AP Cabinet Sub Committee: భూహక్కు-భూరక్షపై 15వ కేబినెట్ సబ్ కమిటీ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగనన్న భూహక్కు-భూరక్ష పథకంపై ఏర్పాటు చేసిన ఏపీ కేబినెట్ సబ్ కమిటీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ రావుతో పాటు ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ్ కల్లాం అధ్యక్షతన భేటీ అయింది. పథకం అమలుపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో మంత్రుల సబ్ కమిటీ సమీక్షించింది. అయితే, వచ్చే ఏడాది జనవరి నాటికి మూడో దశ సర్వే పూర్తి కావాలి.. దేశంలోనే అత్యంత వేగంగా సమగ్ర సర్వే మన రాష్ట్రంలోనే జరుగుతోంది అని సబ్ కమిటీ పేర్కొంది.
Read Also: Delhi High Court: ఆప్కు చెందిన రాఘవ్ చద్దా ప్రభుత్వ బంగ్లాలో ఉండొచ్చు..
Also Read
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
- PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
- APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
రెండు దశల్లో ఇప్పటి వరకు 4 వేల గ్రామాల్లో సర్వే పూర్తి చేసి భూహక్కు పత్రాలను కూడా పంపిణీ చేశారు అని మంత్రుల సబ్ కమిటీ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 13,072 గ్రామాల్లో డ్రోన్ ఫ్లైయింగ్ పూర్తి చేశామన్నారు. కేంద్ర అధికారులతో పాటు అయిదు రాష్ట్రాల నుంచి సర్వే విభాగ కమిషనర్లు రాష్ట్రంలో పర్యటించారు.. రాష్ట్రం అమలు చేస్తున్న విధానాన్ని పరిశీలించి సర్వే పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు అని కేబినెట్ సబ్ కమిటీలోని మంత్రులు అన్నారు.
Read Also: KP Nagarjuna Reddy: మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
బ్రిటీష్ పాలన తరువాత రాష్ట్రంలో ఒకేసారి నిర్థిష్టమైన విధానంతో జరుగుతున్న ఈ సర్వేలో ఎటువంటి అలసత్వం సహించేది లేదని అన్నారు. సీఎం జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని సబ్ కమిటీ తెలిపింది. ఇప్పటికే సమగ్ర సర్వేలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామకంఠం భూముల్లో నివాసితులకు న్యాయం జరిగేలా ఏపీ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని మంత్రుల కమిటీ పేర్కొనింది. అలాగే భూ యజమానుల నుంచి వచ్చే ఫిర్యాదులపై కూడా మొబైల్ మేజిస్ట్రేట్ కోర్ట్లో విచారించి, ఎవరికీ అన్యాయం జరుగకుండా చూడాలని కోరారు అని ఏపీ కేబినెట్ సబ్ కమిటీ చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!