Uttar Pradesh: యూపీలో దారుణం.. మహిళపై భర్త, మరిది అత్యాచారం.. ట్రిపుల్ తలాక్తో మోసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman In UP Allegedly Raped By Husband, Brother-In-Law After ‘Triple Talaq’: ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. మహిళపై భర్తతో పాటు అతని తమ్ముడు అత్యాచారానికి పాల్పడ్డారు. ట్రిపుల్ తలాక్ పేరుతో మహిళను మోసం చేశారు. సదరు మహిళపై భర్తతో పాటు అతని తమ్ముడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ ఆరోపించింది. ఈ ఘటనలో మతగురువుతో పాటు పలువురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ఆరుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Tamil Nadu Rains: తమిళనాడులో కుండపోత.. వరద గుప్పిట చెన్నై
Also Read
- Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Sugar Shortage: దేశంలో చక్కెర కొరతా..? ధరలు పెరుగుతాయా..? క్లారిటీ ఇచ్చిన AISTA
- Yuvraj Singh: "శాంతియుత పరిష్కారమే మార్గం".. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
- Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
మహిళ ఫిర్యాదు ప్రకారం.. ఐదేళ్ల క్రితం బాధిత మహిళకు సల్మాన్ అనే వ్యక్తితో వివాహం అయింది. కొన్ని నెలల క్రితం సల్మాన్ చట్టవిరుద్దంగా ‘ ట్రిపుల్ తలాక్’ పేరుతో భార్యకు విడాకులు ఇచ్చాడు. అయితే ఓ మతగురువు సూచన మేరకు సల్మాన్ తన తమ్ముడిని పెళ్లాడి విడాకులు తీసుకుంటే మళ్లీ పెళ్లి చేసుకోవచ్చని భార్యకు చెప్పాడు. ఈ క్రమంలో సల్మాన్ తన భార్యను తన తమ్ముడు ఇస్లాంకు ఇచ్చి పెళ్లి జరిపించాడు.
అయితే సల్మాన్ చెప్పినట్లు ఆ మహిళ చేసిన తర్వాత.. అతని తమ్ముడు ఇస్లాం ఆమెకు విడాకులు ఇచ్చేందుకు నిరాకరించాడు. అన్నదమ్ములిద్దరూ పలుమార్లు మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధిత మహిళ స్థానిక కోర్టుకు వెళ్లగా కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహిళ ఫిర్యాదు మేరకు భర్త సల్మాన్ తో పాటు అతని సోదరుడు ఇస్లాం, మతగురువు గుడ్డు హాజీ, ముగ్గురు కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్యాంగ్ రేప్, ముస్లిం మహిళ వివాహహక్కుల పరిరక్షణ చట్టం 2019 ప్రకారం కేసులు నమోదు చేశారు. మహిళను వైద్య పరీక్షల నిమిత్తం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
తాజావార్తలు
-
Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
-
WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
-
Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!