Bihar: శభాష్ తల్లి.. బిడ్డ పుట్టిన కొన్ని గంటలకే పదోతరగతి పరీక్షకు హాజరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman writes Class 10 exam hours after giving birth to son: బీహార్ లో ఓ మహిళ చదువుకోవాలనుకుంటున్న వారికి స్పూర్తిగా నిలుస్తోంది. బిడ్డ పుట్టిన కొన్ని గంటల్లోనే 10వ తరగతి పరీక్షలకు హాజరైంది. ఈ ఘటన బుధవారం రోజు బీహార్ లోని బంకాలో చోటు చేసుకుంది. కొడుకు జన్మించిన తర్వాత మూడు గంటల్లోనే పరీక్షా కేంద్రానికి హాజరై ఎగ్జామ్ రాసింది. పరీక్ష రాయాలనే ఆమె సంకల్పాన్ని ప్రసవవేదన కూడా కదిలించలేకపోయింది. పురిటి నొప్పుల ముందు ఎగ్జామ్ రాయాలన్న ఆమె స్థైర్యాన్ని అంతా మెచ్చుకుంటున్నరు.
బంకా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న రుక్మిణి కుమారి(27) బుధవారం ఉదయం ఆరుగంటలకు మగబిడ్డకు జన్మనిచ్చింది. మూడు గంటల తర్వాత సైన్స్ పేపర్ రాయడానికి వెళ్లింది. ప్రస్తుతం ఈ విషయం ఆ పట్టణంలో చర్చనీయాంశం అయింది. మహిళా విద్యపై ప్రభుత్వం చూపుతున్న ప్రాధాన్యత దీంతో తెలుస్తోందని.. షెడ్యూల్డ్ కులానికి చెందిన రుక్మిణీ అందరికి స్పూర్తిదాయకంగా నిలిచారని జిల్లా విద్యాశాఖ అధికారి పవర్ కుమార్ అన్నారు.
Also Read
- Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
- Ketan Agarwal Case: 'పెళ్లి నుంచి తప్పించుకోలేవు'.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
Read Also: INDvsAUS 2nd Test: ఆదుకున్న అక్షర్, అశ్విన్.. టీమిండియా 262 ఆలౌట్
దీనిపై రుక్మిని మాట్లాడుతూ.. మంగళవారం గణితం పేపర్ రాసే సమయానికి కొంత అసౌకర్యం అనిపించిందని.. మరుసటి రోజు జరగాల్సిన సైన్స్ పేపర్ పై ఉత్కంఠగా ఉందని, అయితే సైన్స్ పేపర్ రాయాల్సిన రోజు ఉదయం 6 గంటలకు నా కొడుకు పట్టాడని ఆమె తెలిపింది. తనకు పుట్టిన కొడుకు పెద్దవాడై చదువుల్లో రాణించాలని ఆమె కోరుకుంది. రుక్మిణి పరీక్ష రాయడానికి ఆస్పత్రి సిబ్బంది సహాయం చేశారు.
ప్రసవం సమయంలో ఆమె ఆరోగ్యం దెబ్బతినడంతో పరీక్షను రాయొద్దని మేము కోరామని డాక్టర్ భోళా నాథ్ అన్నారు. దీనికి రుక్మిని ఒప్పించేందుకు ప్రయత్నించామని.. ఆమె మొండిగా ఉండటంతో ఏర్పాట్లు చేశామని, అత్యవసర పరిస్థితుల్లో ఆమెకు సహాయం చేయడానికి అంబులెన్స్, వైద్య సిబ్బందిని ఉంచినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు.
తాజావార్తలు
-
Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
-
Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్కు షాక్.. బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టేనా?
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
-
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!