Pakistan: పాక్లోని పెషావర్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్థాన్లోని పెషావర్లో మోటార్సైకిల్లో అమర్చిన బాంబు పేలడంతో కనీసం ఒకరు మరణించగా, మరో ముగ్గురు గాయపడినట్లు జియో న్యూస్ గురువారం నివేదించింది. ప్రాంతీయ రాజధానిలో బుధవారం మోటార్సైకిల్ మరమ్మతులు చేస్తుండగా పేలుడు సంభవించింది. పెషావర్ పాకిస్థాన్లోని ఆరవ అతిపెద్ద నగరం, ఖైబర్ పఖ్తుంక్వా రాజధాని. “మోటారు సైకిల్లో అమర్చిన బాంబు పేలిన తర్వాత పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన తీరుపై సమాచారం సేకరిస్తున్నాం. మోటార్సైకిల్ను రిపేర్ చేస్తున్నప్పుడు పేలుడు సంభవించినట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి” అని పోలీసు అధికారులు తెలిపారు.
Read Also: Megha Parmar: మేఘా పర్మార్ను అంబాసిడర్గా తొలగించిన ఎంపీ సర్కారు
Also Read
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
పెషావర్లోని రింగ్రోడ్లోని ఓ హోటల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాయపడిన ముగ్గురిలో మోటారుసైకిల్ యజమాని ఒకరు, గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడులో 200 గ్రాముల ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ)ని ఉపయోగించినట్లు బాంబు నిర్వీర్య బృందం ఒక ప్రకటనలో తెలిపింది. పేలుడు ఘటనపై విచారణ జరుగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!