Anantha Padmanabha Swamy Temple: అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మరో అద్భుతం.. చనిపోయిన బబియా స్థానంలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళ: కాసర్గోడ్లోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం ప్రత్యేకత గురించి అందరికి తెలిసిందే. దేశంలోనే అంతులేని సంపదకు ఇది చాలా ప్రసిద్ధి. ఆలయంలోని నేలమాళిగలల్లో రాశుల కొద్ది బంగారం, వజ్రవైఢ్యూర్యాలు, స్వర్ణ విగ్రహాలు ఉన్నాయనే ఓ వార్త ప్రచారంలో ఉంది. దీనితో పాటు ఈ ఆలయానికి మరో ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. గుడిలో సరస్సులో ఉండే బబియా మొసలి. ఈ టెంపుల్కి వచ్చినవాళ్లు.. దానిని సందర్శించకుండ వెళ్లరు. ఎందుకంటే ఇది శాఖహార మొసలి. భక్తులు ఇచ్చే పండ్లుఫలహారాలు తప్పు మరేవి తినదు. అందుకే గుడికి వచ్చిన భక్తులు ఈ మొసలిని చూసేందుకు ఆసక్తి చూపుతుంటారు. దాదాపు 70 ఏళ్లుగా ఈ మొసలి ఆ సరస్సులో నివస్తుందని, అది కేవలం శాఖహారం మాత్రమే తినడం విశేషం. అయితే ఎన్నో ఏళ్లుగా ఆలయానికి వచ్చే భక్తులు, పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఈ ముసలి గతేడాది అక్టోబర్ 9, 2022న మరణించిన సంగతి తెలిసిందే.
Also Read: Salaar: ఒరేయ్.. ప్రభాస్ లేకుండా ఐటెంసాంగ్ ఏంటి రా.. బాబు .. ?
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
ఆలయ అధికారులు, అర్చకులు దానికి ప్రత్యేక పూజలు చేసి సంప్రదాయం ప్రకారం అంత్యసంస్కరణలు జరిపారు. అయితే ఇప్పుడు ఈ ముసలి స్థానంలో మరో ముసలి సరస్సులో దర్శనం ఇచ్చింది. అది చూసి అంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ మొసలి ఎక్కడి నుంచి వచ్చింది.. ఎలా వచ్చిందనేది అంతుచిక్కని విషయం. ఒక మొసలి చనిపోయిన తర్వాత మరో మొసలి సరస్సులో కనిపించడం అనివార్యంగా వస్తోంది. కానీ ఇలా ఎందుకు జరుగుతుందనేది నేటికి మిస్టరీగానే ఉంది. ఎప్పుడై ఒక మొసలి మాత్రమే ఈ సరస్సులో నివసిస్తుంది.. అదికూడా ఎవరికి హాని చేయకుండ పూజారి పెట్టే ప్రసాదం, భక్తులు ఇచ్చే ఫలాలు తింటూ శాఖహారిగా జీవించడం విచిత్రం. అంతేకాదు సరస్సులో ఉండే చేపలను అసలు ముట్టుకోదట.
Also Read: Vijay Devarakonda-Rashmika : మళ్ళీ దొరికిపోయిన విజయ్, రష్మిక.. ఆ ఫొటోతో బుక్కయ్యారు..
ఈ బబియా అనే మొసలి మూడోవది కాగా తాజాగా కనిపించింది నాలుగవ ముసలి అట. బబియా చనిపోయే ముందు దాని వయసు 70 ఏళ్లకు పైనే ఉంటుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఒకప్పుడూ ఈ సరస్సులో పెద్ద మొసలి ఉండేదని దాన్ని ఆంగ్లేయులు కాల్చి చంపేయగా దాని స్థానంలఅో మరో మొసలి ప్రత్యక్షమైనట్లు ప్రజలు తెలిపారు. అది కూడా చనిపోయాక ఈ బబియా వచ్చింది. ఈ బబియా చనిపోయాక దాని అంత్యక్రియలు చూడటానికి రాజకీయ నాయకులతో సహా వేలాది మంది భక్తులు తరలిరావడం కూడా చర్చనీయాంశమయ్యింది. మళ్లీ ఆ మొసలి స్థానంలో మరో మొసలి రావడం అందర్నీ సంబ్రమాశ్చర్యాలకు గురి చేయడమే గాక భాగవత పురాణంలోని గజేంద్ర మోక్ష కథను గుర్తు చేస్తోంది. నిజానికి మొసళ్లు ఉన్నాయనేలా ఆ ఆలయం సమీపంలో నది లేదా సరస్సు కూడా లేదు. కేవలం ఆలయం కోనేరులోనే కనపించడం విచిత్రం అయితే ఎవరికి హాని తలపెట్టకుండా ఉండటం మరో విచిత్రం.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!