Pakistan: పాక్లో మరణ మృదంగం.. వేర్వేరు ఘటనల్లో 29 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలో బాంబు పేలుడు జరిగింది. వజీరిస్థాన్లోని గుల్మిర్కోట్ ప్రాంతంలో ఓ వ్యాన్ కార్మికులతో వెళ్తున్న వ్యాన్ను ఉగ్రవాదులు పేల్చివేశారు. శనివారం షావాల్ తహసీల్లోని గుల్మీర్ కోట్ సమీపంలో 16 మంది కూలీలతో వెళ్తున్న వాహనాన్ని ఉగ్రవాదులు పేల్చివేశారని డిప్యూటీ కమిషనర్ రెహాన్ గుల్ ఖట్టక్ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో 11 మంది కార్మికులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనంలో పనిచేస్తున్న కనీసం 11 మంది కార్మికులు అక్కడికక్కడే మరణించగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కూలీలు మాకిన్, వానా తహసీల్లకు చెందినవారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Read Also: Congress Working Committee: కాంగ్రెస్ టాప్ బాడీలోకి సచిన్ పైలట్, శశిథరూర్, రఘువీరారెడ్డి
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
రోడ్డు ప్రమాదంలో 18 మంది మృతి
ఆదివారం ఉదయం పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహిళలు, పిల్లలు సహా కనీసం 18 మంది మృతి చెందగా.. మరో 16 మంది గాయపడ్డారు. కరాచీ నుంచి 40 మంది ప్రయాణికులతో ఇస్లామాబాద్ వెళ్తున్న బస్సు తెల్లవారుజామున 4.30 గంటలకు ఫైసలాబాద్ హైవే (మోటార్వే)లోని పిండి భట్టియాన్ ప్రాంతంలో వ్యాన్ను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. బస్సు ఇంధన ట్యాంకర్ను ఢీకొనడంతో కొద్దిసేపటికే మంటలు చెలరేగాయి.
Read Also: Himachal Pradesh: వరదలతో హిమాచల్ అతలాకుతలం.. రూ.200 కోట్లు మంజూరు చేసిన కేంద్రం
మోటర్వే పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) సుల్తాన్ ఖ్వాజా మాట్లాడుతూ.. “మోటార్వేలోని పిండి భట్టియాన్ ప్రాంతంలో ఇంధన ట్యాంక్తో వెళ్తున్న ఆగి ఉన్న వ్యాన్పై బస్సు ఢీకొట్టింది. బస్సు వెనుక నుండి దానిని ఢీకొట్టింది. రెండు వాహనాలకు తక్షణమే మంటలు అంటుకున్నాయి. కనీసం 18 మంది ప్రయాణికులు మరణించారు. మరో 16 మంది క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించినట్లు ఆయన తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఐజీ తెలిపారు. బస్సులో నుంచి దూకిన ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. రెండు వాహనాలు మంటల్లో చిక్కుకోవడంతో మరికొందరు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. రెండు వాహనాల డ్రైవర్లు కూడా చనిపోయారు.
బస్సు డ్రైవర్ నిద్రమత్తులో జారుకున్నాడా లేక అతివేగం వల్లే ప్రమాదం జరిగిందా అనేది ఇంకా తెలియరాలేదని ఐజీ ఖ్వాజా తెలిపారు. వ్యాన్లో ఫ్యూయల్ ట్యాంక్ లేకుంటే రెండు వాహనాలకు మంటలు చెలరేగేవి కావని చెప్పారు. డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతులను గుర్తించి మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగిస్తామని తెలిపారు. ప్రమాదంలో మరణించిన వ్యక్తుల పట్ల పంజాబ్ తాత్కాలిక ముఖ్యమంత్రి మొహ్సిన్ నఖ్వీ సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!