Javed Akhtar: హిందువులపై పాక్ అధ్యక్షుడి వ్యాఖ్యలు.. “మిస్టర్ 10%” అంటూ జావెద్ అక్తర్ కౌంటర్..
- పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ హిందువులపై చేసిన వ్యాఖ్యలు వైరల్.
- పాకిస్థాన్లో 3–4% హిందువులను “సహిస్తున్నాం” అని జర్దారీ వ్యాఖ్య.
- జావేద్ అఖ్తర్ “మిస్టర్ 10%” అంటూ జర్దారీపై వ్యంగ్య వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Javed Akhtar: పాకిస్తాన్లో హిందూ మైనారిటీలను ఉద్దేశిస్తూ ఆ దేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో జర్దారీ మాట్లాడుతూ.. పాక్ మొత్తం జనాభాలో హిందువులు 3-4శాతం ఉన్నారని, దేశంలోని ముస్లింలు వీరిని ‘‘సహిస్తున్నారు’’ అని అన్నారు. ఇదే కాకుండా భారతీయులపై నోరు పారేసుకున్నారు. భారతీయుల దృక్పథం వేరుగా ఉందని, వారికి తమదైన ఎజెండా ఉందని, వారు అఖండ భారత్ను విశ్వసిస్తున్నారని, కానీ మధ్యలో జరిగిన అనేక విసయాలను మర్చిపోయారని జర్దారీ అన్నారు. మేము ముస్లింలం, కానీ 3-4 శాతం హిందూ జనాభాను సహించే మానసికత మాకు ఉందని, వారు మాతో ఉండటానికి ఇష్టపడుతారని అన్నారు.
అయితే, ఈ వ్యాఖ్యలపై సినీ గేయరచయిత జావేద్ అఖ్తర్ తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్లో జర్దారీకి ఉన్న ‘‘మిస్టర్ 10 పర్సెంటేజ్’’ అనే మారుపేరును ప్రస్తావిస్తూ వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. జావేద్ అఖ్తర్ తన పోస్టులో.. “మిస్టర్ జర్దారీ.. తమ దేశంలో 3–4 శాతం హిందువులను సహిస్తున్నామని అంటున్నారు. 10 శాతం కంటే తక్కువ ఉన్న వారందరి పట్ల మీరు ఎప్పుడూ సున్నితత్వం లేకుండా వ్యవహరించారని అర్థమవుతోంది” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
Also Read
- Nainar Nagendran: సీఎం విజయ్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. తమిళనాడు బీజేపీ చీఫ్పై ఫిర్యాదు!
- Varanasi Airport Gunfire: ఎయిర్పోర్టులో కాల్పుల కలకలం.. లైసెన్స్డ్ పిస్టల్ పేలడంతో ఇద్దరు సిబ్బందికి గాయాలు
- CAG Railway Report: రైల్వే స్టేషన్లలో నీళ్లు తాగుతున్నారా?.. CAG రిపోర్ట్లో సంచలన విషయాలు
- PM Modi: ‘దేశం.. ప్రజాస్వామ్యం శాశ్వతంగా వర్ధిల్లాలి’.. వాజ్పేయీ సందేశాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని..
గతంలో కూడా జావేద్ అక్తర్ పాక్ తీరుపై బహిరంగంగా విమర్శలు చేశారు. 2025 మేలో ముంబైలో జరిగిన ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన భారత్-పాకిస్థాన్ సంబంధాలపై మాట్లాడుతూ.. పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని, ఉగ్రవాదులకు తన భూభాగాన్ని సురక్షిత స్థావరంగా ఉపయోగించుకునే అవకాశం ఇస్తోందని ఆరోపించారు.
మిస్టర్ 10% జర్దారీ:
పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ గురించి సొంతదేశంలోనే ఒక విమర్శ ఉంది. అంతా అతడిని మిస్టర్ 10%గా పిలుస్తారు. ఏ పని చేయాలన్నా ఆయనకు 10 శాతం కమిషన్ ఇవ్వాల్సిందే అని అక్కడి వారు అనుకుంటారు. అంత అవీనితి చేసిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. భార్య బెనజీర్ భుట్టో ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ కాంట్రాక్టులు, ప్రాజెక్టులు, అనుమతుల విషయంలో 10% కమీషన్ తీసుకుంటారనే ఆరోపణలు రావడంతో ఈ పేరు బాగా పాతుకుపోయింది.
తాజావార్తలు
-
Rajasthan Crime: తాత హత్యకు దారితీసిన పెళ్లి వివాదం
-
Javed Akhtar: హిందువులపై పాక్ అధ్యక్షుడి వ్యాఖ్యలు.. “మిస్టర్ 10%” అంటూ జావెద్ అక్తర్ కౌంటర్..
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై బీసీసీఐ భేటీ.. చీఫ్ సెలెక్టర్గా మాజీ పేసర్?
-
Top 5 Best-Selling Scooters in India: భారత్ లో టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లు.. టాప్లో యాక్టివా
-
West Bengal: కాంగ్రెస్ నేత, కుమారుడి కాల్చివేత.. ఇంటికి వెళ్తున్న సమయంలో దారుణం..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?