Nepal: నేపాల్ పార్లమెంటరీ ఎన్నికల్లో శతాధిక స్వాతంత్య్ర సమరయోధుడు.. ప్రచండపై పోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal: నవంబరు 20న జరగనున్న నేపాల్ పార్లమెంటరీ ఎన్నికల్లో మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండపై పోటీ చేసి, హిమాలయ దేశాన్ని మళ్లీ హిందూ రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో శతాధిక స్వాతంత్ర్య సమరయోధుడైన టికా దత్తా పోఖారెల్ పోటీలో ఉన్నారు. గూర్ఖా జిల్లాలో జన్మించిన పోఖారెల్, 67 ఏళ్ల ప్రచండకు వ్యతిరేకంగా 11 మంది అభ్యర్థులతో పాటు గూర్ఖా – 2 నియోజకవర్గాల నుంచి అభ్యర్థిత్వాన్ని దాఖలు చేసినట్లు అధికార నేపాలీ కాంగ్రెస్ నుంచి విడిపోయిన నేపాలీ కాంగ్రెస్ (బీపీ) అధ్యక్షుడు సుశీల్ మాన్ సెర్చన్ తెలిపారు.99 ఏళ్ల వయసులో ఎన్నికల సంఘం ఆయన పేరును అభ్యర్థిగా నమోదు చేసింది. పోఖారెల్ సోమవారంతో 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, బాగా నడవగలరని, మాట్లాడగలరని, రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారని సెర్చన్ తెలిపారు.
ఏడుగురు పిల్లల తండ్రి అయిన పోఖారెల్ నేపాలీ కాంగ్రెస్ (బీపీ) తరుపున నీటి పాత్ర గుర్తుతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.నవంబరు 20న జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న అతి ఎక్కువ వయస్సు గల అభ్యర్థి ఆయనే. నేపాల్లో ఫెడరల్ పార్లమెంట్, ప్రావిన్షియల్ అసెంబ్లీకి నవంబర్ 20న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.దేశంలో అసలు నాయకుడే లేడని, తమను తాము నాయకులుగా చెప్పుకునే వారు కేవలం డబ్బు సంపాదించడానికే వచ్చారని పోఖారెల్ను ఉటంకిస్తూ సెర్చన్ పేర్కొన్నారు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
GST: అక్టోబర్లో అత్యధికంగా జీఎస్టీ వసూళ్లు.. లక్షన్నర కోట్లు దాటిన కలెక్షన్లు
ప్రజలకు హక్కులు కల్పించేందుకు, దేశాన్ని మళ్లీ హిందూ రాష్ట్రంగా మార్చేందుకు అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశానని తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న పోఖారెల్ అన్నారు. నేపాల్ తన 239 ఏళ్ల హిందూ రాచరికాన్ని 2008లో రద్దు చేసింది. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు తన ఇంటికి వచ్చిన ప్రజలతో పోఖారెల్ మాట్లాడుతూ.. ప్రచండను ఓడించి ఎన్నికల్లో గెలుస్తానని పోఖారెల్ పేర్కొన్నాడు.”గూర్ఖా రాయి, మట్టికి నేనెలాంటి వ్యక్తినో తెలుసునని, ప్రజలకు బాగా తెలుసు. నా ప్రత్యర్థి ఈ దేశ విధానానికి, సూత్రాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయకుండా దేశాన్ని దోచుకున్నారు’ అని పోఖారెల్ వ్యాఖ్యానించారు. దశాబ్దాల తిరుగుబాటు సమయంలో నేపాలీ కాంగ్రెస్లోని చాలా మంది నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్న మావోయిస్టు పార్టీతో నేపాలీ కాంగ్రెస్ ఎలా పొత్తు పెట్టుకుంటుందని ఆయన అధికార నేపాలీ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. గోర్ఖా జిల్లాలో ప్రచండ అభ్యర్థిత్వానికి నేపాలీ కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చింది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!