Chennai: ఆత్మహత్య చేసుకోవడం ఎలా?.. నటించి చూపించబోయాడు.. కానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai: తమిళనాడులోని చెన్నైలో పుజాల్ ప్రాంతంలో శనివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నటించిన విద్యార్థి.. గొంతుకు దారం బిగుసుకుని ప్రాణాలు కోల్పోయాడు. చెన్నైలోని పుజాల్ సమీపంలోని పుతాగరం వద్ద కామరాజర్ నగర్లోని 8వ వీధికి చెందిన శ్రీనివాసన్ రెండో కుమారుడు కార్తిక్.. అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఒక గదిలో తన అన్నయ్య రామ్శరణ్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఎలా..? అని కార్తిక్ నటిస్తూ చూపించబోయాడు. ఈ నేపథ్యంలో ప్రమాదవశాత్తు స్టూల్ నుంచి జారిపడ్డాడు. అతని మెడకు ఉచ్చు బిగుసుకోవడం అతని మరణానికి దారితీసింది. ఘటన జరిగిన సమయంలో అబ్బాయిల తల్లి అముద తాను పనిచేస్తున్న అన్నానగర్ వస్త్ర దుకాణంలో ఉంది.
మృతుడు కార్తిక్ సోదరుడు రామ్శరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. అబ్బాయిలు ఒక డ్రామా ఆడాలని నిర్ణయించుకున్నారు, అందులో వారు ఆత్మహత్య సన్నివేశాన్ని ఆడతారు. అందులో ఒకరు ఉరివేసుకుని మరొకరు అతనిని రక్షించడానికి వస్తారు. తదనంతరం, కార్తీక్ తాను అనేక టీవీ డ్రామాలలో చూసిన సన్నివేశాన్ని చేస్తానని చెప్పాడు. తదనుగుణంగా ఒక గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. అతని అన్నయ్య, రామ్శరణ్ బయట నిలబడి కిటికీలోంచి చూస్తున్నాడు. కార్తిక్ స్టూల్పై లేచి నిలబడి నైలాన్ తాడును దాని ఒక చివరను సీలింగ్కి కట్టి అతని మెడకు చుట్టుకున్నాడు. అతని నటన కొనసాగిస్తుండగా.. అతను కాలు బ్యాలెన్స్ తప్పి జారిపోయాడు. స్టూల్ కింద పడిపోవడంతో కార్తీక్ మెడకు ఉచ్చు బిగుసుకుందని రామ్శరణ్ కథనం ప్రకారం పోలీసులు తెలిపారు.
Also Read
- Lift Accident : లిఫ్ట్లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
PFI: పీఎఫ్ఐపై కూపీ లాగుతున్న ఈడీ.. విదేశాల్లోనూ స్వచ్చంద సంస్థ పేరుతో నిధులు వసూలు
కార్తీక్ సహాయం కోసం అరిచాడు. మొత్తం ఘటనను చూసిన రామ్శరణ్ తలుపులు పగులగొట్టేందుకు ప్రయత్నించినా విఫలమయ్యాడు. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లి సహాయం కోసం ఇరుగు పొరుగు వారిని పిలిచాడు. స్థానికులు వారు తలుపులు పగులగొట్టి కార్తీక్ మెడలోని ఉచ్చును విప్పారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పుజాల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. కొన్నేళ్ల క్రితం తన భర్త జయరామన్ మరణించిన తర్వాత అముద తన ఇద్దరు పిల్లలు రామ్శరణ్, కార్తిక్లను పెంచుకుంటుందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!