Supreme Court: “నాన్న, నాకు రూ. కోటి ఇస్తేనే మీతో ఉంటా”.. తండ్రికి 12 ఏళ్ల కుమార్తె డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: సుప్రీంకోర్టులో న్యాయవాదుల నుంచి న్యాయమూర్తుల వరకు అందరూ ఒక 12 ఏళ్ల బాలిక మాటలు విని విస్తుపోయారు. ఆ బాలిక తండ్రితో కలిసి జీవించడానికి రూ.1 కోటి డిమాండ్ చేయడంతో షాక్ అయ్యారు. వాస్తవానికి దంపతుల మధ్య వివాదానికి సంబంధించిన పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ ఈ పిటిషన్ను విచారించారు. ఆ బాలిక మాటలు విని ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వెంటనే అమ్మాయి తల్లిని మందలించారు.
READ MORE: Fighter jets: మనకు కావాలి “5th జనరేషన్ ఫైటర్ జెట్స్”.. విదేశాల నుంచి కొనుగోలుకు యత్నం..
Also Read
- Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
ఓ జాతీయ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. వాస్తవానికి ఉత్తరాఖండ్కు చెందిన దంపతుల మధ్య వివాదం తలెత్తింది. వారికి ఓ కుమార్తె. ఈ వివాదంలో జిల్లా కోర్టు కూతురు బాధ్యతను తండ్రికి అప్పగించింది. జిల్లా కోర్టు ఈ ఉత్తర్వును హైకోర్టులో తల్లి సవాలు చేసింది. ప్రస్తుతం ఈ పిటిషన్ హైకోర్టులో పెండింగ్లో ఉంది. జిల్లా కోర్టు తీర్పును తల్లి ధిక్కరించిందని, తన కూతరును అప్పగించలేదని తండ్రి సుప్రీంకోర్టుకు చేరుకున్నాడు. ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఆ 12 ఏళ్ల బాలికను విచారించిన సుప్రీంకోర్టు సీజేఐ బీఆర్ గవాయ్ విస్తుపోయారు. ‘నువ్వు నా తల్లిని వేధిస్తున్నావు, నా తల్లిపై కోర్టు ధిక్కార కేసు దాఖలు చేశావు. నాకు రూ. కోటి ఇవ్వండి, అలాగైతేనే తండ్రి వద్దకు వెళ్తా.’ అని ఆ బాలిక చెబుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పాఠశాల రికార్డులలో తల్లి తండ్రి పేరును సైతం తొలగించారు.
READ MORE: Pawan Kalyan: వీరమల్లును బాయ్ కట్ చేసుకోమనండి
ఇది విన్న సీజేఐ బీఆర్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని గట్టిగా మందలించారు. బాలిక మనసును పాడు చేయవద్దు, తండ్రిపై తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించారు. అనవసరంగా ఈ వివాదంలోకి బిడ్డను లాగుతున్నారని మండిపడ్డారు. తల్లి కుమార్తె మనసులో తప్పుడు విషయాలు ద్వేషాన్ని నింపుతోందని చీఫ్ జస్టిస్ అన్నారు. ఈ అంశాన్ని కోర్టు తీవ్రంగా పరిగణిస్తోందని తెలిపారు. తండ్రి తరపున సీనియర్ న్యాయవాది పీఆర్ పట్వాలియా సుప్రీంకోర్టులో వాదించారు. తల్లి తరపు న్యాయవాది అనుభా అగర్వాల్ మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇరు పక్షాలు అంగీకరించిన తర్వాత కోర్టు చివరికి ఈ అంశాన్ని మధ్యవర్తికి అప్పగించింది. ఉత్తరాఖండ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతు బహ్రీని మధ్యవర్తిగా నియమించింది.
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..