Sankranti Celebrations : ఆత్రేయపురంలో నోరూరించే గోదావరి రుచులు.. సంక్రాంతి ఫుడ్ ఫెస్టివల్..!
- గోదావరి రుచులతో సంక్రాంతి సందడి
- పూతరేకులకే భారీ క్రేజ్
- డ్వాక్రా మహిళలకు ఉపాధి వేదిక
- పండుగతో పాటు వినోదం కూడా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోనసీమ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆత్రేయపురంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ భోజన ప్రియులను మంత్రముగ్ధులను చేస్తోంది. గోదావరి జిల్లాలకే ప్రత్యేకమైన సంప్రదాయ వంటకాలు, నోరూరించే పిండివంటలతో ఈ ఉత్సవం ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదాన్ని కూడా పంచుతోంది. పండగ సెలవుల నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుండి తరలివస్తున్న పర్యాటకులతో ఆత్రేయపురం సందడిగా మారింది.
ఈ ఫుడ్ ఫెస్టివల్లో ప్రధాన ఆకర్షణ ‘ఆత్రేయపురం పూతరేకులు’. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ పూతరేకులను ఇక్కడ ప్రత్యేక స్టాల్స్లో ప్రదర్శిస్తున్నారు. డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం, పిస్తా , బెల్లం పొడితో తయారు చేసిన ఈ పూతరేకుల కోసం పర్యాటకులు క్యూ కడుతున్నారు. వీటితో పాటు నెయ్యిలో దోరగా వేయించిన నేతి బొబ్బట్లు, సున్నుండలు, బెల్లం గవ్వలు , కారం గవ్వల సువాసనలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.
Also Read
- CM Chandrababu: ఏపీ పెట్టుబడుల గమ్యస్థానం.. అభివృద్ధిపై సీఎం కీలక వ్యాఖ్యలు
- AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
- TTD: టీటీడీ కీలక నిర్ణయం.. దాతలకు తిరుమలలో కొత్త రూల్స్.. అర్ధరాత్రి నుంచి అమలు..
- SIR గడువు పొడిగింపు.. ఈసీ సవరించిన షెడ్యూల్ విడుదల
ఈ ఉత్సవం కేవలం ఆహారానికే పరిమితం కాకుండా, మహిళా సాధికారతకు వేదికగా నిలిచింది. ఈ ఫుడ్ ఫెస్టివల్ను పూర్తిస్థాయిలో డ్వాక్రా (DWACRA) మహిళల ద్వారా ఏర్పాటు చేశారు. ఆత్రేయపురం గ్రామంలో సుమారు 1500 మంది మహిళలు పూతరేకుల తయారీపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. తరతరాలుగా వస్తున్న ఈ కళ ద్వారా వారు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారని, గౌరవప్రదమైన సంపాదనతో తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారని స్థానిక ప్రతినిధులు గర్వంగా చెబుతున్నారు.
ఆధునిక పోకడలకు భిన్నంగా, ఈ ఫెస్టివల్లో ప్రకృతి సిద్ధమైన ఆహార పదార్థాలకు ప్రాధాన్యతనిచ్చారు. మామిడి తాండ్రి, తాడి తాండ్రి రోల్స్ ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయని, ఇవి పర్యాటకులకు ఇష్టమైన చిరుతిండిగా మారాయని నిర్వాహకులు తెలిపారు. అలాగే, మైదా , ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా కేవలం చిరుధాన్యాలతో (Millets) తయారు చేసిన నూడిల్స్ వంటి హోమ్ మేడ్ వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఆత్రేయపురం పూతరేకులకు ఉన్న క్రేజ్ వల్ల కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాల నుండి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారు. హైదరాబాద్ , వైజాగ్ నుండి వచ్చిన పర్యాటకులు మాట్లాడుతూ.. ఇక్కడ ఫుడ్ క్వాలిటీ అద్భుతంగా ఉందని, ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో (Reasonable) ఉన్నాయని ప్రశంసిస్తున్నారు. ఫుడ్ ఫెస్టివల్తో పాటు బోట్ రేసింగ్, స్విమ్మింగ్ వంటి వినోద కార్యక్రమాలను కూడా పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు. మొత్తానికి, గోదావరి జిల్లా సంస్కృతి, సంప్రదాయాలు , అద్భుతమైన రుచులను ఒకే చోట ఆస్వాదించే అరుదైన అవకాశం ఈ ఆత్రేయపురం ఫుడ్ ఫెస్టివల్ ద్వారా లభిస్తోంది.
Google Photosలో అదిరే ఫీచర్.. ఇకపై మీకు నచ్చిన సమయంలోనే బ్యాకప్..!
తాజావార్తలు
-
Taslima Nasrin: 20 ఏళ్ల నిరీక్షణకు ముగింపు.. కోల్కతాకు తిరిగి వస్తున్న తస్లీమా
-
CM Chandrababu: ఏపీ పెట్టుబడుల గమ్యస్థానం.. అభివృద్ధిపై సీఎం కీలక వ్యాఖ్యలు
-
Shruti Haasan : సొంతంగా ఇల్లు కొని ఒంటరిగా గృహప్రవేశం చేసిన శృతి హాసన్.. అసలేం జరిగింది?
-
Samay Raina: నటుడు సమయ్ రైనాకు సుప్రీంకోర్టు షాక్.. రూ.10 లక్షల జరిమానా
-
Tollywood Sequels : టాలీవుడ్ను ఊపేస్తున్న సీక్వెల్ ఫీవర్.. తారక్, చరణ్, మహేష్’ల నెక్ట్స్ ప్లాన్ ఏంటి?
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!