IMD Alert: దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ
- దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- రెండు రోజులు ఎల్లో అలర్ట్ జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాదిలోని పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఇప్పటికే తమిళనాడు, కేరళ సహా పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా శనివారం, ఆదివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. రాబోయే రెండు, మూడు రోజుల్లో తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింది. తమిళనాడులో 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. కోయంబత్తూర్, మదురై, ఈరోడ్, విరుదునగర్, తిరునల్వేలి, కన్యాకుమారి, శివగంగ, కృష్ణగిరి, రామనాథపురం, ధర్మపురి, సేలం, నమక్కల్, కరూర్, తూత్తుకుడి జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్సుంది. 35-45 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. దక్షిణ తమిళనాడు తీరం, గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరియు కెమరూన్ ప్రాంతం చుట్టూ గాలులు గంటకు 55 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు.. వచ్చే 48 గంటల పాటు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. ఈశాన్య రుతుపవనాల కారణంగా ఈ భారీ వర్షాలు కురుస్తున్నట్లు పేర్కొంది. అక్టోబరు 17న ప్రారంభమైన ఈశాన్య రుతుపవనాలతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Shocking Video: భర్త చనిపోయిన బెడ్ను ఐదు నెలల గర్భిణితో శుభ్రం చేయించిన ఆస్పత్రి సిబ్బంది..
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
ఇక దేశంలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు హెచ్చు, తగ్గులుగా ఉన్నాయి. దోయాబ్ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రత 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ తగ్గింది. గత 24 గంటల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, దక్షిణ దోబ్ ప్రాంతంలో ఉష్ణోగ్రత సాధారణం కంటే 2-4 డిగ్రీలు ఎక్కువగా ఉంది. ఆదివారం ఉదయం నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉందని ఎండీ తెలిపింది.
ఇదిలా ఉంటే వాతావరణ పరిస్థితుల కారణంగా డెంగ్యూ, మలేరియా, లెప్టోస్పిరోసిస్, ఇన్ఫ్లుఎంజా వంటి అంటువ్యాధులు విస్తరిస్తున్నాయి. ఈ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు. దోమలు వృద్ధి చెందకుండా ఉండేందుకు తమ ఆవరణలో నిలిచిన నీటిని తొలగించాలని సూచించారు.
ఇది కూడా చదవండి: Delhi: దారుణం.. భర్త ప్రైవేట్ పార్ట్ కోసి భార్య పరారీ
#WATCH | Delhi: IMD scientist Soma Sen Roy said, "…We have received reports of heavy rainfall, mainly from South Peninsular India and Tamil Nadu… However, there are no reports of heavy rainfall from the rest of the country… Heavy rainfall is likely over Tamil Nadu and… pic.twitter.com/1YzkHDqI6d
— ANI (@ANI) November 2, 2024
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!