Karnataka: అమానుష ఘటన.. ప్రేమ పెళ్లి.. తల్లిని నగ్నంగా ఊరేగించిన బంధువులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Woman Paraded Naked: కర్ణాటకలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కొడుకు మీద కక్ష్యతో తల్లిని నగ్నం ఊరేగించి.. కరెంట్ పోలుకు కట్టేసి దాడి చేసిన ఘటన కర్ణాటక రాష్టరం బెళగావిలో మంగళవారం వెలుగు చూసింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను రక్షించారు. అనంతరం ఈ ఘటనకు పాల్పడిన ఏడుగురిపై కేసే నమోదు చేసినట్టు బెళగావి పోలీస్ కమిషనర్ సిద్ధరామప్ప తెలిపారు. పోలీసులు సమాచారం ప్రకారం.. బెళగావి జిల్లాలోని న్యూ వంటమూరి గ్రామానికి చెందిన అశోక్(24) అదే గ్రామానికి చెందిన ప్రియాంక (18) కొంతకాలం ప్రేమించుకుంటున్నారు.
Also Read: Somajiguda: యశోద ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం..
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
ఈ క్రమంలో ప్రియాంకకు కటుంబ సభ్యులు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించి ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ చేశారు. దీంతో అశోక్, ప్రియాంకలు పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి వారిద్దరు ఇంటి నుంచి పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు, బంధువులు యువకుడి ఇంటిపై దాడి చేశారు. వారి ఇంటిని ధ్వంసం చేసి యువకుడి తల్లిని(42) వీధిలోకి ఈడ్చుకొచ్చి దాడి చేశారు. అంతేకాదు ఆ మహిళను వివస్త్రను చేసి నగ్నం వీధుల్లో ఊరేగించారు. అనంతరం గ్రామంలోని రచ్చబడ్డ వద్ద కరెంట్ పోలుకు కట్టేసి దారుణంగా దాడి తెగబడ్డారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని బాధిత మహిళను రక్షించారు.
Also Read: Minister Konda Surekha: అర్జిదారుల సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది..
గాయపడిన ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెపై దాడి చేసిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ఇందులో ఇద్దరు పరారీలో ఉన్నారని, వారికి కోసం గాలిస్తున్నట్టు పోలీసు అధికారి తెలిపారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతోపాటు రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర్, పోలీస్ ఉన్నతాధికారులు ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై సీఎం సిద్ధరామయ్య సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇది అత్యంత అమానుష ఘటన అని, సభ్య సమాజం తలదించుకునేలా నేరస్తులు ప్రవర్తించారని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!