Cholera Outbreak: జాంబియాలో కలరాతో 400 మందికి పైగా మృతి.. 10,000 మందికి ఇన్ఫెక్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cholera Outbreak: ఆఫ్రికా దేశం జాంబియాలో కలరా విజృంభిస్తోంది. ఇప్పటి వరకు ఆ దేశంలో 400 మందికి పైగా మరణించారు. మరో 10,000 మందికి ఈ వ్యాధి సోకినట్లు తేలింది. కలరా భయంతో పాఠశాలల్ని మూసేసింది అక్కడి ప్రభుత్వం. సామూహిక టీకా కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు, స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తోంది. దేశ రాజధానిలో ఫుట్బాల్ స్టేడియంలో చికిత్స అందించేందుకు ఏర్పాట్లను చేసింది.
Read Also: Heart Attack: విషాదం.. క్లాసు వింటూనే కుప్పకూలిన సివిల్ సర్వీసెస్ అభ్యర్థి..
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
కలరా అనేది బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్. ఇది తీవ్రమైన డయేరియాకు దారి తీస్తుంది. కలుషిత నీరు, ఆహారం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. జాంబియాలో కలరా వ్యాప్తి గతేడాది అక్టోబర్ నెలలో ప్రారంభమైంది. ఇప్పటి వరకు 412 మంది మరణించారు. 10,413 కేసులు నమోదయ్యాయి. దేశంలోని సగం జిల్లాలు, 10 ప్రావిన్సుల్లోని తొమ్మిదింటిలో కలరాను కనుగొన్నట్లు జాంబియన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 2 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో రోజుకు 400 కంటే ఎక్కువ కలరా కేసులు నమోదువుతున్నాయి.
మలావీ, మొజాంబిక్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా దేశాల్లో 2023 ప్రారంభం నుంచి కలరా కేసులు నమోదవుతున్నాయి. 2023లో దశాబ్దాలలో మలావిలో కలరా వ్యాప్తి అత్యంత దారుణంగా ఉంది. గతేడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ.. నైజీరియా, ఉగాండా దేశాలతో సహా సుమారు 30 దేశాలు గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన వ్యాప్తికి గురయ్యాయని నివేదించింది. 1970 నుంచి జాంబియాలో చాలా సార్లు కలరా వ్యాప్తి చెందింది. ఎక్కువ కేసులు రాజధాని లుసాకాలోనే ఉన్నాయి. 60,000 సీటింగ్ సామర్థ్యం ఉన్న ఫుట్బాట్ స్టేడియాన్ని తాత్కాలిక ఆస్పత్రిగా మార్చింది అక్కడి ప్రభుత్వం. డబ్ల్యూహెచ్ఓ నుంచి జాంబియాకు దాదాపుగా 1.4 మిలియన్ డోసుల కలరా వ్యాక్సిన్ అందింది. త్వరలోనే 2,00,000 డోసులు వస్తాయని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!