CJI BR Gavai: ‘‘అన్ని మతాలను గౌరవిస్తాను’’.. ‘‘విష్ణువు’’ వ్యాఖ్యలపై సీజేఐ గవాయ్..
- ‘‘నేను అన్ని మతాలను గౌరవిస్తాను’’..
- ‘‘విష్ణువు’’పై వ్యాఖ్యలపై సీజేఐ బీఆర్ గవాయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJI BR Gavai: సోషల్ మీడియాలో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బీఆర్ గవాయ్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఒక కేసులో ‘‘విష్ణువు’’ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై హిందువులు మండిపడుతున్నారు. ఖజురహోలో పురాతన విష్ణువు విగ్రహాన్ని పునరుద్ధరించాలని దాఖలైన పిల్ను ఆయన తోసిపుచ్చారు. ఛతర్పూర్ జిల్లాలోని జవారీ ఆలయంలో దెబ్బతిన్న విగ్రహాన్ని భర్తీ చేసి ప్రతిష్టించాలని కోరుతూ రాకేష్ దలాల్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది.
దీనిని విచారించిన సుప్రీం ధర్మాసనం..‘‘ఇది పూర్తిగా ప్రచార ప్రయోజన వ్యాజ్యం. వెళ్లి దేవుడినే ఏదైనా చేసుకోమని అడగండి. మీరు విష్ణువు భక్తులని మీరు అనుకుంటే, మీరు ప్రార్థన చేసి, కొంత ధ్యానం చేయండి’’ అని సీజేఐ అన్నారు. ఈ ఆలయం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికార పరిధి కిందకు వస్తుందని పేర్కొంటూ పిటిషన్ను తోసిపుచ్చింది.
Also Read
- Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు... అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
- Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- Sakshi Jha: సాక్షి ఝా 'మ్యాన్ హేటర్' వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
Read Also: Tariff On India: అమెరికాకు తత్వం బోధపడింది.. భారత్పై 25% టారిఫ్ తగ్గించే ఛాన్స్..
అయితే, సీజేఐ చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. విష్ణువుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని పలువురు న్యాయవాదులు బహిరంగ లేఖ రాశారు. మరికొందరు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చర్యల కోసం రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ మొత్తం వివాదంపై సీజేఐ గవాయ్ స్పందిస్తూ.. ‘‘ నేను చేసిన వ్యాఖ్యలనున సోషల్ మీడియాలో ఒక నిర్దిష్ట పద్ధతిలో చిత్రీకరించారని ఎవరో నాకు చెప్పారు. నేను అన్ని మతాలను గౌరవిస్తాను’’ అని ఆయన అన్నారు. సోషల్ మీడియా దెబ్బను నేపాల్లో సీజేఐ పోల్చారు. నేపాల్ లో కూడా ఇలాగే జరిగిందని వ్యాఖ్యానించారు.
ఈ రోజు ధర్మాసనం ముందు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. గత 10 ఏళ్లుగా సీజేఐ గవాయ్ తనకు తెలుసునని, ప్రధాన న్యాయమూర్తి అన్ని మతపరమైన ప్రదేశాలను సందర్శించారని చెప్పారు. మేము న్యూటన్ సూత్రాన్ని తెలుసుకున్నాము. ప్రతీ చర్యకు సమాన ప్రతిచర్య ఉంటుంది. ఇప్పుడు ప్రతి చర్యకు అసమాన సోషల్ మీడియా ప్రతిచర్య ఉంటుంది’’ అని అన్నారు. మరో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. మేము ప్రతీ రోజు సోషల్ మీడియా వల్ల బాధపడుతున్నామని, సోషల్ మీడియా వికృత గుర్రం, దానిని మచ్చిక చేసుకునే మార్గం లేదు అని అన్నారు.
తాజావార్తలు
-
Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు… అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
-
Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
-
Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
-
Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!