CM Yogi: బంగ్లాదేశ్ ఘటనలు మనకు హెచ్చరిక.. లౌకికవాదుల హిందువుల గురించి ఎందుకు మాట్లాడరు..?
- బంగ్లాదేశ్ పరిణామాలకు మనకు హెచ్చరిక..
- హిందువుల హత్యలపై మౌనం ఎందుకు..?
- లౌకికవాదుల్ని ప్రశ్నించిన సీఎం యోగి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Yogi: కులం, మతం, వర్గం ఆధారంగా జరిగే విభజనలు సంపూర్ణ వినాశనానికి కారణం అవుతాయని, బంగ్లాదేశ్ పరిస్థితులు తలెత్తుతాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రయాగ్ రాజ్లోని మాఘ మేళాలో కార్యక్రమంలో శనివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘బంగ్లాదేశ్ ఘటనపై ఎవరూ మాట్లాడరు. లౌకివాదం పేరుతో దుకాణాలు నడుపుతున్న వ్యక్తులు హిందూ సమాజాన్ని, సనాతన ధర్మాన్ని విచ్చిన్నం చేయాలని చూస్తు్న్నారు. సనాతన ధర్మాన్ని విడదీయాలని అనుకుంటున్నారు. కానీ బంగ్లాదేశ్ సంఘటనల విషయానికి వస్తే వారి నోళ్లు ఫెవికాల్, టేప్తో మూతపడినట్లు ప్రవర్తిస్తున్నారు. బంగ్లాదేశ్ సంఘటనలపై కనీసం కొవ్వత్తుల ప్రదర్శన కూడా చేయలేదు. ఇది మనకు హెచ్చరిక’’ అని అన్నారు.
Read Also: Sankranti Celebrations : ఆత్రేయపురంలో నోరూరించే గోదావరి రుచులు.. సంక్రాంతి ఫుడ్ ఫెస్టివల్..!
Also Read
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
- Indian Railways: రేపటి నుంచి రైల్వే కొత్త రూల్స్.. వెయిటింగ్ టికెట్లు, అడ్వాన్స్ బుకింగ్లలో కీలక మార్పులు
- UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్పై ఎస్పీ విమర్శలు..
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
సమాజాన్ని విభజించేవారు ప్రజలకు శ్రేయస్సును కోరుకోరని సీఎం హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు, ఈ వ్యక్తులు తమ కుటుంబాల కోసమే ఆలోచించారని, వారికి మళ్లీ అవకాశం వస్తే గతంలో చేసినట్లే చేస్తారని, వారు మళ్లీ అధికారంలోకి రాకుండా చూడాలని, డబుల్-ఇంజన్ ప్రభుత్వం ఎల్లప్పుడూ సనాతన విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి నిలబడుతుందని చెప్పారు. విభజనవాదులు మనల్ని బలహీనపరచడానికి అనుమతించొద్దని, మనందరం ఈ సంకల్పంతో ముందుకు సాగితే, భవిష్యత్తు సనాతన ధర్మానిదే అని అన్నారు. రామమందిరంపై జెండాలాగే, సనాతన జెండా ప్రపంచవ్యాప్తంగా రెపరెపలాడుతుందని, అప్పుడు బంగ్లాదేశ్లో బలహీనమైన, దళిత హిందువులను చంపడానికి ఎవరూ సాహసించరు అని యోగి అన్నారు.
సమాజాన్ని ఏకం చేయడానికి సాధువులు దారి చూపిస్తారని చెప్పారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం సాధువల ఐక్యత ఫలితమే అని అన్నారు. 1952 తర్వాత దేశానికి చాలా మంది ప్రధానులు వచ్చారు, కానీ అయోధ్యలో రామ్ లల్లా పున:ప్రతిష్టను ప్రధాని మోడీ చేసి చూపించారని అన్నారు.
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!