Nepal: నేపాల్ పార్లమెంటరీ ఎన్నికల్లో శతాధిక స్వాతంత్య్ర సమరయోధుడు.. ప్రచండపై పోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal: నవంబరు 20న జరగనున్న నేపాల్ పార్లమెంటరీ ఎన్నికల్లో మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండపై పోటీ చేసి, హిమాలయ దేశాన్ని మళ్లీ హిందూ రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో శతాధిక స్వాతంత్ర్య సమరయోధుడైన టికా దత్తా పోఖారెల్ పోటీలో ఉన్నారు. గూర్ఖా జిల్లాలో జన్మించిన పోఖారెల్, 67 ఏళ్ల ప్రచండకు వ్యతిరేకంగా 11 మంది అభ్యర్థులతో పాటు గూర్ఖా – 2 నియోజకవర్గాల నుంచి అభ్యర్థిత్వాన్ని దాఖలు చేసినట్లు అధికార నేపాలీ కాంగ్రెస్ నుంచి విడిపోయిన నేపాలీ కాంగ్రెస్ (బీపీ) అధ్యక్షుడు సుశీల్ మాన్ సెర్చన్ తెలిపారు.99 ఏళ్ల వయసులో ఎన్నికల సంఘం ఆయన పేరును అభ్యర్థిగా నమోదు చేసింది. పోఖారెల్ సోమవారంతో 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, బాగా నడవగలరని, మాట్లాడగలరని, రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారని సెర్చన్ తెలిపారు.
ఏడుగురు పిల్లల తండ్రి అయిన పోఖారెల్ నేపాలీ కాంగ్రెస్ (బీపీ) తరుపున నీటి పాత్ర గుర్తుతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.నవంబరు 20న జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న అతి ఎక్కువ వయస్సు గల అభ్యర్థి ఆయనే. నేపాల్లో ఫెడరల్ పార్లమెంట్, ప్రావిన్షియల్ అసెంబ్లీకి నవంబర్ 20న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.దేశంలో అసలు నాయకుడే లేడని, తమను తాము నాయకులుగా చెప్పుకునే వారు కేవలం డబ్బు సంపాదించడానికే వచ్చారని పోఖారెల్ను ఉటంకిస్తూ సెర్చన్ పేర్కొన్నారు.
Also Read
- PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
- AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు కీలక అడుగు!
- High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
- Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
GST: అక్టోబర్లో అత్యధికంగా జీఎస్టీ వసూళ్లు.. లక్షన్నర కోట్లు దాటిన కలెక్షన్లు
ప్రజలకు హక్కులు కల్పించేందుకు, దేశాన్ని మళ్లీ హిందూ రాష్ట్రంగా మార్చేందుకు అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశానని తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న పోఖారెల్ అన్నారు. నేపాల్ తన 239 ఏళ్ల హిందూ రాచరికాన్ని 2008లో రద్దు చేసింది. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు తన ఇంటికి వచ్చిన ప్రజలతో పోఖారెల్ మాట్లాడుతూ.. ప్రచండను ఓడించి ఎన్నికల్లో గెలుస్తానని పోఖారెల్ పేర్కొన్నాడు.”గూర్ఖా రాయి, మట్టికి నేనెలాంటి వ్యక్తినో తెలుసునని, ప్రజలకు బాగా తెలుసు. నా ప్రత్యర్థి ఈ దేశ విధానానికి, సూత్రాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయకుండా దేశాన్ని దోచుకున్నారు’ అని పోఖారెల్ వ్యాఖ్యానించారు. దశాబ్దాల తిరుగుబాటు సమయంలో నేపాలీ కాంగ్రెస్లోని చాలా మంది నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్న మావోయిస్టు పార్టీతో నేపాలీ కాంగ్రెస్ ఎలా పొత్తు పెట్టుకుంటుందని ఆయన అధికార నేపాలీ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. గోర్ఖా జిల్లాలో ప్రచండ అభ్యర్థిత్వానికి నేపాలీ కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చింది.
తాజావార్తలు
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు కీలక అడుగు!
-
Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్పైనే ఆశలు!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!