𝗦𝗥𝗜 𝗚𝗔𝗬𝗔𝗧𝗥𝗜 𝗗𝗘𝗩𝗜 𝗔𝗹𝗮𝗻𝗸𝗮𝗿𝗮𝗺: శ్రీ గాయత్రి దేవి అలంకారంలో బెజవాడ దుర్గమ్మ.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
𝗦𝗥𝗜 𝗚𝗔𝗬𝗔𝗧𝗥𝗜 𝗗𝗘𝗩𝗜 𝗔𝗹𝗮𝗻𝗸𝗮𝗿𝗮𝗺: ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.. వివిధ రూపాల్లో దర్శనం ఇస్తున్న కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలు తరలివస్తున్నారు.. ఇక, దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజుకు చేరుకోగా.. రెండవ రోజు అమ్మవారు శ్రీ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.. పంచముఖాలతో ఉండే గాయత్రీ దేవి స్వరూపానికి ఎంతో విశిష్టత ఉంది.. దీంతో.. గాయత్రి దేవి గా దర్శనం ఇస్తున్న అమ్మవారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుండే భక్తులు బారులు తీరారు.. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్తా విద్రుమ హేమనీల దవళవర్ణాలతో గాయత్రీ దేవి ప్రకాశిస్తుంది.. శిరస్సు యందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖ యందు రుద్రుడు నివసిస్తుండగా త్రికూర్త్యాంశంగా గాయత్రీ దేవి వెలుగొందుచున్న రూపాన్ని చూసి భక్తులు తరిస్తారు.. గాయత్రీ దేవి ని దర్శించుకుంటే సకల మంత్ర సిద్ధి ఫలం పొందుతారని భక్తుల విశ్వాసం..
Read Also: Kunja Satyavathi Dies: తెలంగాణ బీజేపీలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి కన్నుమూత!
Also Read
- Virat Kohli: "నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు".. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- 5 Best Salads for Glowing Skin: సింపుల్గా తయారుచేసే ఈ 5 సలాడ్లు వాడండి.. మీ చర్మం గులాబీ రంగులో మెరిసిపోతుంది..!
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
ఇక, శ్రీశైలంలో 2వ రోజు దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.. సాయంత్రం బ్రహ్మచారిణి అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి దర్శనం ఇవ్వనున్నారు.. మయూరవాహనంపై ఆశీనులై ప్రత్యేక పూజలందుకోనున్న శ్రీస్వామి, అమ్మవారు.. రాత్రి క్షేత్ర పురవీధుల్లో ఆదిదంపతుల గ్రామోత్సవం నిర్వహిస్తారు. మరోవైపు.. భద్రాద్రిలో నేటినుండి దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.. నవరాత్రుల్లో భాగంగా నేడు సంతాన లక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు అమ్మవారు. శ్రీ దేవి నవరాత్రుల సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో రెండవ రోజు బ్రహ్మచారిని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారు.. అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రెండవ రోజు బ్రహ్మచారిని దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు జోగులాంబ అమ్మవారు.. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతుండగా.. రెండవ రోజు బ్రహ్మచారిని అవతారం లో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు.. కాళేశ్వరంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు రెండో రోజుకు చేరగా.. బ్రహ్మచారిణి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ శుభానంద, సరస్వతీ దేవి అమ్మవారు.
తాజావార్తలు
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
-
Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..