mumbai drugs: రూ.1,476కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్న డీఆర్ఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
mumbai drugs: మహారాష్ట్ర నవీ ముంబయిలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు భారీగా మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. ఆరెంజ్ పండ్ల బాక్సుల్లో దాచిపెట్టి అక్రమంగా తరలిస్తున్న 198 కిలోల హై ప్యూరిటీ క్రిస్టల్ మెథాంఫెటమైన్ (ఐస్), 9 కిలోల హై ప్యూరిటీ కొకైన్ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 1,476 కోట్లు ఉంటుందని తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు పట్టుకున్న యాంఫెటమైన్, కొకైన్లలో ఇదే పెద్ద మొత్తమని చెప్పారు.
Read also: america floods: అమెరికాలో ఇయాన్ బీభత్సం.. 54మంది మృతి
Also Read
- Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
- Ebola outbreak: ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
- Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
- IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం.. గత 12 రోజులుగా తనిఖీలు చేపట్టారు అధికారులు. సెప్టెంబర్ 12న తనిఖీలు చేస్తున్న సమయంలో పండ్ల ట్రక్కులో డ్రగ్స్ను గుర్తించారు. పండ్ల డబ్బాల్లో డ్రగ్స్ను దాచిపెట్టి కొత్త విధానంలో రవాణా చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇవి దక్షిణాఫ్రికా నుంచి వచ్చాయని.. దిగుమతిదారుడిని పట్టుకున్నామని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు.. అక్రమ రవాణా సూత్రధారుల్ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
Read also: ashok gehlot: సంచలన వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్
ఇక, క్రిస్టల్ మెథాంఫేటమిన్ అనేది సింథటిక్ డ్రగ్, చాలా అడిక్టివ్. క్రిస్టల్ మెథాంఫేటమిన్ అధిక స్వచ్ఛత స్థాయిని కలిగి ఉంటుంది. దీర్ఘకాలిక, తీవ్రమైన శారీరక ప్రభావాలను కలిగి ఉండవచ్చు. ధూమపానం లేదా డ్రగ్ను ఇంజెక్ట్ చేసుకునే వారు తీవ్రమైన అనుభూతిని అనుభవిస్తారు. గరిష్టంగా 12 గంటలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఆ ప్రభావం ఉంటుంది. ఇక, దక్షిణాఫ్రికా నుంచి వాలెన్సియా ఆరెంజ్ల మధ్య డ్రగ్స్ను అక్రమంగా తరలిస్తున్నారని.. స్మగ్లర్లు ముంబైని ట్రాన్సిట్ పాయింట్గా మార్చుకుని యూరప్ దేశాలకు లేదా యుఎస్కు సరఫరా చేస్తున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇక, డీఆర్ఐ అధికారులు ఇందుకు సంబంధించి దిగుమతిదారుని అరెస్టు చేశారు. అతనిని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఈ రాకెట్లో పాల్గొన్న కస్టమ్స్ హౌస్ ఏజెంట్, సిండికేట్ కోసం వెతుకుతోంది.
తాజావార్తలు
-
Virat Kohli: ఈ ముగ్గురు బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం.. నా వల్ల కాదు: విరాట్ కోహ్లీ
-
Ebola outbreak: ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
-
Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
-
IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
-
New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!