుదేరిందని స్పష్టమైంది. ఈ విషయాన్ని గ్రహించిన చాలా మంది ప్రయాణికులు ఇప్పుడు రైలు ఎక్కాలా వద్దా అని తెలియక తికమకపడ్డారు. కోచ్ లేకుండా వచ్చిన రైలు గురించి టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులు సహాయం కోసం ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్స్ (TTE)ను సంప్రదించారు. పలు నివేదికల ప్రకారం.. టికెట్లు బుక్ చేసుకున్న వారిని ఇతర కోచ్లలోని సీట్లలో కూర్చోమని చెప్పారు, అంతే కానీ అసలు ఏం జరిగిందో స్పష్టమైన వివరణ ఇవ్వలేదని వివరించారు.
ఘటనపై రైల్వే అధికారుల వివరణ..
ఈ ఘటనపై తూర్పు కోస్ట్ రైల్వే అధికారులు స్పందిస్తూ.. “సాంకేతిక సమస్య కారణంగా, ఒక రిజర్వు కోచ్ (BE2) ను రైలు నంబర్ 20809 కు అటాచ్ చేయడం సాధ్యం కాలేదు. టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులను ఆన్-బోర్డ్ TTE ఇతర కోచ్లలో అందుబాటులో ఉన్న ఖాళీ బెర్తులలో కూర్చునేలా ఏర్పాటు చేశారు” అని తూర్పు కోస్ట్ రైల్వే (ECoR) ఒక ప్రకటనలో తెలిపింది.
READ ALSO: Biker Release Date: శర్వా స్పీడ్ మామూలుగా లేదుగా! ‘బైకర్’ రిలీజ్ డేట్ లాక్..
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!