Mamata Banerjee: యూసీసీ, సీఏఏ, ఎన్ఆర్సీలను బెంగాల్లో అనుమతించం. ఈద్ ప్రార్థనల్లో మమతా బెనర్జీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సి), యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)ని పశ్చిమ బెంగాల్లో అమలు చేయబోమని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు. గురువారం ఈద్ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు బృందాలతో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు. దేశం కోసం రక్తం చిందించేందుకు తృణమూల్ సిద్ధంగా ఉందని, అయితే హింసను మాత్రం సహించబోమని అన్నారు.
Read Also: Truong My Lan: దేశంలోనే అతిపెద్ద మోసం కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తకు మరణశిక్ష..!
Also Read
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
- Anil Vij: "బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు".. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
- Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా కోల్కతాలోని ఓ మసీదులో ముస్లిం వర్గాన్ని ఉద్దేశిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. యూసీసీ ఆమోదయోగ్యం కాదని, నేను అన్ని మతాల సామరస్యాన్ని కోరుకుంటున్నానని, మీ భద్రత, మీ జీవితం కోసం మేము సీఏఏ, ఎన్ఆర్సీ, యూసీసీలను అంగీకరించమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ముస్లిం నేతలకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి మద్దతు కోరుతుందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్నికల సమయంలో మీరు ముస్లిం నేతల్ని పిలిచి మీకేం కావాలో చెప్పండి అని అడుగుతున్నారని, వారికి ఏం వద్దని, ప్రేమ కావాలని నేను అంటున్నానని ఆమె సభలో అన్నారు. ఎన్నికల సమయంలో కొంతమంది అల్లర్లను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారికి ప్రణాళికలకు బలి కావొద్దని ఆమె సూచించారు.
తాము ఇండియా కూటమికి మద్దతు ఇస్తు్న్నామని, ఢిల్లీలో ఇండియా కూటమి ఉండేలా చూస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా కేంద్రం దర్యాప్తు సంస్థల్ని ఉపయోగించుకుంటోందని ఆమె బీజేపీపై విరుచుకుపడ్డారు. మరోవైపు మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. బీజేపీ మతతత్వానికి పాల్పడుతోందని ఆరోపించారు. హిందూస్తాన్ హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లకు చెందినదని అన్నారు, దీనిని ఎవరూ సొంతం చేసుకోలేరని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!