Corruption: చిక్కిన ఇద్దరు అవినీతి అధికారులు.. రూ.2.32 కోట్ల నగదు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Corruption: అవినీతి నిరోధక శాఖకు రెండు అవినీతి తిమింగలాలు చిక్కాయి. అవినీతి కేసులో ఇద్దరు ప్రభుత్వ అధికారులను అరెస్టు చేయగా.. అస్సాంలోని ధుబ్రి జిల్లాలో ఒకరి నివాసంలో రూ.2.32 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం జరిగిన ఆపరేషన్లో అరెస్టయిన ఇద్దరిలో అస్సాం సివిల్ సర్వీస్ (ఏసీఎస్) అధికారి కూడా ఉన్నారని తెలిపింది. ధుబ్రి జిల్లా పరిషత్ సీఈవో బిశ్వజిత్ గోస్వామి పూర్తి చేసిన పనుల బిల్లు మొత్తంలో 9 శాతాన్ని కాంట్రాక్టర్ నుంచి లంచంగా డిమాండ్ చేశారని ఆరోపిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు అందింది.
Also Read: Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. ఆరుగురు మృతి
Also Read
- Fridge Cleaning Tips: ఫ్రిడ్జ్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందా? ఎప్పుడూ ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి..
- UP: టోల్ బూత్ను ఢీకొట్టి పేలిన గ్యాస్ ట్యాంకర్.. భయానక సీసీటీవీ ఫుటేజ్ వైరల్(వీడియో)
- PMAY House Size Rules: PMAY కింద శాశ్వత ఇల్లు.. ఇంటి పరిమాణం ఎంత? ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు ఇవే
- Fact Check: యూపీలో హిందూ మహిళ ఆరుగురి ముస్లిం వ్యక్తుల తలలు నరికిందా? వైరల్ వార్తలో నిజమెంత?
ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు వారిని పట్టుకునేందుకు వల పన్నారు. సీఈవో కార్యాలయంలో ధుబ్రి అదనపు జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ మృణాల్ కాంతి సర్కార్ రూ.30 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఆ తర్వాత ఏసీఎస్ అధికారి బిశ్వజిత్ గోస్వామిని అరెస్ట్ చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బిశ్వజిత్ గోస్వామి ఆస్తులపై సోదాలు నిర్వహించగా.. రూ.2.32 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఆస్తి కొనుగోలు, బహుళ బ్యాంకు ఖాతాలు, ఇతర పెట్టుబడులకు సంబంధించిన అనేక పత్రాలు కూడా దొరికాయి.
ఆ ఇద్దరిని పట్టుకున్న అధికారులను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అభినందించారు. డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అవినీతి నిరోధక డ్రైవ్లో విజయవంతమైందని, ఫలితంగా మే 10, 2021 నుంచి 117 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేశామని సీఎం తెలిపారు. అదే దృఢ సంకల్పంతో, శక్తితో పరిపాలనలో అవినీతి నిర్మూలనకు కృషి కొనసాగుతుందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Ford: రూ.186 విలువ చేసే కుకీ దొంగిలించాడని ఆరోపణ.. రూ.1.9 కోట్ల జీతం తీసుకునే ఉద్యోగిని తొలగించిన ఫోర్డ్.. చివరికి
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Fridge Cleaning Tips: ఫ్రిడ్జ్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందా? ఎప్పుడూ ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి..
-
UP: టోల్ బూత్ను ఢీకొట్టి పేలిన గ్యాస్ ట్యాంకర్.. భయానక సీసీటీవీ ఫుటేజ్ వైరల్(వీడియో)
-
Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. బెయిల్ రద్దుకు నిరాకరణ
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!