Mumbai Muharram Plot: మొహర్రం ఊరేగింపులో విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ! రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Muharram Plot: ముంబైలో మొహర్రం ఊరేగింపును లక్ష్యంగా చేసుకుని సాగిన ఒక భయంకరమైన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. జులూస్లో పాల్గొన్న భక్తులకు ‘నొప్పి నివారణ మాత్రలు’ అంటూ విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ చేస్తున్న ఒక నిందితుడిని ముంబై పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి దాదాపు 14,900 విషపు క్యాప్సూల్స్ను స్వాధీనం చేసుకున్నారు. ముంబైలోని జేజే – భాయ్ఖలా ప్రాంతాల గుండా మొహర్రం ఊరేగింపు సాగుతున్న సమయంలో ఈ ఘటన వెలుగు చూసింది. నిందితుడు ఎలాంటి అనుమతి లేకుండా అక్కడ ఉన్న జనానికి కొన్ని క్యాప్సూల్స్ ఉచితంగా పంపిణీ చేస్తుండటాన్ని గస్తీ తిరుగుతున్న పోలీసులు గమనించారు. అనుమానం వచ్చి అతడిని విచారించగా అసలు నిజం బయటపడింది. నిందితుడిని పూణేలోని విమాన్ నగర్కు చెందిన పెయింట్ వ్యాపారి, బీబీఏ గ్రాడ్యుయేట్ అయిన ఫయాజ్ ప్రేమ్జీగా గుర్తించారు.
50 కిలోల ఎలుకల మందు.. 30 వేల ఖాళీ క్యాప్సూల్స్
సెంట్రల్ రీజియన్ జోన్-1 డీసీపీ జయంత్ మీనా తెలిపిన వివరాల ప్రకారం.. ఊరేగింపులో పాల్గొన్న జనానికి పెద్ద ఎత్తున హాని తలపెట్టాలనే ఉద్దేశంతోనే ఫయాజ్ ఈ కుట్రకు తెరలేపాడు. ఇందుకోసం అతను మార్కెట్ నుంచి 30,000 ఖాళీ క్యాప్సూల్స్, 50 కిలోల జింక్ ఫాస్ఫైడ్ (ఎలుకలను చంపే అత్యంత ప్రమాదకరమైన విష రసాయనం) కొనుగోలు చేశాడు. ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో గల ఒక గెస్ట్ హౌస్లో బస చేస్తూ.. కొన్ని రోజుల పాటు ఒక్కో క్యాప్సూల్లో ఒక గ్రాము చొప్పున ఈ ఎలుకల మందును నింపి రెడీ చేశాడు. ఈ విషపూరిత మాత్రలను మింగిన సల్మాన్ సయ్యద్ అనే వ్యక్తి తీవ్రమైన కడుపునొప్పి, వాంతులతో ఆసుపత్రిలో చేరడంతో ఈ కుట్ర తీవ్రత బయటపడింది.
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
ఏడాదిలో 19 సార్లు ఇరాన్, ఇరాక్ ప్రయాణాలు
పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడికి సంబంధించిన పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. ఫయాజ్ ప్రేమ్జీ ‘షియా ఖోజా ముస్లిం’ కమ్యూనిటీకి చెందినవాడని, అతని సోదరి, తల్లి ఇరాన్లో నివసిస్తున్నారని తెలిసింది. అయితే 2019 – 2025 మధ్య కాలంలో అతను పలుమార్లు ఇరాన్, ఇరాక్ దేశాలకు వెళ్లాడు. మరీ ముఖ్యంగా గత ఏడాది కాలంలోనే ఏకంగా 19 సార్లు ఇరాన్, ఇరాక్ దేశాల్లో పర్యటించడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం నిందితుడిపై సెక్షన్ 109, 110, 123 కింద విషప్రయోగం, హత్యాయత్నం కేసులు నమోదు చేసి భాయ్ఖలా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఏ ఉగ్రవాద సంస్థతోనూ ఇతనికి ఉన్న లింకులు అధికారికంగా ఖరారు కాలేదు. అయితే అతను ఎవరి ప్రభావంతో ఇంత పెద్ద కుట్రకు పాల్పడ్డాడు? పదే పదే విదేశాలకు ఎందుకు వెళ్లాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడి మొబైల్ ఫోన్, డిజిటల్ రికార్డులు, బ్యాంక్ లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తున్నారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 160 మంది మృతి, 750 మందికి పైగా గల్లంతు
-
NTR Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీ క్రేజీ అప్డేట్.. ఫ్లాష్బ్యాక్లో ఊహించని ట్విస్ట్!
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..