Akhilesh Yadav: మోడీ సర్కార్ ఎక్కువ కాలం ఉండదు, త్వరలో పడిపోతుంది..
- బీజేపీపై విరుచుకుపడిన అఖిలేష్ యాదవ్.. మమతా బెనర్జీ..
- ప్రభుత్వం త్వరలో పడిపోతుందని జోస్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav: బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ఈ రోజు ‘ ధర్మతల ర్యాలీ’ని నిర్వహించారు. కోల్కతాలో జరిగిన ఈ ర్యాలీలో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. మతం పేరిట దేశాన్ని విభజించేందుకు కుట్రలు పన్నుతున్న శక్తులు తాత్కిలికంగా విజయం సాధించవచ్చు కానీ, అంతిమంగా ఓడిపోతాయని అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు బీజేపీని ఓడించారని అన్నారు.
అధికారంలోకి వచ్చిన వారు చుట్టం చూపుగానే ఉంటారని, కేంద్రంలోని ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని, త్వరలోనే పడిపోతుందని జోక్యం చెప్పారు. బెంగాల్ ప్రజలు బీజేపీతో పోరాడారని, ఉత్తర్ ప్రదేశ్లో కూడా ఇదే జరిగిందని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వంలో కూర్చున్న వ్యక్తులు కొద్ది రోజులు మాత్రమే అధికారంలో ఉంటారని, వారిడి నడిచే సర్కార్ కాదని, పడిపోయే సర్కార్ అని ఆయన చెప్పారు.
Also Read
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
- TVK Vijay: న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?
- West Bengal: మమతా బెనర్జీకి గవర్నర్ షాక్.. టీఎంసీ సర్కార్ బర్తరఫ్..
Read Also: Tummala Nageswara Rao: అన్ని శాఖల అధికారులకు మంత్రి తుమ్మల క్లాస్..
ఉత్తర్ ప్రదేశ్లో లోక్సభ ఎన్నికల్లో ఎస్పీ కనబరిచిన ఫలితాలను సీఎం మమతా బెనర్జీ ప్రశంసించారు. యూపీలో మీరు ఆడిన ఆట బీజేపీ ప్రభుత్వాన్ని బలవంతంగా రాజీనామా చేయాల్సి ఉంది, కానీ సిగ్గులేని ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను, ఇతర మార్గాలను దుర్వినియోగం చేస్తూ అధికారంలో కొనసాగుతోందని మండిపడ్డారు. ర్యాలీకి హాజరైన అఖిలేష్ యాదవ్కు మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్రంపై అఖిలేష్ చేసిన వ్యాఖ్యలకు మమతా మద్దతు ఇచ్చారు. కేంద్రంలోని ప్రభుత్వం బెదిరింపుల ద్వారా ఏర్పడిందని, అది ఎక్కువ కాలం నిలవదని అన్నారు. బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పారని టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అన్నారు. 400 సీట్లు దాటుతామని చెప్పినప్పటికీ 240కే వారు పరిమితమయ్యారని బీజేపీని ఎద్దేవా చేశారు. టీఎంసీకి వ్యతిరేకంగా ఈడీ, సీబీఐని ప్రయోగించినా విజయం సాధించలేకపోయారని అన్నారు. సందేశ్ ఖాలీ నాటకంతో బెంగాల్ పరువు తీయాలని చూశారని మండిపడ్డారు.
#WATCH | West Bengal: At TMC's rally in Kolkata, Samajwadi Party chief Akhilesh Yadav says "…The people of Bengal have fought with the BJP and left them behind, the same happened in Uttar Pradesh…The people sitting in the Govt in Delhi are in power only for a few days. 'Woh… pic.twitter.com/BNQBcRblbW
— ANI (@ANI) July 21, 2024
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం