Delhi Metro Rail: మెట్రోరైలులో సీటు కోసం గొడవ.. కోపంలో మహిళ ఏం చేసిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Uses Pepper Spray On Co-Passenger After Argument Escalates In Delhi Metro: ఆ మెట్రో రైలు చాలావరకు ఖాళీగానే ఉంది. కూర్చోవడానికి సీట్లు కూడా ఉన్నాయి. అయినా సరే.. ఆ ఇద్దరు మహిళలు మాత్రం సీటు విషయంలో గొడవ పడ్డారు. ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్లిందంటే.. కోపంలో ఒక మహిళ తనతో వాగ్వాదానికి దిగిన మహిళపై పెప్పర్ స్ర్పే కొట్టింది. ఈ ఘటన ఢిల్లీలోని మెట్రో రైలులో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
Cricketer Prithvi Shaw: క్రికెటర్ పృథ్వీ షాపై కేసు నమోదు
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
మెట్రో రైలులో ఒకే వరుసలో ఇద్దరు మహిళలు పక్కపక్కనే కూర్చున్నారు. వీళ్లిద్దరికీ సౌకర్యవంతంగా కూర్చోవడానికి అక్కడ ప్లేస్ ఉంది. కానీ.. ఎక్కడ చెడిందో తెలీదు కానీ, సీటు విషయంలో ఈ ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. మనం ఆ వీడియోలో చూస్తే.. ట్రైన్ దాదాపు ఖాళీగా ఉంది. సీట్లు కూడా అందుబాటులోనే ఉన్నాయి. అంతెందుకు.. ఏ సీటు కోసమైతే ఆ మహిళలు గొడవపడ్డారో, అక్కడ ఇద్దరి మధ్య జాగా బాగానే ఉంది. అయినా ఎందుకో సీటు కోసం ఈ ఇద్దరు శివాలెత్తారు. బూతులు తిట్టేసుకున్నారు. ఒక మహిళ అయితే.. ‘ఇంకో మాట మాట్లాడితే నా చేతి దెబ్బ రుచి చూస్తావ్’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నాకే వార్నింగ్ ఇస్తావా? అంటూ ఇంకో మరో మహిళ.. ‘నీలాంటి వాళ్ల కోసమే నేను పెప్పర్ స్ర్పే పెట్టుకున్నా, ఇప్పుడే ఉండు, నీ ముఖంపై కొడతా’ అంటూ పెప్పర్ స్ర్పే తీసింది.
PBKS vs RR: శివాలెత్తిన శిఖర్ ధవన్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం
ప్రయాణికురాలు ఆమెకు సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నా.. ఆ మహిళ మాత్రం వినలేదు. ఎలాగో బయటకు తీసింది కాబట్టి.. దాని మూత విప్పి స్ర్పే చల్లింది. అనంతరం అక్కడి నుంచి లేచి ఆమె వెళ్లిపోయింది. అయితే.. ఈ స్ర్పే ఘాటు కొన్ని క్షణాల్లోనే కంపార్ట్మెంట్ అంతా వ్యాపించడంతో, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ వీడియో చూసిన మెట్రో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్.. సదరు కోచ్ నంబర్ తీసుకుని, చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. మరోవైపు.. ప్రజా రవాణాలో ఇటువంటి గొడవలు జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సర్దుకుపోతే పోయేదాన్ని.. ఇంతదాకా తీసుకురావాల్సిన అవసరం ఏముంది?
one more scene in Delhi metro pic.twitter.com/iQn9VJkvtI
— Tajinder Bagga (@TajinderBagga) April 1, 2023
తాజావార్తలు
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!