Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News 272 Eminent Personalities Back Election Commission Oppose Rahul Gandhi Allegations

EC: ‘కాంగ్రెస్ ఈసీ ప్రతిష్టను దిగ జారుస్తోంది’.. రాహుల్ గాంధీకి లేఖ రాసిన జడ్జీలు, మాజీ సైనికులు సహా 272 మంది..

Published Date :November 19, 2025 , 12:48 pm
By RAMAKRISHNA KENCHE
EC: ‘కాంగ్రెస్ ఈసీ ప్రతిష్టను దిగ జారుస్తోంది’.. రాహుల్ గాంధీకి లేఖ రాసిన జడ్జీలు, మాజీ సైనికులు సహా 272 మంది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Election Commission: దేశవ్యాప్తంగా 272 మంది ప్రముఖులు ఎన్నికల సంఘానికి మద్దతుగా బహిరంగ లేఖ విడుదల చేశారు. వీరిలో 16 మంది మాజీ న్యాయమూర్తులు, 123 మంది రిటైర్డ్ అధికారులు, 14 మంది మాజీ రాయబారులు, 133 మంది మాజీ సైనిక అధికారులు ఉన్నారు. కాంగ్రెస్, ప్రతిపక్ష నాయకులు ఎన్నికల సంఘంపై చేసిన నిరాధారమైన ఆరోపణలను ఖండిస్తూ లేఖ రాశారు. ఎన్నికల సంఘంతో సహా రాజ్యాంగ సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేందుకు పదే పదే కాంగ్రెస్, రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని లేఖలో ఆరోపించారు.

READ MORE: Andhra King Taluka: ఇది నా వ్యక్తిగత చిత్రం – రామ్ ఎమోషనల్ స్పీచ్ వైరల్

భారతదేశ ప్రజాస్వామ్యం బాహ్య దాడి కాదు.. విషపూరిత రాజకీయ వాక్చాతుర్యంతో సవాలు చేస్తున్నారని బహిరంగ లేఖ పేర్కొన్నారు. లేఖ ప్రకారం.. ప్రతిపక్షానికి ఈసీ వ్యతిరేకంగా ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కానీ ఎటువంటి అధికారిక ఫిర్యాదు లేదా అఫిడవిట్ దాఖలు చేయడం లేదు. ఆరోపణలు కేవలం రాజకీయ వ్యూహాలు మాత్రమే.. ఇవి ఎప్పటికీ నిజం కాదని పేర్కొన్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆ లేఖలో ఉదహరించారు. రాహుల్ గాంధీ ఇటీవల “ఓట్ చోరీ”కి అంశాన్ని లేవనెత్తారు. “అణుబాంబు” పేలనుందని ప్రకటన చేశారు. ఇటువంటి ప్రకటనలు ఎన్నికల కమిషన్ అధికారులను బెదిరించే ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తాయని లేఖలో రాసుకొచ్చారు. లేఖలోని నిపుణుల అభిప్రాయం ప్రకారం.. “EC SIR ప్రక్రియను పూర్తి పారదర్శకతతో నిర్వహించింది. కోర్టు పర్యవేక్షణలో ధృవీకరణ నిర్వహించింది. బోగస్ ఓటర్లను తొలగించింది. కొత్త అర్హత కలిగిన ఓటర్లను చేర్చింది. అందువల్ల.. ఈసీని “బీజేపీ B-టీమ్” అని పిలవడం రాజకీయం చేయడం మాత్రమే.. రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీలకు అనుకూలమైన ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు ఈసీపై విమర్శలు మాయమవుతాయి. కానీ ప్రతికూల ఫలితాలు వచ్చినప్పుడు కమిషన్‌ను “విలన్”గా మారుస్తారు. ఇది దౌర్జన్యం రాజకీయ అవకాశవాదాన్ని బహిర్గతం చేస్తుంది.” అని లేఖలో పేర్కొన్నారు.

READ MORE: 43 గంటల ప్లేబ్యాక్, 32dB వరకు ANC సపోర్ట్‌ తో Oppo Enco Buds 3 Pro+ లాంచ్.. ధర ఎంతంటే..?

ఈసీపై ఆరోపణలకు విదేశీ వేదికలను సైతం వాడుకున్న రాహుల్‌గాంధీ..
కాగా.. కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కేంద్ర ఎన్నికల వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు యత్నించారు. ఇందుకు గానూ విదేశీ వేదికలను సైతం ఆయన వాడుకున్నారు. గతంలో అమెరికా పర్యటన సందర్భంగా బోస్టన్‌లో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల సంఘం రాజీ పడింది. ఆ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయని మాకు స్పష్టంగా తెలుసు. ఇదే విషయాన్ని నేను చాలాసార్లు ప్రస్తావించాను. ఇటీవల మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7:30 గంటల మధ్య అక్కడ 65 లక్షల మంది ఓటు వేశారు. ఈ విషయం స్వయంగా ఎన్నికల సంఘమే మాతో పేర్కొంది. ఇది భౌతికంగా అసాధ్యమైనది. ఒక్కో ఓటర్‌ ఓటు వేయడానికి సుమారు 3 నిమిషాలు పడుతుంది. అంత తక్కువ వ్యవధిలో అంతమంది ఎలా ఓటు వేస్తారు. మేము వీడియోలు చూపించాలని అడిగితే ఈసీ తిరస్కరించింది. ఇప్పుడు అలా అడగటానికి వీలు లేదంటూ చట్టాన్ని కూడా మార్చేశారు’ అని రాహుల్ ఆరోపించారు. ఇటీవల బీహార్ ఎన్నికలకు ముందు కూడా రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 272 eminent personalities open letter
  • Congress criticism of Election Commission
  • EC BJP B-team accusation
  • EC transparency defence
  • Election Commission controversy India

తాజావార్తలు

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

  • Off The Record: అనంతపురం జిల్లాలో హాట్ హాట్ గా చెప్పు పాలిటిక్స్

  • CSK vs PBKS: ఆయుష్ మాత్రే విధ్వంసం.. పంజాబ్ ముందు భారీ టార్గెట్

  • Most Expensive Mango: అత్యంత ఖరీదైన మామిడి.. ఒకే కేజీతో స్పోర్ట్స్ బైకే కొనవచ్చు.. ఇంతకీ దీని ప్రత్యేకత ఏమిటి..?

  • US-Iran War: అమెరికన్ పైలట్ విషయంలో ఉత్కంఠ.. పట్టిస్తే భారీ ఫ్రైజ్ మనీ ఇస్తామని ఇరాన్ ప్రకటన..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions