Paris Olympics 2024: 14 ఏళ్లకే ఒలింపిక్స్ లో చోటు సంపాదించిన భారత స్విమ్మర్..
- పారిస్ ఒలింపిక్స్ 2024లో పాల్గొనే భారత జట్టులో 117 మంది ఆటగాళ్లు ఉన్నారు.
- అతి పిన్న వయస్కురాలైన ధినిధి దేశింగు ఒకటి.
- స్విమ్మర్ ధినిధి కేవలం 14 సంవత్సరాల వయస్సులో అతిపెద్ద క్రీడల వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించనుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024లో పాల్గొనే భారత జట్టులో 117 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఈ ఒలింపిక్ జట్టులో అతి పిన్న వయస్కురాలైన ధినిధి దేశింగు ఒకటి. స్విమ్మర్ ధినిధి కేవలం 14 సంవత్సరాల వయస్సులో అతిపెద్ద క్రీడల వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. యూనివర్సాలిటీ కోటా సహాయంతో ధీనిధికి పారిస్ వెళ్ళే అవకాశం వచ్చింది. ఒకప్పుడు నీళ్లలో కాలు పెట్టాలంటే కూడా భయపడే ధినిధి పారిస్ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ధీనిధి కేవలం మూడు సంవత్సరాల వయస్సులో ఈత కొట్టడం మొదలు పెట్టింది. ఆ సమయంలో ధినిధికి మాట్లాడటం కూడా కష్టంగా ఉంది. దానివల్ల ఆమెలో ఆత్మవిశ్వాసం పెరగలేదు. ఈ కారణంగానే కుటుంబం ఎలాగైనా క్రీడల్లో చేర్చాలని నిర్ణయించుకుంది. ధినిధికి మొదట్లో నీటిలోకి వెళ్లడం ఇష్ట పడలేదు.
GNSS-Based Toll System : “ఎంత దూరం ప్రయాణిస్తే అంతే టోల్ ఫీ”.. నితిన్ గడ్కరీ బిగ్ అనౌన్స్మెంట్..
Also Read
- IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
- SRH Vs RCB: ఉప్పల్లో మ్యాచ్ ముగిసినా స్టేడియంలోనే ఉండండి.. కారణం ఏంటంటే..
దినిధి తాజాగా ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ.., ‘నాకు నీరు అస్సలు ఇష్టం లేదు. నేను లోపలికి వెళ్లాలని అనుకోలేదు. నేను నా పాదాలను కూడా కొలనులో ఉంచలేకపోయాను. నాకు చాలా కష్టంగా అనిపించేది. మరుసటి సంవత్సరం వెళ్ళేటప్పటికి ఇంకా నా భయం పోలేదు. నన్ను ప్రశాంతగా ఉండటానికి తల్లిదండ్రులు ఆమెకు ఈత నేర్పించారని కూడా ఆమె తెలిపింది. ఇక్కడి నుంచి ధీనిధి ప్రయాణం మొదలైంది. ధనిధి నుంచి నీటి భయం పోయింది కానీ.. టోర్నీల భయం మాత్రం పోలేదు. తన కుమార్తె ప్రతిభను తాను నమ్ముతానని, అయితే ఆమెలో భయాన్ని తొలగించలేకపోయానని ఆమె తల్లి జెస్సిత చెప్పారు. ప్రతి టోర్నమెంట్కు ముందు ఆమె ఒత్తిడిని అనుభవీస్తోంది. దానివల్ల ఆమెకు జ్వరం లేదా వాంతులు ప్రతిసారీ వస్తాయని ఆమె తెలిపింది.
Revanth Reddy: ముఖ్యమంత్రి ఆదేశాలతో గిరిజన అమ్మాయికి ఐఐటీకి వెళ్లేలా ప్రభుత్వం సాయం..
ఇకపోతే జాతీయ క్రీడల్లో ధీనిధి ఏడు బంగారు పతకాలు సాధించి, ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలుగా రికార్డ్ సృష్టించింది. 200 మీటర్ల ఫ్రీస్టైల్ లో జాతీయ రికార్డు నెలకొల్పింది. గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో కూడా పాల్గొంది. ఆమె పారిస్ ఒలింపిక్స్లో 200 మీటర్ల ఫ్రీస్టైల్లో కూడా పాల్గొంటుంది.
117 athletes are part of the Indian contingent at the Paris Olympics. Dhinidhi is the youngest member
తాజావార్తలు
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
VishnuPriya : ఏడ్చి ఏడ్చి విసిగిపోయా, ఇక నోరు మూసుకునేది లేదు: విష్ణుప్రియ ఫైర్!
-
Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
-
RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
-
SRH Vs RCB: ఉప్పల్లో మ్యాచ్ ముగిసినా స్టేడియంలోనే ఉండండి.. కారణం ఏంటంటే..
ట్రెండింగ్
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!