EC: ‘కాంగ్రెస్ ఈసీ ప్రతిష్టను దిగ జారుస్తోంది’.. రాహుల్ గాంధీకి లేఖ రాసిన జడ్జీలు, మాజీ సైనికులు సహా 272 మంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Commission: దేశవ్యాప్తంగా 272 మంది ప్రముఖులు ఎన్నికల సంఘానికి మద్దతుగా బహిరంగ లేఖ విడుదల చేశారు. వీరిలో 16 మంది మాజీ న్యాయమూర్తులు, 123 మంది రిటైర్డ్ అధికారులు, 14 మంది మాజీ రాయబారులు, 133 మంది మాజీ సైనిక అధికారులు ఉన్నారు. కాంగ్రెస్, ప్రతిపక్ష నాయకులు ఎన్నికల సంఘంపై చేసిన నిరాధారమైన ఆరోపణలను ఖండిస్తూ లేఖ రాశారు. ఎన్నికల సంఘంతో సహా రాజ్యాంగ సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేందుకు పదే పదే కాంగ్రెస్, రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని లేఖలో ఆరోపించారు.
READ MORE: Andhra King Taluka: ఇది నా వ్యక్తిగత చిత్రం – రామ్ ఎమోషనల్ స్పీచ్ వైరల్
Also Read
- Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’
- Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
- CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
- PM Modi: పొదుపు మంత్రం ఆచరణ.. సగానికి సగం తగ్గిపోయిన మోడీ కాన్వాయ్
భారతదేశ ప్రజాస్వామ్యం బాహ్య దాడి కాదు.. విషపూరిత రాజకీయ వాక్చాతుర్యంతో సవాలు చేస్తున్నారని బహిరంగ లేఖ పేర్కొన్నారు. లేఖ ప్రకారం.. ప్రతిపక్షానికి ఈసీ వ్యతిరేకంగా ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కానీ ఎటువంటి అధికారిక ఫిర్యాదు లేదా అఫిడవిట్ దాఖలు చేయడం లేదు. ఆరోపణలు కేవలం రాజకీయ వ్యూహాలు మాత్రమే.. ఇవి ఎప్పటికీ నిజం కాదని పేర్కొన్నారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆ లేఖలో ఉదహరించారు. రాహుల్ గాంధీ ఇటీవల “ఓట్ చోరీ”కి అంశాన్ని లేవనెత్తారు. “అణుబాంబు” పేలనుందని ప్రకటన చేశారు. ఇటువంటి ప్రకటనలు ఎన్నికల కమిషన్ అధికారులను బెదిరించే ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తాయని లేఖలో రాసుకొచ్చారు. లేఖలోని నిపుణుల అభిప్రాయం ప్రకారం.. “EC SIR ప్రక్రియను పూర్తి పారదర్శకతతో నిర్వహించింది. కోర్టు పర్యవేక్షణలో ధృవీకరణ నిర్వహించింది. బోగస్ ఓటర్లను తొలగించింది. కొత్త అర్హత కలిగిన ఓటర్లను చేర్చింది. అందువల్ల.. ఈసీని “బీజేపీ B-టీమ్” అని పిలవడం రాజకీయం చేయడం మాత్రమే.. రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీలకు అనుకూలమైన ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు ఈసీపై విమర్శలు మాయమవుతాయి. కానీ ప్రతికూల ఫలితాలు వచ్చినప్పుడు కమిషన్ను “విలన్”గా మారుస్తారు. ఇది దౌర్జన్యం రాజకీయ అవకాశవాదాన్ని బహిర్గతం చేస్తుంది.” అని లేఖలో పేర్కొన్నారు.
READ MORE: 43 గంటల ప్లేబ్యాక్, 32dB వరకు ANC సపోర్ట్ తో Oppo Enco Buds 3 Pro+ లాంచ్.. ధర ఎంతంటే..?
ఈసీపై ఆరోపణలకు విదేశీ వేదికలను సైతం వాడుకున్న రాహుల్గాంధీ..
కాగా.. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు యత్నించారు. ఇందుకు గానూ విదేశీ వేదికలను సైతం ఆయన వాడుకున్నారు. గతంలో అమెరికా పర్యటన సందర్భంగా బోస్టన్లో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల సంఘం రాజీ పడింది. ఆ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయని మాకు స్పష్టంగా తెలుసు. ఇదే విషయాన్ని నేను చాలాసార్లు ప్రస్తావించాను. ఇటీవల మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7:30 గంటల మధ్య అక్కడ 65 లక్షల మంది ఓటు వేశారు. ఈ విషయం స్వయంగా ఎన్నికల సంఘమే మాతో పేర్కొంది. ఇది భౌతికంగా అసాధ్యమైనది. ఒక్కో ఓటర్ ఓటు వేయడానికి సుమారు 3 నిమిషాలు పడుతుంది. అంత తక్కువ వ్యవధిలో అంతమంది ఎలా ఓటు వేస్తారు. మేము వీడియోలు చూపించాలని అడిగితే ఈసీ తిరస్కరించింది. ఇప్పుడు అలా అడగటానికి వీలు లేదంటూ చట్టాన్ని కూడా మార్చేశారు’ అని రాహుల్ ఆరోపించారు. ఇటీవల బీహార్ ఎన్నికలకు ముందు కూడా రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.
తాజావార్తలు
-
Supreme Court: భార్య తన కెరీర్ కొనసాగించడం ‘‘భర్తను విడిచిపెట్టినట్లు కాదు’’
-
Peddi : ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్లో రెహమాన్ లైవ్ కాన్సర్ట్!
-
Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
-
CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
-
Anand Mahindra: మనుషులకు ప్రకృతి నేర్పే ‘డెడ్లీ’ లెసన్.. బిలియనీర్ చెప్పిన పవర్ఫుల్ మెసేజ్!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!