ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ పృథ్వీ షా చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. క్రికెటర్ పృథ్వీ షాపై కేసు నమోదైంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సప్నా గిల్ అతనిపై ఫిర్యాదు చేశారు. పృథ్వీ షాతో పాటు అతని స్నేహితుడు ఆశిష్ సురేంద్ర యాదవ్పై కూడా సప్నా ఫిర్యాదు చేసింది. బ్యాట్తో కొట్టడం, వేధించడం వంటి కొన్ని కేసుల్లో సప్నా గిల్ ఐపీసీ సెక్షన్ 354, 509, 324 కింద ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును నమోదు చేస్తూ సప్నా ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. ఇందులో లైంగిక వేధింపుల ప్రస్తావన కూడా ఉంది.
Also Read: Stormy Daniels: ట్రంప్కు లీగల్ ఫీజు చెల్లించండి.. డేనియల్స్కు కోర్టు ఆదేశం
షా తన రొమ్ములపై చేతులు వేసి దూరంగా నెట్టాడని చెప్పింది. ఆమె తనపై బ్యాట్తో దాడి చేసినందుకు IPC సెక్షన్ 354, 509, 324 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరింది, లైంగిక వేధింపులను రుజువు చేసే కీలకమైన రుజువు అయిన ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన మెడికల్ ప్రూఫ్ను జత చేసింది. అయితే, గతంలో సప్నా ఇదే కేసులో అరెస్టైంది. ఇప్పుడు ఆమె బాధితురాలిగా పేర్కొంది.
Also Read: Rajasthan Royals vs Punjab Kings: టాస్ గెలిచి.. ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న రాజస్థాన్
పృథ్వీ షా ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు. ఇటీవల ముంబైలోని ఓ హోటల్కు వెళ్లిన పృథ్వీషాతో సెల్ఫీ దిగేందుకు సప్నా గిల్, ఆమె స్నేహితులు ప్రయత్నించారు. మొదట ఓ సెల్ఫీ దిగేందుకు అనుమతించిన పృథ్వీషా.. ఆ తర్వాత పదేపదే అడగడంతో నిరాకరించారు. దీంతో హోటల్ నుంచి వెళ్లిన తర్వాత క్రికెటర్ను వెంబడించి వాగ్వాదానికి దిగారని, తన స్నేహితుడి కారును ధ్వంసం చేశారని పృథ్వీషా ఆరోపించాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సప్నా గిల్ సహా ఆమె స్నేహితులను అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన సప్నా గిల్ పృథ్వీషాపై కేసు పెట్టింది.