Karnataka: అమానుష ఘటన.. ప్రేమ పెళ్లి.. తల్లిని నగ్నంగా ఊరేగించిన బంధువులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Woman Paraded Naked: కర్ణాటకలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కొడుకు మీద కక్ష్యతో తల్లిని నగ్నం ఊరేగించి.. కరెంట్ పోలుకు కట్టేసి దాడి చేసిన ఘటన కర్ణాటక రాష్టరం బెళగావిలో మంగళవారం వెలుగు చూసింది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను రక్షించారు. అనంతరం ఈ ఘటనకు పాల్పడిన ఏడుగురిపై కేసే నమోదు చేసినట్టు బెళగావి పోలీస్ కమిషనర్ సిద్ధరామప్ప తెలిపారు. పోలీసులు సమాచారం ప్రకారం.. బెళగావి జిల్లాలోని న్యూ వంటమూరి గ్రామానికి చెందిన అశోక్(24) అదే గ్రామానికి చెందిన ప్రియాంక (18) కొంతకాలం ప్రేమించుకుంటున్నారు.
Also Read: Somajiguda: యశోద ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం..
Also Read
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
- Anil Vij: "బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు".. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
- Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
ఈ క్రమంలో ప్రియాంకకు కటుంబ సభ్యులు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించి ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ చేశారు. దీంతో అశోక్, ప్రియాంకలు పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి వారిద్దరు ఇంటి నుంచి పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు, బంధువులు యువకుడి ఇంటిపై దాడి చేశారు. వారి ఇంటిని ధ్వంసం చేసి యువకుడి తల్లిని(42) వీధిలోకి ఈడ్చుకొచ్చి దాడి చేశారు. అంతేకాదు ఆ మహిళను వివస్త్రను చేసి నగ్నం వీధుల్లో ఊరేగించారు. అనంతరం గ్రామంలోని రచ్చబడ్డ వద్ద కరెంట్ పోలుకు కట్టేసి దారుణంగా దాడి తెగబడ్డారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని బాధిత మహిళను రక్షించారు.
Also Read: Minister Konda Surekha: అర్జిదారుల సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది..
గాయపడిన ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెపై దాడి చేసిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ఇందులో ఇద్దరు పరారీలో ఉన్నారని, వారికి కోసం గాలిస్తున్నట్టు పోలీసు అధికారి తెలిపారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతోపాటు రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర్, పోలీస్ ఉన్నతాధికారులు ఆమెను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై సీఎం సిద్ధరామయ్య సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇది అత్యంత అమానుష ఘటన అని, సభ్య సమాజం తలదించుకునేలా నేరస్తులు ప్రవర్తించారని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!