Bharat Jodo Yatra: రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా చూపించడం యాత్ర ఉద్దేశం కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర ఎన్నిలక యాత్ర కాదని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా చూపించడం ఈ యాత్ర ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ఇది సైద్ధాంతిక యాత్ర అని.. ఈ యాత్రలో రాహుల్ గాంధీ ప్రముఖంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు ‘భారత్ జోడో యాత్ర’ కసరత్తు చేస్తుందనే వాదనలను ఆయన శనివారం కొట్టిపారేశారు. కాగా, అంతకుముందు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ మాత్రం వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీనే ప్రధాని అభ్యర్థి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: People’s Anti-Fascist Front: జైైషే మహ్మద్ అనుబంధ ఉగ్రసంస్థపై కేంద్రం నిషేధం..
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ప్రస్తుతం హర్యానాలోని కర్నాల్ మీదుగా యాత్ర కొనసాగుతోంది. త్వరలోనే కాశ్మీర్ లోకి యాత్ర ప్రవేశించనుంది. భారతదేశాన్ని ఒకటిగా ఉంటాలనే ఉద్దేశంతోనే భారత్ జోడో యాత్ర ప్రారంభించినట్లు కాంగ్రెస్ పలుమార్లు వెల్లడించింది. బీజేపీ హాయాంలో దేశంలో ద్వేషం, విభజన రాజకీయాలు ఎక్కువయ్యాయని.. వాటికి ఎదుర్కొనేందుకు దేశ ప్రజల ఐక్యత చాటేందుకు భారత్ జోడో యాత్ర చేస్తున్నట్లు రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రకటించారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్భణం, ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలను తన యాత్రలో హైలెట్ చేస్తున్నారు రాహుల్ గాంధీ.
సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన ‘భారత్ జోడో యాత్ర’ మొత్తం 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా సాగుతూ.. ఈ నెలఖరులో కాశ్మీర్ లో ముగియనుంది. మొత్తం 3570 కిలోమీటర్ల మేర జోడో యాత్ర సాగుతోంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ లో యాత్ర జరిగింది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!