Windfall Tax Hike: చమురు కంపెనీలకు షాక్.. డీజిల్పై సుంకం పెంచిన కేంద్రం
- డీజిల్పై భారీగా పెరిగిన ఎగుమతి సుంకం
- ATFపై కూడా కేంద్రం కఠిన నిర్ణయం
- పెట్రోల్పై మార్పులేకుండా యథాతథం
- విండ్ఫాల్ ట్యాక్స్ పెంపు వెనుక కారణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయంగా ఇంధన లభ్యతను పెంచడం , అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ధరల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. డీజిల్, విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై విండ్ఫాల్ ట్యాక్స్ను (Windfall Tax) భారీగా పెంచుతూ కేంద్రం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, పెట్రోల్ ఎగుమతి సుంకంలో ఎలాంటి మార్పు చేయకపోవడం గమనార్హం.
Lashkar-e-Taiba: పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రతిష్టను పెంచింది..
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
డీజిల్పై భారీగా పెరిగిన భారం
డీజిల్ ఎగుమతులపై ఇప్పటివరకు ఉన్న సుంకాన్ని కేంద్రం భారీగా సవరించింది. గతంలో లీటరు డీజిల్పై రూ. 21.5 గా ఉన్న ఎగుమతి సుంకాన్ని ఏకంగా రూ. 55.5 కు పెంచింది. అంటే ఒక్కో లీటరుపై దాదాపు రూ. 34 మేర భారం పెరిగింది. అంతర్జాతీయంగా చమురు ధరల్లో వస్తున్న మార్పుల వల్ల చమురు కంపెనీలకు వస్తున్న అదనపు లాభాలను నియంత్రించడమే లక్ష్యంగా ఈ పెంపు చేపట్టినట్లు తెలుస్తోంది.
విమాన ఇంధనం (ATF) కూడా ప్రియం
విమానాల్లో వాడే ఇంధనం (Aviation Turbine Fuel)పై కూడా ఎగుమతి సుంకాన్ని ప్రభుత్వం పెంచింది. లీటరు ATFపై గతంలో ఉన్న రూ. 29.5 సుంకాన్ని రూ. 42 కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. విమాన ఇంధన ఎగుమతుల ద్వారా వచ్చే లాభాలపై అదనపు పన్ను విధించడం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలని కేంద్రం భావిస్తోంది.
Bomb Threats: రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు?
పెట్రోల్పై యథాతథ స్థితి
డీజిల్ , ATF ధరల్లో మార్పులు చేసినప్పటికీ, పెట్రోల్ ఎగుమతి సుంకంలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో ఉన్న సుంకాన్నే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. సాధారణంగా దేశీయంగా ఇంధన కొరత ఏర్పడకుండా చూడటంతో పాటు, చమురు సంస్థలు ఎగుమతుల కంటే దేశీయ అవసరాలకే ప్రాధాన్యత ఇచ్చేలా ప్రభుత్వం ఇలాంటి పన్ను సవరణలు చేస్తుంటుంది.
నిర్ణయం వెనుక కారణాలు?
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల హెచ్చుతగ్గుల వల్ల చమురు శుద్ధి సంస్థలకు చేకూరే అదనపు లాభాలపై ప్రభుత్వం ఈ విండ్ఫాల్ ట్యాక్స్ను విధిస్తుంటుంది. దేశీయంగా నిల్వలను సమృద్ధిగా ఉంచడం , ఎగుమతుల ద్వారా వచ్చే భారీ లాభాలను నియంత్రించడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. కేంద్రం తీసుకున్న ఈ తాజా నిర్ణయం తక్షణమే అమల్లోకి రానుంది.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!