IMD Alert: దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ
- దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- రెండు రోజులు ఎల్లో అలర్ట్ జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాదిలోని పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఇప్పటికే తమిళనాడు, కేరళ సహా పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా శనివారం, ఆదివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. రాబోయే రెండు, మూడు రోజుల్లో తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింది. తమిళనాడులో 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. కోయంబత్తూర్, మదురై, ఈరోడ్, విరుదునగర్, తిరునల్వేలి, కన్యాకుమారి, శివగంగ, కృష్ణగిరి, రామనాథపురం, ధర్మపురి, సేలం, నమక్కల్, కరూర్, తూత్తుకుడి జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్సుంది. 35-45 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. దక్షిణ తమిళనాడు తీరం, గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరియు కెమరూన్ ప్రాంతం చుట్టూ గాలులు గంటకు 55 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు.. వచ్చే 48 గంటల పాటు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. ఈశాన్య రుతుపవనాల కారణంగా ఈ భారీ వర్షాలు కురుస్తున్నట్లు పేర్కొంది. అక్టోబరు 17న ప్రారంభమైన ఈశాన్య రుతుపవనాలతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Shocking Video: భర్త చనిపోయిన బెడ్ను ఐదు నెలల గర్భిణితో శుభ్రం చేయించిన ఆస్పత్రి సిబ్బంది..
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
ఇక దేశంలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు హెచ్చు, తగ్గులుగా ఉన్నాయి. దోయాబ్ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రత 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ తగ్గింది. గత 24 గంటల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, దక్షిణ దోబ్ ప్రాంతంలో ఉష్ణోగ్రత సాధారణం కంటే 2-4 డిగ్రీలు ఎక్కువగా ఉంది. ఆదివారం ఉదయం నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉందని ఎండీ తెలిపింది.
ఇదిలా ఉంటే వాతావరణ పరిస్థితుల కారణంగా డెంగ్యూ, మలేరియా, లెప్టోస్పిరోసిస్, ఇన్ఫ్లుఎంజా వంటి అంటువ్యాధులు విస్తరిస్తున్నాయి. ఈ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు. దోమలు వృద్ధి చెందకుండా ఉండేందుకు తమ ఆవరణలో నిలిచిన నీటిని తొలగించాలని సూచించారు.
ఇది కూడా చదవండి: Delhi: దారుణం.. భర్త ప్రైవేట్ పార్ట్ కోసి భార్య పరారీ
#WATCH | Delhi: IMD scientist Soma Sen Roy said, "…We have received reports of heavy rainfall, mainly from South Peninsular India and Tamil Nadu… However, there are no reports of heavy rainfall from the rest of the country… Heavy rainfall is likely over Tamil Nadu and… pic.twitter.com/1YzkHDqI6d
— ANI (@ANI) November 2, 2024
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..