Corruption: చిక్కిన ఇద్దరు అవినీతి అధికారులు.. రూ.2.32 కోట్ల నగదు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Corruption: అవినీతి నిరోధక శాఖకు రెండు అవినీతి తిమింగలాలు చిక్కాయి. అవినీతి కేసులో ఇద్దరు ప్రభుత్వ అధికారులను అరెస్టు చేయగా.. అస్సాంలోని ధుబ్రి జిల్లాలో ఒకరి నివాసంలో రూ.2.32 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం జరిగిన ఆపరేషన్లో అరెస్టయిన ఇద్దరిలో అస్సాం సివిల్ సర్వీస్ (ఏసీఎస్) అధికారి కూడా ఉన్నారని తెలిపింది. ధుబ్రి జిల్లా పరిషత్ సీఈవో బిశ్వజిత్ గోస్వామి పూర్తి చేసిన పనుల బిల్లు మొత్తంలో 9 శాతాన్ని కాంట్రాక్టర్ నుంచి లంచంగా డిమాండ్ చేశారని ఆరోపిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు అందింది.
Also Read: Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. ఆరుగురు మృతి
Also Read
- Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. 'నీలోఫర్' అసాధారణ ప్రయాణం.!
- Minister Satyakumar Yadav: ఆరోగ్యశ్రీ క్రెడిట్ వైఎస్ రాజశేఖర్రెడ్డిదే.. మంత్రి సత్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Mahindra XEV 9S: 679 కిలోమీటర్ల రేంజ్, 20 లక్షల లోపు ధర.. బాలీవుడ్ సెలబ్రిటీల హాట్ ఫేవరెట్ కారు..
- Ridge Gourd Peel Besan Curry Recipe: బీరకాయ తొక్కలను పారేయకండి.. ఈ సూపర్ కర్రీ ఒక్కసారి ట్రై చేస్తే మళ్లీ వదలరు...
ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు వారిని పట్టుకునేందుకు వల పన్నారు. సీఈవో కార్యాలయంలో ధుబ్రి అదనపు జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ మృణాల్ కాంతి సర్కార్ రూ.30 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఆ తర్వాత ఏసీఎస్ అధికారి బిశ్వజిత్ గోస్వామిని అరెస్ట్ చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బిశ్వజిత్ గోస్వామి ఆస్తులపై సోదాలు నిర్వహించగా.. రూ.2.32 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఆస్తి కొనుగోలు, బహుళ బ్యాంకు ఖాతాలు, ఇతర పెట్టుబడులకు సంబంధించిన అనేక పత్రాలు కూడా దొరికాయి.
ఆ ఇద్దరిని పట్టుకున్న అధికారులను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అభినందించారు. డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అవినీతి నిరోధక డ్రైవ్లో విజయవంతమైందని, ఫలితంగా మే 10, 2021 నుంచి 117 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేశామని సీఎం తెలిపారు. అదే దృఢ సంకల్పంతో, శక్తితో పరిపాలనలో అవినీతి నిర్మూలనకు కృషి కొనసాగుతుందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Oh..! Sukumari Teaser: ఐశ్వర్య రాజేష్ను ముట్టుకుంటే షాక్ కొడుతుందా?.. ఆసక్తి రేకెత్తిస్తున్న ‘ఓ..! సుకుమారి’ టీజర్!
-
Dhamaal 4 Trailer : దెయ్యాలు సముద్రపు దొంగలతో గోల్ మాల్… “ధమాల్ 4” ట్రైలర్ మామూలుగా లేదుగా
-
Sing Geetham: సింగ్ గీతాన్ని మిస్ చేసుకున్న టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Minister Satyakumar Yadav: ఆరోగ్యశ్రీ క్రెడిట్ వైఎస్ రాజశేఖర్రెడ్డిదే.. మంత్రి సత్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..