India Post GDS Recruitment 2026: పోస్టల్ శాఖలో 28740 పోస్టులు.. 40 ఏళ్లున్నా అప్లై చేసుకోవచ్చు.. పరీక్ష లేదు
- పోస్టల్ శాఖలో 28740 పోస్టులు
- 10వ తరగతి/మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి
- 40 ఏళ్లున్నా అప్లై చేసుకోవచ్చు
- పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం నియామకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పదోతరగతి పాసై ఖాళీగా ఉన్నారా? ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ ఛాన్స్ ను అస్సలు వదులుకోకండి. 40 ఏళ్ల వయసున్నా అప్లై చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 28 వేలకు పైగా గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి ఇండియన్ పోస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. వన్-టైమ్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ ఫిబ్రవరి 14, ఆన్ లైన్ అప్లికేషన్, ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 16, 2026. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు నిర్ణీత తేదీలలోపు ఆన్లైన్ మోడ్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read:Top Headlines @9PM : టాప్ న్యూస్
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
ఇండియా పోస్ట్ GDS రిక్రూట్మెంట్ 2026కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థి తప్పనిసరిగా భారతీయ పౌరుడు అయి ఉండాలి.
ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి 10వ తరగతి/మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
10వ తరగతిలో గణితం, ఆంగ్ల సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
కనీస వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు, గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు మించకూడదు. రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
Also Read:Pawan Kalyan: జనసేన నేతలపై పవన్ కళ్యాణ్ ఫైర్.. తీరు మార్చుకోకపోతే ఉపేక్షించం!
జనరల్, OBC అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. SC, ST, దివ్యాంగ అభ్యర్థులు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. ఈ నియామక డ్రైవ్ 23 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 28,740 ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 – రూ.29,380; ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 – రూ.24,470 వేతనం ఉంటుంది. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం నియామకాలు చేపడతారు. ఎంపికైన వారికి సమాచారం ఎస్ఎంఎస్/ ఈమెయిల్/ పోస్టు ద్వారా అందుతుంది. అప్లై చేసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి. నోటిఫికేషన్ వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!