Karnataka: అమానుష ఘటన.. ప్రేమ పెళ్లి.. తల్లిని నగ్నంగా ఊరేగించిన బంధువులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Woman Paraded Naked: కర్ణాటకలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కొడుకు మీద కక్ష్యతో తల్లిని నగ్నం ఊరేగించి.. కరెంట్ పోలుకు కట్టేసి దాడి చేసిన ఘటన కర్ణాటక రాష్టరం బెళగావిలో మంగళవారం వెలుగు చూసింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను రక్షించారు. అనంతరం ఈ ఘటనకు పాల్పడిన ఏడుగురిపై కేసే నమోదు చేసినట్టు బెళగావి పోలీస్ కమిషనర్ సిద్ధరామప్ప తెలిపారు. పోలీసులు సమాచారం ప్రకారం.. బెళగావి జిల్లాలోని న్యూ వంటమూరి గ్రామానికి చెందిన అశోక్(24) అదే గ్రామానికి చెందిన ప్రియాంక (18) కొంతకాలం ప్రేమించుకుంటున్నారు.
Also Read: Somajiguda: యశోద ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం..
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
ఈ క్రమంలో ప్రియాంకకు కటుంబ సభ్యులు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించి ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ చేశారు. దీంతో అశోక్, ప్రియాంకలు పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి వారిద్దరు ఇంటి నుంచి పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు, బంధువులు యువకుడి ఇంటిపై దాడి చేశారు. వారి ఇంటిని ధ్వంసం చేసి యువకుడి తల్లిని(42) వీధిలోకి ఈడ్చుకొచ్చి దాడి చేశారు. అంతేకాదు ఆ మహిళను వివస్త్రను చేసి నగ్నం వీధుల్లో ఊరేగించారు. అనంతరం గ్రామంలోని రచ్చబడ్డ వద్ద కరెంట్ పోలుకు కట్టేసి దారుణంగా దాడి తెగబడ్డారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని బాధిత మహిళను రక్షించారు.
Also Read: Minister Konda Surekha: అర్జిదారుల సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది..
గాయపడిన ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెపై దాడి చేసిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ఇందులో ఇద్దరు పరారీలో ఉన్నారని, వారికి కోసం గాలిస్తున్నట్టు పోలీసు అధికారి తెలిపారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతోపాటు రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర్, పోలీస్ ఉన్నతాధికారులు ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై సీఎం సిద్ధరామయ్య సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇది అత్యంత అమానుష ఘటన అని, సభ్య సమాజం తలదించుకునేలా నేరస్తులు ప్రవర్తించారని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!