Delhi Metro Rail: మెట్రోరైలులో సీటు కోసం గొడవ.. కోపంలో మహిళ ఏం చేసిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Uses Pepper Spray On Co-Passenger After Argument Escalates In Delhi Metro: ఆ మెట్రో రైలు చాలావరకు ఖాళీగానే ఉంది. కూర్చోవడానికి సీట్లు కూడా ఉన్నాయి. అయినా సరే.. ఆ ఇద్దరు మహిళలు మాత్రం సీటు విషయంలో గొడవ పడ్డారు. ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్లిందంటే.. కోపంలో ఒక మహిళ తనతో వాగ్వాదానికి దిగిన మహిళపై పెప్పర్ స్ర్పే కొట్టింది. ఈ ఘటన ఢిల్లీలోని మెట్రో రైలులో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
Cricketer Prithvi Shaw: క్రికెటర్ పృథ్వీ షాపై కేసు నమోదు
Also Read
- Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Ayodhya Ram Mandir: బ్యాంకులకు చేరిన రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు మరో 5 బ్యాంకులకు నోటీసులు!
మెట్రో రైలులో ఒకే వరుసలో ఇద్దరు మహిళలు పక్కపక్కనే కూర్చున్నారు. వీళ్లిద్దరికీ సౌకర్యవంతంగా కూర్చోవడానికి అక్కడ ప్లేస్ ఉంది. కానీ.. ఎక్కడ చెడిందో తెలీదు కానీ, సీటు విషయంలో ఈ ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. మనం ఆ వీడియోలో చూస్తే.. ట్రైన్ దాదాపు ఖాళీగా ఉంది. సీట్లు కూడా అందుబాటులోనే ఉన్నాయి. అంతెందుకు.. ఏ సీటు కోసమైతే ఆ మహిళలు గొడవపడ్డారో, అక్కడ ఇద్దరి మధ్య జాగా బాగానే ఉంది. అయినా ఎందుకో సీటు కోసం ఈ ఇద్దరు శివాలెత్తారు. బూతులు తిట్టేసుకున్నారు. ఒక మహిళ అయితే.. ‘ఇంకో మాట మాట్లాడితే నా చేతి దెబ్బ రుచి చూస్తావ్’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నాకే వార్నింగ్ ఇస్తావా? అంటూ ఇంకో మరో మహిళ.. ‘నీలాంటి వాళ్ల కోసమే నేను పెప్పర్ స్ర్పే పెట్టుకున్నా, ఇప్పుడే ఉండు, నీ ముఖంపై కొడతా’ అంటూ పెప్పర్ స్ర్పే తీసింది.
PBKS vs RR: శివాలెత్తిన శిఖర్ ధవన్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం
ప్రయాణికురాలు ఆమెకు సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నా.. ఆ మహిళ మాత్రం వినలేదు. ఎలాగో బయటకు తీసింది కాబట్టి.. దాని మూత విప్పి స్ర్పే చల్లింది. అనంతరం అక్కడి నుంచి లేచి ఆమె వెళ్లిపోయింది. అయితే.. ఈ స్ర్పే ఘాటు కొన్ని క్షణాల్లోనే కంపార్ట్మెంట్ అంతా వ్యాపించడంతో, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ వీడియో చూసిన మెట్రో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్.. సదరు కోచ్ నంబర్ తీసుకుని, చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. మరోవైపు.. ప్రజా రవాణాలో ఇటువంటి గొడవలు జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సర్దుకుపోతే పోయేదాన్ని.. ఇంతదాకా తీసుకురావాల్సిన అవసరం ఏముంది?
one more scene in Delhi metro pic.twitter.com/iQn9VJkvtI
— Tajinder Bagga (@TajinderBagga) April 1, 2023
తాజావార్తలు
-
LA Olympics 2028: ఒలింపిక్స్కు టీమిండియా చేరాలంటే ఇదే మార్గం.. నంబర్వన్గా నిలవాలి, విఫలమైతే మరో అవకాశం!
-
WhatsApp Custom Username: ప్రైవసీ బూస్ట్!.. వాట్సాప్ 3 బిలియన్ యూజర్ల కోసం కస్టమ్ యూజర్నేమ్.. పూర్తి వివరాలు
-
Ben Stokes: “నేను మానసికంగా అలసిపోయాను”.. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
-
Biggest Multistarrer : 18 ఏళ్ల తర్వాత కలిసి నటించబోతున్న ఇద్దరు స్టార్ హీరోలు
-
Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!