CM Yogi: బంగ్లాదేశ్ ఘటనలు మనకు హెచ్చరిక.. లౌకికవాదుల హిందువుల గురించి ఎందుకు మాట్లాడరు..?
- బంగ్లాదేశ్ పరిణామాలకు మనకు హెచ్చరిక..
- హిందువుల హత్యలపై మౌనం ఎందుకు..?
- లౌకికవాదుల్ని ప్రశ్నించిన సీఎం యోగి..
CM Yogi: కులం, మతం, వర్గం ఆధారంగా జరిగే విభజనలు సంపూర్ణ వినాశనానికి కారణం అవుతాయని, బంగ్లాదేశ్ పరిస్థితులు తలెత్తుతాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రయాగ్ రాజ్లోని మాఘ మేళాలో కార్యక్రమంలో శనివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘బంగ్లాదేశ్ ఘటనపై ఎవరూ మాట్లాడరు. లౌకివాదం పేరుతో దుకాణాలు నడుపుతున్న వ్యక్తులు హిందూ సమాజాన్ని, సనాతన ధర్మాన్ని విచ్చిన్నం చేయాలని చూస్తు్న్నారు. సనాతన ధర్మాన్ని విడదీయాలని అనుకుంటున్నారు. కానీ బంగ్లాదేశ్ సంఘటనల విషయానికి వస్తే వారి నోళ్లు ఫెవికాల్, టేప్తో మూతపడినట్లు ప్రవర్తిస్తున్నారు. బంగ్లాదేశ్ సంఘటనలపై కనీసం కొవ్వత్తుల ప్రదర్శన కూడా చేయలేదు. ఇది మనకు హెచ్చరిక’’ అని అన్నారు.
Read Also: Sankranti Celebrations : ఆత్రేయపురంలో నోరూరించే గోదావరి రుచులు.. సంక్రాంతి ఫుడ్ ఫెస్టివల్..!
Also Read
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
సమాజాన్ని విభజించేవారు ప్రజలకు శ్రేయస్సును కోరుకోరని సీఎం హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు, ఈ వ్యక్తులు తమ కుటుంబాల కోసమే ఆలోచించారని, వారికి మళ్లీ అవకాశం వస్తే గతంలో చేసినట్లే చేస్తారని, వారు మళ్లీ అధికారంలోకి రాకుండా చూడాలని, డబుల్-ఇంజన్ ప్రభుత్వం ఎల్లప్పుడూ సనాతన విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి నిలబడుతుందని చెప్పారు. విభజనవాదులు మనల్ని బలహీనపరచడానికి అనుమతించొద్దని, మనందరం ఈ సంకల్పంతో ముందుకు సాగితే, భవిష్యత్తు సనాతన ధర్మానిదే అని అన్నారు. రామమందిరంపై జెండాలాగే, సనాతన జెండా ప్రపంచవ్యాప్తంగా రెపరెపలాడుతుందని, అప్పుడు బంగ్లాదేశ్లో బలహీనమైన, దళిత హిందువులను చంపడానికి ఎవరూ సాహసించరు అని యోగి అన్నారు.
సమాజాన్ని ఏకం చేయడానికి సాధువులు దారి చూపిస్తారని చెప్పారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం సాధువల ఐక్యత ఫలితమే అని అన్నారు. 1952 తర్వాత దేశానికి చాలా మంది ప్రధానులు వచ్చారు, కానీ అయోధ్యలో రామ్ లల్లా పున:ప్రతిష్టను ప్రధాని మోడీ చేసి చూపించారని అన్నారు.
తాజావార్తలు
-
Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!
-
Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
-
Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?