IMD Alert: దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ
- దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- రెండు రోజులు ఎల్లో అలర్ట్ జారీ
దక్షిణాదిలోని పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఇప్పటికే తమిళనాడు, కేరళ సహా పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా శనివారం, ఆదివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. రాబోయే రెండు, మూడు రోజుల్లో తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింది. తమిళనాడులో 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. కోయంబత్తూర్, మదురై, ఈరోడ్, విరుదునగర్, తిరునల్వేలి, కన్యాకుమారి, శివగంగ, కృష్ణగిరి, రామనాథపురం, ధర్మపురి, సేలం, నమక్కల్, కరూర్, తూత్తుకుడి జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్సుంది. 35-45 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. దక్షిణ తమిళనాడు తీరం, గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరియు కెమరూన్ ప్రాంతం చుట్టూ గాలులు గంటకు 55 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు.. వచ్చే 48 గంటల పాటు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. ఈశాన్య రుతుపవనాల కారణంగా ఈ భారీ వర్షాలు కురుస్తున్నట్లు పేర్కొంది. అక్టోబరు 17న ప్రారంభమైన ఈశాన్య రుతుపవనాలతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Shocking Video: భర్త చనిపోయిన బెడ్ను ఐదు నెలల గర్భిణితో శుభ్రం చేయించిన ఆస్పత్రి సిబ్బంది..
Also Read
- Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
- FASTag Major Changes: ఫాస్టాగ్ విధానంలో సంచలన మార్పులు.. నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
- Designer Pen Smuggling: ఒక్కో పెన్ను రూ.50 వేలు.. కస్టమ్స్ సైతం నివ్వెరపోయే స్మగ్లింగ్!
- Toes Writing: నిరాశకు లొంగని ధైర్యం.. చేతులు లేకపోయినా సాటిలేని ప్రతిభ.. కాళ్లతో రాసి ఫస్ట్ డివిజన్ సాధించిన శివాని
ఇక దేశంలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు హెచ్చు, తగ్గులుగా ఉన్నాయి. దోయాబ్ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రత 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ తగ్గింది. గత 24 గంటల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, దక్షిణ దోబ్ ప్రాంతంలో ఉష్ణోగ్రత సాధారణం కంటే 2-4 డిగ్రీలు ఎక్కువగా ఉంది. ఆదివారం ఉదయం నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉందని ఎండీ తెలిపింది.
ఇదిలా ఉంటే వాతావరణ పరిస్థితుల కారణంగా డెంగ్యూ, మలేరియా, లెప్టోస్పిరోసిస్, ఇన్ఫ్లుఎంజా వంటి అంటువ్యాధులు విస్తరిస్తున్నాయి. ఈ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు. దోమలు వృద్ధి చెందకుండా ఉండేందుకు తమ ఆవరణలో నిలిచిన నీటిని తొలగించాలని సూచించారు.
ఇది కూడా చదవండి: Delhi: దారుణం.. భర్త ప్రైవేట్ పార్ట్ కోసి భార్య పరారీ
#WATCH | Delhi: IMD scientist Soma Sen Roy said, "…We have received reports of heavy rainfall, mainly from South Peninsular India and Tamil Nadu… However, there are no reports of heavy rainfall from the rest of the country… Heavy rainfall is likely over Tamil Nadu and… pic.twitter.com/1YzkHDqI6d
— ANI (@ANI) November 2, 2024
తాజావార్తలు
-
Jowar Chilla Recipe: జొన్న పిండితో 10 నిమిషాల్లో కరకరలాడే హెల్దీ చిల్లా.. పిల్లలు, పెద్దలు ఎవరూ విడిచిపెట్టరు అంతే..!
-
Kerala Story 2 OTT: ‘కేరళ స్టోరీ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
-
Duvvada Madhuri: టాలీవుడ్ మూవీలో అత్తగా దువ్వాడ మాధురి
-
iQOO 9 SE: 48MP OIS కెమెరా + 120Hz AMOLED – ఐకూ 9 SE ఇప్పుడు అతి చౌకగా! డీల్ మిస్ కాకండి!
-
Kejriwal: ఆర్ఎస్ఎస్ జడ్జ్ల ముందు హాజరుకాను.. జస్టిస్ స్వర్ణకాంతకు కేజ్రీవాల్ లేఖ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!