Chennai: ఆత్మహత్య చేసుకోవడం ఎలా?.. నటించి చూపించబోయాడు.. కానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai: తమిళనాడులోని చెన్నైలో పుజాల్ ప్రాంతంలో శనివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నటించిన విద్యార్థి.. గొంతుకు దారం బిగుసుకుని ప్రాణాలు కోల్పోయాడు. చెన్నైలోని పుజాల్ సమీపంలోని పుతాగరం వద్ద కామరాజర్ నగర్లోని 8వ వీధికి చెందిన శ్రీనివాసన్ రెండో కుమారుడు కార్తిక్.. అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఒక గదిలో తన అన్నయ్య రామ్శరణ్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఎలా..? అని కార్తిక్ నటిస్తూ చూపించబోయాడు. ఈ నేపథ్యంలో ప్రమాదవశాత్తు స్టూల్ నుంచి జారిపడ్డాడు. అతని మెడకు ఉచ్చు బిగుసుకోవడం అతని మరణానికి దారితీసింది. ఘటన జరిగిన సమయంలో అబ్బాయిల తల్లి అముద తాను పనిచేస్తున్న అన్నానగర్ వస్త్ర దుకాణంలో ఉంది.
మృతుడు కార్తిక్ సోదరుడు రామ్శరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. అబ్బాయిలు ఒక డ్రామా ఆడాలని నిర్ణయించుకున్నారు, అందులో వారు ఆత్మహత్య సన్నివేశాన్ని ఆడతారు. అందులో ఒకరు ఉరివేసుకుని మరొకరు అతనిని రక్షించడానికి వస్తారు. తదనంతరం, కార్తీక్ తాను అనేక టీవీ డ్రామాలలో చూసిన సన్నివేశాన్ని చేస్తానని చెప్పాడు. తదనుగుణంగా ఒక గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. అతని అన్నయ్య, రామ్శరణ్ బయట నిలబడి కిటికీలోంచి చూస్తున్నాడు. కార్తిక్ స్టూల్పై లేచి నిలబడి నైలాన్ తాడును దాని ఒక చివరను సీలింగ్కి కట్టి అతని మెడకు చుట్టుకున్నాడు. అతని నటన కొనసాగిస్తుండగా.. అతను కాలు బ్యాలెన్స్ తప్పి జారిపోయాడు. స్టూల్ కింద పడిపోవడంతో కార్తీక్ మెడకు ఉచ్చు బిగుసుకుందని రామ్శరణ్ కథనం ప్రకారం పోలీసులు తెలిపారు.
Also Read
- Ather Konarc Launched: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. మెటల్ బాడీ, స్మార్ట్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
- Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
- King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
- PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
PFI: పీఎఫ్ఐపై కూపీ లాగుతున్న ఈడీ.. విదేశాల్లోనూ స్వచ్చంద సంస్థ పేరుతో నిధులు వసూలు
కార్తీక్ సహాయం కోసం అరిచాడు. మొత్తం ఘటనను చూసిన రామ్శరణ్ తలుపులు పగులగొట్టేందుకు ప్రయత్నించినా విఫలమయ్యాడు. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లి సహాయం కోసం ఇరుగు పొరుగు వారిని పిలిచాడు. స్థానికులు వారు తలుపులు పగులగొట్టి కార్తీక్ మెడలోని ఉచ్చును విప్పారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పుజాల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. కొన్నేళ్ల క్రితం తన భర్త జయరామన్ మరణించిన తర్వాత అముద తన ఇద్దరు పిల్లలు రామ్శరణ్, కార్తిక్లను పెంచుకుంటుందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Ather Konarc Launched: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. మెటల్ బాడీ, స్మార్ట్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
-
Taapsee Pannu: టాలీవుడ్లోకి తాప్సీ రీ ఎంట్రీ.. ఆ డైరెక్టర్తో హారర్ మూవీ?
-
H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
-
Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
-
Race 4: ‘రేస్’ రీబూట్లో అమీర్ ఖాన్.. సిద్ధార్థ్, టైగర్తో అల్టిమేట్ యాక్షన్ ?
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!