Mamata Banerjee: యూసీసీ, సీఏఏ, ఎన్ఆర్సీలను బెంగాల్లో అనుమతించం. ఈద్ ప్రార్థనల్లో మమతా బెనర్జీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సి), యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)ని పశ్చిమ బెంగాల్లో అమలు చేయబోమని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు. గురువారం ఈద్ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు బృందాలతో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు. దేశం కోసం రక్తం చిందించేందుకు తృణమూల్ సిద్ధంగా ఉందని, అయితే హింసను మాత్రం సహించబోమని అన్నారు.
Read Also: Truong My Lan: దేశంలోనే అతిపెద్ద మోసం కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తకు మరణశిక్ష..!
Also Read
- West Bengal Hotel Fire: బీర్భూమ్లో ఘోర అగ్నిప్రమాదం.. హోటల్లో ఏడుగురు సజీవ దహనం
- Bihar Temple Stampede: బిహార్ ఆలయంలో విషాదం.. అశోక్ధామ్ ఆలయంలో తొక్కిసలాట, ఏడుగురు భక్తులు మృతి
- TVK Vijay Government: విజయ్ ప్రభుత్వానికి 100 రోజులు.. “డమ్మీ సీఎం” అంటూ విమర్శలు..!
- IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా కోల్కతాలోని ఓ మసీదులో ముస్లిం వర్గాన్ని ఉద్దేశిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. యూసీసీ ఆమోదయోగ్యం కాదని, నేను అన్ని మతాల సామరస్యాన్ని కోరుకుంటున్నానని, మీ భద్రత, మీ జీవితం కోసం మేము సీఏఏ, ఎన్ఆర్సీ, యూసీసీలను అంగీకరించమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ముస్లిం నేతలకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి మద్దతు కోరుతుందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్నికల సమయంలో మీరు ముస్లిం నేతల్ని పిలిచి మీకేం కావాలో చెప్పండి అని అడుగుతున్నారని, వారికి ఏం వద్దని, ప్రేమ కావాలని నేను అంటున్నానని ఆమె సభలో అన్నారు. ఎన్నికల సమయంలో కొంతమంది అల్లర్లను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారికి ప్రణాళికలకు బలి కావొద్దని ఆమె సూచించారు.
తాము ఇండియా కూటమికి మద్దతు ఇస్తు్న్నామని, ఢిల్లీలో ఇండియా కూటమి ఉండేలా చూస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా కేంద్రం దర్యాప్తు సంస్థల్ని ఉపయోగించుకుంటోందని ఆమె బీజేపీపై విరుచుకుపడ్డారు. మరోవైపు మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. బీజేపీ మతతత్వానికి పాల్పడుతోందని ఆరోపించారు. హిందూస్తాన్ హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లకు చెందినదని అన్నారు, దీనిని ఎవరూ సొంతం చేసుకోలేరని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Ashwatthama: షాహిద్ ‘అశ్వత్థామ’ ఎందుకు ఆగింది?.. ప్రభాస్ ‘కల్కి’ ప్రభావమే కారణమన్న నిర్మాత
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
AP Rain Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన!
-
Siddipet: సీరియల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. కొడుకును కూడా హత్యలకు ప్రేరేపించిన తల్లి.!
ట్రెండింగ్
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!
-
iQOO 16లో అదిరిపోయే అప్గ్రేడ్స్.. 165Hz డిస్ప్లే, 8,500mAh బ్యాటరీ, కొత్త కెమెరా డిజైన్ తో..
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!