AC Coaches Missing: తప్పిపోయిందా? తప్పించుకొని పోయారా? రైలు నుంచి ఏసీ కోచ్ మిస్సింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AC Coaches Missing: రైలుకు బోగిలు ఉంటాయి.. అవి రైలు పట్టాల మీద ఉంటాయని మనకు తెలుసు. కానీ పట్టాల మీద ఉన్న రైలు మూడు బోగిలు కనిపించకుండా పోయిన ఘటన అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఇంతకీ ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలుసా.. ఫిబ్రవరి 1వ తేదీ తెల్లవారుజామున ఒడిశాలోని సంబల్పూర్ రైల్వే స్టేషన్లో వెలుగు చూసింది. సంబల్పూర్ – నాందేడ్ నాగవళి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో రిజర్వు చేసిన కోచ్ కోసం టిక్కెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులకు వారికి సీట్లు కేటాయించి బోగిలు కనిపించక ఆందోళన చెందారు. వాళ్ల బోగిలను వెతుక్కోవడం కోసం రైలు పొడవునా స్కాన్ చేయవలసి వచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: PM Modi: పీఎం మోడీ మాస్టర్ స్ట్రోక్.. వారంలో రెండు ఒప్పందాలు!
Also Read
పలు నివేదికల ప్రకారం.. భువనేశ్వర్ నుంచి నాందేడ్ వైపు ప్రయాణిస్తున్న రైలు నంబర్ 20809 సంబల్పూర్ చేరుకున్నప్పుడు ఓ ఏసీ కోచ్ కనిపించలేదు. తమకు కేటాయించిన 3AC కోచ్ కోసం ప్రత్యేకంగా వేచి ఉన్న కొంతమంది ప్రయాణికులు ఆందోళన చెందారు. 3AC కోచ్ BE2 కి కన్ఫర్మ్ టిక్కెట్లు ఉన్న 57 మంది ప్రయాణికులు.. ట్రైన్ మిస్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో రైలు వచ్చే సమయానికి కంటే ముందుగానే స్టేషన్కు చేరుకున్నారు. నాగావళి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రాగానే, వారు తమ కోచ్ కోసం వెతకడానికి రైలును మొత్తం స్కాన్ చేశారు. కానీ వారికి కేటాయించిన బోగి BE2 కోచ్ జత చేయకుండానే రైలు సంబల్పూర్ నుంచి బయలుదేరిందని స్పష్టమైంది. ఈ విషయాన్ని గ్రహించిన చాలా మంది ప్రయాణికులు ఇప్పుడు రైలు ఎక్కాలా వద్దా అని తెలియక తికమకపడ్డారు. కోచ్ లేకుండా వచ్చిన రైలు గురించి టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులు సహాయం కోసం ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్స్ (TTE)ను సంప్రదించారు. పలు నివేదికల ప్రకారం.. టికెట్లు బుక్ చేసుకున్న వారిని ఇతర కోచ్లలోని సీట్లలో కూర్చోమని చెప్పారు, అంతే కానీ అసలు ఏం జరిగిందో స్పష్టమైన వివరణ ఇవ్వలేదని వివరించారు.
ఘటనపై రైల్వే అధికారుల వివరణ..
ఈ ఘటనపై తూర్పు కోస్ట్ రైల్వే అధికారులు స్పందిస్తూ.. “సాంకేతిక సమస్య కారణంగా, ఒక రిజర్వు కోచ్ (BE2) ను రైలు నంబర్ 20809 కు అటాచ్ చేయడం సాధ్యం కాలేదు. టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులను ఆన్-బోర్డ్ TTE ఇతర కోచ్లలో అందుబాటులో ఉన్న ఖాళీ బెర్తులలో కూర్చునేలా ఏర్పాటు చేశారు” అని తూర్పు కోస్ట్ రైల్వే (ECoR) ఒక ప్రకటనలో తెలిపింది.
READ ALSO: Biker Release Date: శర్వా స్పీడ్ మామూలుగా లేదుగా! ‘బైకర్’ రిలీజ్ డేట్ లాక్..
తాజావార్తలు
-
Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
-
Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
-
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..