Nepal: నేపాల్ పార్లమెంటరీ ఎన్నికల్లో శతాధిక స్వాతంత్య్ర సమరయోధుడు.. ప్రచండపై పోటీ
Nepal: నవంబరు 20న జరగనున్న నేపాల్ పార్లమెంటరీ ఎన్నికల్లో మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండపై పోటీ చేసి, హిమాలయ దేశాన్ని మళ్లీ హిందూ రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో శతాధిక స్వాతంత్ర్య సమరయోధుడైన టికా దత్తా పోఖారెల్ పోటీలో ఉన్నారు. గూర్ఖా జిల్లాలో జన్మించిన పోఖారెల్, 67 ఏళ్ల ప్రచండకు వ్యతిరేకంగా 11 మంది అభ్యర్థులతో పాటు గూర్ఖా – 2 నియోజకవర్గాల నుంచి అభ్యర్థిత్వాన్ని దాఖలు చేసినట్లు అధికార నేపాలీ కాంగ్రెస్ నుంచి విడిపోయిన నేపాలీ కాంగ్రెస్ (బీపీ) అధ్యక్షుడు సుశీల్ మాన్ సెర్చన్ తెలిపారు.99 ఏళ్ల వయసులో ఎన్నికల సంఘం ఆయన పేరును అభ్యర్థిగా నమోదు చేసింది. పోఖారెల్ సోమవారంతో 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, బాగా నడవగలరని, మాట్లాడగలరని, రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారని సెర్చన్ తెలిపారు.
ఏడుగురు పిల్లల తండ్రి అయిన పోఖారెల్ నేపాలీ కాంగ్రెస్ (బీపీ) తరుపున నీటి పాత్ర గుర్తుతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.నవంబరు 20న జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న అతి ఎక్కువ వయస్సు గల అభ్యర్థి ఆయనే. నేపాల్లో ఫెడరల్ పార్లమెంట్, ప్రావిన్షియల్ అసెంబ్లీకి నవంబర్ 20న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.దేశంలో అసలు నాయకుడే లేడని, తమను తాము నాయకులుగా చెప్పుకునే వారు కేవలం డబ్బు సంపాదించడానికే వచ్చారని పోఖారెల్ను ఉటంకిస్తూ సెర్చన్ పేర్కొన్నారు.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
GST: అక్టోబర్లో అత్యధికంగా జీఎస్టీ వసూళ్లు.. లక్షన్నర కోట్లు దాటిన కలెక్షన్లు
ప్రజలకు హక్కులు కల్పించేందుకు, దేశాన్ని మళ్లీ హిందూ రాష్ట్రంగా మార్చేందుకు అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశానని తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న పోఖారెల్ అన్నారు. నేపాల్ తన 239 ఏళ్ల హిందూ రాచరికాన్ని 2008లో రద్దు చేసింది. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు తన ఇంటికి వచ్చిన ప్రజలతో పోఖారెల్ మాట్లాడుతూ.. ప్రచండను ఓడించి ఎన్నికల్లో గెలుస్తానని పోఖారెల్ పేర్కొన్నాడు.”గూర్ఖా రాయి, మట్టికి నేనెలాంటి వ్యక్తినో తెలుసునని, ప్రజలకు బాగా తెలుసు. నా ప్రత్యర్థి ఈ దేశ విధానానికి, సూత్రాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయకుండా దేశాన్ని దోచుకున్నారు’ అని పోఖారెల్ వ్యాఖ్యానించారు. దశాబ్దాల తిరుగుబాటు సమయంలో నేపాలీ కాంగ్రెస్లోని చాలా మంది నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్న మావోయిస్టు పార్టీతో నేపాలీ కాంగ్రెస్ ఎలా పొత్తు పెట్టుకుంటుందని ఆయన అధికార నేపాలీ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. గోర్ఖా జిల్లాలో ప్రచండ అభ్యర్థిత్వానికి నేపాలీ కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చింది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!