Nepal: నేపాల్ పార్లమెంటరీ ఎన్నికల్లో శతాధిక స్వాతంత్య్ర సమరయోధుడు.. ప్రచండపై పోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal: నవంబరు 20న జరగనున్న నేపాల్ పార్లమెంటరీ ఎన్నికల్లో మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండపై పోటీ చేసి, హిమాలయ దేశాన్ని మళ్లీ హిందూ రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో శతాధిక స్వాతంత్ర్య సమరయోధుడైన టికా దత్తా పోఖారెల్ పోటీలో ఉన్నారు. గూర్ఖా జిల్లాలో జన్మించిన పోఖారెల్, 67 ఏళ్ల ప్రచండకు వ్యతిరేకంగా 11 మంది అభ్యర్థులతో పాటు గూర్ఖా – 2 నియోజకవర్గాల నుంచి అభ్యర్థిత్వాన్ని దాఖలు చేసినట్లు అధికార నేపాలీ కాంగ్రెస్ నుంచి విడిపోయిన నేపాలీ కాంగ్రెస్ (బీపీ) అధ్యక్షుడు సుశీల్ మాన్ సెర్చన్ తెలిపారు.99 ఏళ్ల వయసులో ఎన్నికల సంఘం ఆయన పేరును అభ్యర్థిగా నమోదు చేసింది. పోఖారెల్ సోమవారంతో 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, బాగా నడవగలరని, మాట్లాడగలరని, రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారని సెర్చన్ తెలిపారు.
ఏడుగురు పిల్లల తండ్రి అయిన పోఖారెల్ నేపాలీ కాంగ్రెస్ (బీపీ) తరుపున నీటి పాత్ర గుర్తుతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.నవంబరు 20న జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న అతి ఎక్కువ వయస్సు గల అభ్యర్థి ఆయనే. నేపాల్లో ఫెడరల్ పార్లమెంట్, ప్రావిన్షియల్ అసెంబ్లీకి నవంబర్ 20న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.దేశంలో అసలు నాయకుడే లేడని, తమను తాము నాయకులుగా చెప్పుకునే వారు కేవలం డబ్బు సంపాదించడానికే వచ్చారని పోఖారెల్ను ఉటంకిస్తూ సెర్చన్ పేర్కొన్నారు.
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
GST: అక్టోబర్లో అత్యధికంగా జీఎస్టీ వసూళ్లు.. లక్షన్నర కోట్లు దాటిన కలెక్షన్లు
ప్రజలకు హక్కులు కల్పించేందుకు, దేశాన్ని మళ్లీ హిందూ రాష్ట్రంగా మార్చేందుకు అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశానని తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న పోఖారెల్ అన్నారు. నేపాల్ తన 239 ఏళ్ల హిందూ రాచరికాన్ని 2008లో రద్దు చేసింది. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు తన ఇంటికి వచ్చిన ప్రజలతో పోఖారెల్ మాట్లాడుతూ.. ప్రచండను ఓడించి ఎన్నికల్లో గెలుస్తానని పోఖారెల్ పేర్కొన్నాడు.”గూర్ఖా రాయి, మట్టికి నేనెలాంటి వ్యక్తినో తెలుసునని, ప్రజలకు బాగా తెలుసు. నా ప్రత్యర్థి ఈ దేశ విధానానికి, సూత్రాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయకుండా దేశాన్ని దోచుకున్నారు’ అని పోఖారెల్ వ్యాఖ్యానించారు. దశాబ్దాల తిరుగుబాటు సమయంలో నేపాలీ కాంగ్రెస్లోని చాలా మంది నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్న మావోయిస్టు పార్టీతో నేపాలీ కాంగ్రెస్ ఎలా పొత్తు పెట్టుకుంటుందని ఆయన అధికార నేపాలీ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. గోర్ఖా జిల్లాలో ప్రచండ అభ్యర్థిత్వానికి నేపాలీ కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చింది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!