Windfall Tax Hike: చమురు కంపెనీలకు షాక్.. డీజిల్పై సుంకం పెంచిన కేంద్రం
- డీజిల్పై భారీగా పెరిగిన ఎగుమతి సుంకం
- ATFపై కూడా కేంద్రం కఠిన నిర్ణయం
- పెట్రోల్పై మార్పులేకుండా యథాతథం
- విండ్ఫాల్ ట్యాక్స్ పెంపు వెనుక కారణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయంగా ఇంధన లభ్యతను పెంచడం , అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ధరల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. డీజిల్, విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై విండ్ఫాల్ ట్యాక్స్ను (Windfall Tax) భారీగా పెంచుతూ కేంద్రం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, పెట్రోల్ ఎగుమతి సుంకంలో ఎలాంటి మార్పు చేయకపోవడం గమనార్హం.
Lashkar-e-Taiba: పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రతిష్టను పెంచింది..
Also Read
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
డీజిల్పై భారీగా పెరిగిన భారం
డీజిల్ ఎగుమతులపై ఇప్పటివరకు ఉన్న సుంకాన్ని కేంద్రం భారీగా సవరించింది. గతంలో లీటరు డీజిల్పై రూ. 21.5 గా ఉన్న ఎగుమతి సుంకాన్ని ఏకంగా రూ. 55.5 కు పెంచింది. అంటే ఒక్కో లీటరుపై దాదాపు రూ. 34 మేర భారం పెరిగింది. అంతర్జాతీయంగా చమురు ధరల్లో వస్తున్న మార్పుల వల్ల చమురు కంపెనీలకు వస్తున్న అదనపు లాభాలను నియంత్రించడమే లక్ష్యంగా ఈ పెంపు చేపట్టినట్లు తెలుస్తోంది.
విమాన ఇంధనం (ATF) కూడా ప్రియం
విమానాల్లో వాడే ఇంధనం (Aviation Turbine Fuel)పై కూడా ఎగుమతి సుంకాన్ని ప్రభుత్వం పెంచింది. లీటరు ATFపై గతంలో ఉన్న రూ. 29.5 సుంకాన్ని రూ. 42 కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. విమాన ఇంధన ఎగుమతుల ద్వారా వచ్చే లాభాలపై అదనపు పన్ను విధించడం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలని కేంద్రం భావిస్తోంది.
Bomb Threats: రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపులు?
పెట్రోల్పై యథాతథ స్థితి
డీజిల్ , ATF ధరల్లో మార్పులు చేసినప్పటికీ, పెట్రోల్ ఎగుమతి సుంకంలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో ఉన్న సుంకాన్నే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. సాధారణంగా దేశీయంగా ఇంధన కొరత ఏర్పడకుండా చూడటంతో పాటు, చమురు సంస్థలు ఎగుమతుల కంటే దేశీయ అవసరాలకే ప్రాధాన్యత ఇచ్చేలా ప్రభుత్వం ఇలాంటి పన్ను సవరణలు చేస్తుంటుంది.
నిర్ణయం వెనుక కారణాలు?
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల హెచ్చుతగ్గుల వల్ల చమురు శుద్ధి సంస్థలకు చేకూరే అదనపు లాభాలపై ప్రభుత్వం ఈ విండ్ఫాల్ ట్యాక్స్ను విధిస్తుంటుంది. దేశీయంగా నిల్వలను సమృద్ధిగా ఉంచడం , ఎగుమతుల ద్వారా వచ్చే భారీ లాభాలను నియంత్రించడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. కేంద్రం తీసుకున్న ఈ తాజా నిర్ణయం తక్షణమే అమల్లోకి రానుంది.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!